కరోనా కాలంగా థియేటర్లు తెరవకపోవడంతో చాలా సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో నటించిన ‘రాధె’ సినిమాను సైతం ఒకేసారి ఓటీటీలో, అందుబాటులో ఉన్న థియేటర్లలో విడుదల చేశారు. ఒకప్పుడు చిన్న సినిమాలు మాత్రమే నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థలు కూడా క్రేజీ ప్రాజెక్ట్ లను సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో మీడియం, స్టార్ హీరోల సినిమాలపై దృష్టి పెడుతున్నాయి.
నాని నటించిన ‘టక్ జగదీష్’, విశ్వక్ సేన్ ‘పాగల్’, రవితేజ ‘ఖిలాడి’ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసే విధంగా మంచి రేట్ ఆఫర్ చేశాయి. కానీ ఈ సినిమాల దర్శకనిర్మాతలు తమ సినిమాలను నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. హీరోలెవరూ కూడా తమ సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి అంగీకరించడం లేదు. తమ సినిమాలు ముందుగా థియేటర్లోనే విడుదల కావాలంటూ పట్టుబట్టి కూర్చున్నారు. మరోపక్క నిర్మాతలకు ఓటీటీ సంస్థల నుండి ఒత్తిడి పెరుగుతోందని సమాచారం.
అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి పేరున్న ఓటీటీ సంస్థలు దర్శకనిర్మాతలతో మంతనాలు జరుపుతున్నాయి. ఈ సంస్థలు ఆఫర్ చేస్తున్న డీల్ చాలా టెంప్టింగ్ గా ఉన్నప్పటికీ నిర్మాతలు మాత్రం నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. హీరోలు డిజిటల్ రిలీజ్ కి ఒప్పుకోకపోవడమే దానికి కారణమని తెలుస్తోంది. వారిని ఎదిరించి ఓటీటీలతో ఒప్పందం కుదుర్చుకునే ధైర్యం లేక నిర్మాతలు సైలెంట్ గా ఊరుకుంటున్నారట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లు తెరుచుకున్నా యాభై శాతం ఆక్యుపెన్సీతో నడిపిస్తారు. జనాలు ఎంతవరకు థియేటర్లకు వస్తారో చెప్పలేని పరిస్థితి. ఇన్ని సందేహాల నడుమ ఓటీటీకి సినిమాను అమ్మితే లాభాలైనా వస్తాయని నిర్మాతలు భావిస్తున్నారట. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on June 4, 2021 8:02 am
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…