Movie News

బిగ్ బాస్ షోలో భూమిక.. స్పందించిన నటి!

ఒకప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా చాలా మంది అగ్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది భూమిక. ఆ తరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో వదిన, అక్క క్యారెక్టర్లు చేస్తూ బిజీగా అయింది. బాలీవుడ్ లో కూడా ఈ తరహా పాత్రలు పోషిస్తూ మెప్పిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఆమె బిగ్ బాస్ షోలో కనిపించబోతుందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ సీజన్ 15 కోసం కంటెస్టెంట్ గా భూమికను సంప్రదిస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.

తాజాగా వీటిపై స్పందించింది భూమిక. ఇదొక ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చింది. తనకు బిగ్ బాస్ ఆఫర్ రాలేదని చెప్పింది. గతంలో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 సమయంలో తనను కంటెస్టెంట్ గా సంప్రదించారని.. ఆ తరువాత కూడా అడిగారని కానీ ప్రతిసారీ తిరస్కరిస్తూ వచ్చానని స్పష్టం చేసింది. అయితే ఈసారి తనను ఎవరూ సంప్రదించలేదని.. ఒకవేళ ఆఫర్ చేసినా.. తను మాత్రం ఒప్పుకోనని తెగేసి చెప్పింది. తను పబ్లిక్ పర్సనాలిటీ అయినప్పటికీ.. తన లైఫ్ ప్రైవేట్ అని.. 24 గంటలు తనపై కెమెరాలు ఉండడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ షో గురించి అందరికీ తెలిసిన విషయమే. హౌస్ లో జరిగే ప్రతి సంఘటన, సంభాషణలు కెమెరాలో రికార్డ్ అవుతూనే ఉంటాయి. పైగా ఈ మధ్యకాలంలో హిందీ బిగ్ బాస్ షోలో గొడవలు, రొమాన్స్ డోస్ బాగా ఎక్కువైంది. సౌత్ బిగ్ బాస్ షోతో పోలిస్తే హిందీ షోలో వ్యవహారాలు కాస్త ఘాటుగా మారాయి. అందుకే చాలా మంది తారలు ఈ షోలోకి పార్టిసిపేట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఇక భూమికకు తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం నచ్చదు. అందుకే ఈ షోని రిజెక్ట్ చేస్తూ వచ్చింది.

This post was last modified on June 6, 2021 2:41 pm

Share

Recent Posts

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

3 minutes ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

21 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

25 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago