రవితేజ హీరోగా రమేష్ వర్మ రూపొందిస్తున్న ఖిలాడి మూవీ రీమేక్ అనే ప్రచారం ఆ సినిమా మొదలైనప్పట్నుంచి నడుస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో అరవింద్ స్వామి, త్రిష జంటగా నటించిన శతురంగ వేట్టై-2 ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు వార్తలొచ్చాయి. ఐతే రమేష్ వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. ఖిలాడి రీమేక్ కాదని అతను స్పష్టం చేశాడు.
కాకపోతే శతురంగ వేట్టై-2 పేరెత్తలేదు కానీ.. స్టోరీ లైన్ పరంగా ఓ తమిళ సినిమాతో దీనికి పోలిక ఉంటుందని రమేష్ చెప్పడం విశేషం. ఇంటర్వెల్ దగ్గర కీలక మలుపు చూసిన వాళ్లకు తమిళ సినిమాను పోలి ఉంటుందని అతనన్నాడు. ఈ చిత్ర రచయిత తనతో ఈ విషయం చర్చించాడని, నిర్మాతతో కూడా మాట్లాడిన తర్వాతే సినిమాను మొదలుపెట్టామని రమేష్ తెలిపాడు.
రవితేజ చివరి సినిమా క్రాక్ రిలీజ్ కావడానికి ముందే ఖిలాడి షూటింగ్ 40 శాతం పూర్తయిందని.. క్రాక్ పెద్ద హిట్టయింది కదా అని ఖిలాడి స్క్రిప్టులో మళ్లీ మార్పులేమీ చేయలేదని, ముందు అనుకున్న స్క్రిప్టుతోనే షూటింగ్ కొనసాగించామని.. ప్రస్తుతం సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తి కావచ్చిందని రమేష్ తెలిపాడు.
ఈ సినిమాకు సుజీత్ వాసుదేవన్ ఛాయాగ్రాహకుడని, 90 శాతం షూటింగ్ వరకు అతనే ఉన్నాడని, ఐతే వేరే సినిమా కోసం అత్యవసరంగా వెళ్లాల్సి ఉండటంతో మిగతా 10 శాతం షూటింగ్ బాధ్యతను క్రాక్ సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణుకు అప్పగించామని రమేష్ చెప్పాడు. ఖిలాడి సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడా అని అడిగితే.. ఇందులో మాస్ రాజా ఎన్ని పాత్రలు చేస్తున్నాడు, ఆ పాత్రల తాలూకు విశేషాలేంటి అనేది ఇప్పుడు చెప్పనని.. సినిమా రిలీజయ్యే వరకు వేచి చూడాల్సిందే అని, ఈ చిత్రంతో రవితేజ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అతనన్నాడు.
This post was last modified on June 7, 2021 2:15 pm
ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…
భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…
గుడివాడలో విజయం కోసం నాని నానాపాట్లు పడుతున్నారు. తన అనుచరుల ఆగడాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించేందుకు కష్టపడుతున్నారు. కానీ…
స్టార్ డైరెక్టర్లకు శిష్యరికం చేసి గొప్ప దర్శకులుగా ఎదిగిన వాళ్ళను చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దగ్గర…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కూటమిలో మరింత జోష్ పెరగబోతోంది. ఇప్పటికే విజయం ఖాయమనే ధీమాతో…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడం జగన్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. కానీ ఎంత చేసినా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా…