పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. రాజకీయాల్లో కొనసాగుతూనే.. కాస్త వీలు చేసుకుని చకచకా కొన్ని సినిమాలు చేసేయాలని పవన్ ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగానే కేవలం 30 రోజుల కాల్ షీట్లు ఇచ్చి వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. క్రిష్ సినిమా కోసం ఇంకాస్త ఎక్కువ కష్టపడటానికి సిద్ధమయ్యాడు. ఈ రెండు చిత్రాల్ని ఈ ఏడాదే పూర్తి చేయాలన్నది పవన్ ప్లాన్.
అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈపాటికి వకీల్ సాబ్ రిలీజ్ కూడా అయి ఉండాల్సింది. కానీ కరోనా వచ్చి పడి అన్ని ప్రణాళికల్ని నాశనం చేసింది. మళ్లీ షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. మొదలయ్యాక వకీల్ సాబ్కు సంబంధించి అయితే వారం పది రోజుల పాటు పవన్ పని చేస్తే సరిపోతుంది.
ఆ తర్వాత క్రిష్ సినిమా కోసం కొంచెం గట్టిగా పని చేయాల్సి ఉంటుంది పవన్. మళ్లీ షూటింగ్స్ మొదలయ్యే సమయానికి ఏం చేయాలనే విషయంలో చిత్ర బృందం పక్కా ప్రణాళికతో రెడీ అవుతున్నట్లు సమాచారం. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నార్త్ ఇండియాకు వెళ్లాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ మారింది.
ఎలాంటి సన్నివేశాలైనా సరే.. రామోజీ ఫిలిం సిటీలో సెట్టింగ్స్ వేసుకుని అక్కడే చిత్రీకరణ జరపాలని.. అలా కాకుంటే సినిమా చాలా లేటైపోతుందని భావిస్తున్నారట. దర్శకుడు క్రిష్, ఆర్ట్ డైరెక్టర్ కలిసి ఫిలిం సిటీలో పర్యటించి కొన్ని ప్రాంతాల్ని ఎంచుకుని.. అక్కడ ఎలాంటి సెట్లు వేయాలో ప్లాన్ గీసేశారట. మళ్లీ షూటింగ్స్ ఆరంభమయ్యాక పవన్ కొన్ని రోజులు వకీల్ సాబ్ కోసం పని చేస్తాడు. ఈ గ్యాప్లో సెట్లు తీర్చిదిద్దుకునే పనిలో పడుతుంది క్రిష్ టీం. తర్వాత పవన్ రాగానే వేగంగా షూటింగ్ చేయాలన్నది ప్రణాళిక.
This post was last modified on May 16, 2020 11:58 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…