కరోనా కాలంగా థియేటర్లు తెరవకపోవడంతో చాలా సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో నటించిన ‘రాధె’ సినిమాను సైతం ఒకేసారి ఓటీటీలో, అందుబాటులో ఉన్న థియేటర్లలో విడుదల చేశారు. ఒకప్పుడు చిన్న సినిమాలు మాత్రమే నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థలు కూడా క్రేజీ ప్రాజెక్ట్ లను సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో మీడియం, స్టార్ హీరోల సినిమాలపై దృష్టి పెడుతున్నాయి.
నాని నటించిన ‘టక్ జగదీష్’, విశ్వక్ సేన్ ‘పాగల్’, రవితేజ ‘ఖిలాడి’ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసే విధంగా మంచి రేట్ ఆఫర్ చేశాయి. కానీ ఈ సినిమాల దర్శకనిర్మాతలు తమ సినిమాలను నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. హీరోలెవరూ కూడా తమ సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి అంగీకరించడం లేదు. తమ సినిమాలు ముందుగా థియేటర్లోనే విడుదల కావాలంటూ పట్టుబట్టి కూర్చున్నారు. మరోపక్క నిర్మాతలకు ఓటీటీ సంస్థల నుండి ఒత్తిడి పెరుగుతోందని సమాచారం.
అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి పేరున్న ఓటీటీ సంస్థలు దర్శకనిర్మాతలతో మంతనాలు జరుపుతున్నాయి. ఈ సంస్థలు ఆఫర్ చేస్తున్న డీల్ చాలా టెంప్టింగ్ గా ఉన్నప్పటికీ నిర్మాతలు మాత్రం నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. హీరోలు డిజిటల్ రిలీజ్ కి ఒప్పుకోకపోవడమే దానికి కారణమని తెలుస్తోంది. వారిని ఎదిరించి ఓటీటీలతో ఒప్పందం కుదుర్చుకునే ధైర్యం లేక నిర్మాతలు సైలెంట్ గా ఊరుకుంటున్నారట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లు తెరుచుకున్నా యాభై శాతం ఆక్యుపెన్సీతో నడిపిస్తారు. జనాలు ఎంతవరకు థియేటర్లకు వస్తారో చెప్పలేని పరిస్థితి. ఇన్ని సందేహాల నడుమ ఓటీటీకి సినిమాను అమ్మితే లాభాలైనా వస్తాయని నిర్మాతలు భావిస్తున్నారట. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on June 4, 2021 8:02 am
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…