ఒకప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా చాలా మంది అగ్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది భూమిక. ఆ తరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో వదిన, అక్క క్యారెక్టర్లు చేస్తూ బిజీగా అయింది. బాలీవుడ్ లో కూడా ఈ తరహా పాత్రలు పోషిస్తూ మెప్పిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఆమె బిగ్ బాస్ షోలో కనిపించబోతుందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ సీజన్ 15 కోసం కంటెస్టెంట్ గా భూమికను సంప్రదిస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
తాజాగా వీటిపై స్పందించింది భూమిక. ఇదొక ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చింది. తనకు బిగ్ బాస్ ఆఫర్ రాలేదని చెప్పింది. గతంలో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 సమయంలో తనను కంటెస్టెంట్ గా సంప్రదించారని.. ఆ తరువాత కూడా అడిగారని కానీ ప్రతిసారీ తిరస్కరిస్తూ వచ్చానని స్పష్టం చేసింది. అయితే ఈసారి తనను ఎవరూ సంప్రదించలేదని.. ఒకవేళ ఆఫర్ చేసినా.. తను మాత్రం ఒప్పుకోనని తెగేసి చెప్పింది. తను పబ్లిక్ పర్సనాలిటీ అయినప్పటికీ.. తన లైఫ్ ప్రైవేట్ అని.. 24 గంటలు తనపై కెమెరాలు ఉండడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది.
బిగ్ బాస్ షో గురించి అందరికీ తెలిసిన విషయమే. హౌస్ లో జరిగే ప్రతి సంఘటన, సంభాషణలు కెమెరాలో రికార్డ్ అవుతూనే ఉంటాయి. పైగా ఈ మధ్యకాలంలో హిందీ బిగ్ బాస్ షోలో గొడవలు, రొమాన్స్ డోస్ బాగా ఎక్కువైంది. సౌత్ బిగ్ బాస్ షోతో పోలిస్తే హిందీ షోలో వ్యవహారాలు కాస్త ఘాటుగా మారాయి. అందుకే చాలా మంది తారలు ఈ షోలోకి పార్టిసిపేట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఇక భూమికకు తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం నచ్చదు. అందుకే ఈ షోని రిజెక్ట్ చేస్తూ వచ్చింది.
This post was last modified on June 6, 2021 2:41 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…