21 ఏళ్ల వయసులోనే ‘ధ్రువంగల్ పదినారు’ అనే వైవిధ్యమైన థ్రిల్లర్ సినిమా తీసి కోలీవుడ్లో ెన్సేషన్ క్రియేట్ చేశాడు యువ దర్శకుడు కార్తీక్ నరేన్. ఈ చిత్రం తెలుగులో ’16’ పేరుతో విడుదలై ఇక్కడా మంచి ఫలితాన్నందుకుంది. కార్తీక్ టాలెంట్కు ఫిదా అయిపోయి అతడి రెండో సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు అగ్ర దర్శకుడు గౌతమ్ మీనన్. కానీ ఈ ప్రోత్సాహమే కార్తీక్కు శాపంగా మారింది. సినిమా పూర్తయింది. కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. అందుక్కారణం గౌతమ్ మీనన్కు ఉన్న ఆర్థిక వివాదాలు. మూడేళ్లకు పైగా ఈ సినిమా విడుదల కాకుండా ఆగిపోయింది. కార్తీక్ మూడో సినిమా ‘మాఫియా’ కూడా రిలీజ్ కాగా.. దీనికి మాత్రం మోక్షం కలగలేదు.
ఇక ఎప్పటికీ ఈ చిత్రం విడుదలకు నోచుకోదేమో అనుకున్నారంతా. ఐతే తన వల్ల ఇలాగే ఆగిపోయిన ధనుష్ సినిమా ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ను రెండేళ్ల కిందట అతి కష్టం మీద రిలీజ్ చేసిన గౌతమ్.. ఎట్టకేలకు ‘నరకాసురన్’ను కూడా బయటికి తేవడానికి రంగం సిద్ధం చేసినట్లున్నాడు. ‘నరకాసురన్’ను విడుదల చేయడానికి ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కాగా.. ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్కు రెడీ చేసినట్లు తెలుస్లోంది. ‘సోనీ లైవ్’ ద్వారా ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుందట. కార్తీక్ తొలి చిత్రం ‘ధ్రువంగల్ పదినారు’కు కొనసాగింపుగానే ‘నరకాసురన్’ తీశాడు కార్తీక్.
ఈ చిత్రంలో మన తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన వాళ్లే ముఖ్య పాత్రలు పోషించారు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్తోె పాటు శ్రియ, అరవింద్ స్వామి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నరకాసురుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా సందీప్ కిషన్ నటించిన మరో తమిళ చిత్రం కూడా ఓటీటీలోనే విడుదల కానుండటం విశేషం. ఆ సినిమా పేరు.. కసాడ తపర. ఇదొక ఆంథాలజీ ఫిలిం. సందీప్తో పాటు హరీష్ కళ్యాణ్, రెజీనా కసాండ్రా, దర్శకుడు వెంకట్ ప్రభు ఇందులో కీలక పాత్రలు పోషించారు. సోనీ లైవ్లోనే జులైలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
This post was last modified on June 2, 2021 9:47 am
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…