Categories: Movie News

ఆ సినిమా ఎట్టకేలకు రిలీజ్..

21 ఏళ్ల వయసులోనే ‘ధ్రువంగల్ పదినారు’ అనే వైవిధ్యమైన థ్రిల్లర్ సినిమా తీసి కోలీవుడ్లో ెన్సేషన్ క్రియేట్ చేశాడు యువ దర్శకుడు కార్తీక్ నరేన్. ఈ చిత్రం తెలుగులో ’16’ పేరుతో విడుదలై ఇక్కడా మంచి ఫలితాన్నందుకుంది. కార్తీక్‌ టాలెంట్‌కు ఫిదా అయిపోయి అతడి రెండో సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు అగ్ర దర్శకుడు గౌతమ్ మీనన్. కానీ ఈ ప్రోత్సాహమే కార్తీక్‌కు శాపంగా మారింది. సినిమా పూర్తయింది. కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. అందుక్కారణం గౌతమ్ మీనన్‌కు ఉన్న ఆర్థిక వివాదాలు. మూడేళ్లకు పైగా ఈ సినిమా విడుదల కాకుండా ఆగిపోయింది. కార్తీక్ మూడో సినిమా ‘మాఫియా’ కూడా రిలీజ్ కాగా.. దీనికి మాత్రం మోక్షం కలగలేదు.

ఇక ఎప్పటికీ ఈ చిత్రం విడుదలకు నోచుకోదేమో అనుకున్నారంతా. ఐతే తన వల్ల ఇలాగే ఆగిపోయిన ధనుష్ సినిమా ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ను రెండేళ్ల కిందట అతి కష్టం మీద రిలీజ్ చేసిన గౌతమ్.. ఎట్టకేలకు ‘నరకాసురన్’ను కూడా బయటికి తేవడానికి రంగం సిద్ధం చేసినట్లున్నాడు. ‘నరకాసురన్’ను విడుదల చేయడానికి ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కాగా.. ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్‌కు రెడీ చేసినట్లు తెలుస్లోంది. ‘సోనీ లైవ్’ ద్వారా ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుందట. కార్తీక్ తొలి చిత్రం ‘ధ్రువంగల్ పదినారు’కు కొనసాగింపుగానే ‘నరకాసురన్’ తీశాడు కార్తీక్.

ఈ చిత్రంలో మన తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన వాళ్లే ముఖ్య పాత్రలు పోషించారు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌తోె పాటు శ్రియ, అరవింద్ స్వామి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నరకాసురుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా సందీప్ కిషన్ నటించిన మరో తమిళ చిత్రం కూడా ఓటీటీలోనే విడుదల కానుండటం విశేషం. ఆ సినిమా పేరు.. కసాడ తపర. ఇదొక ఆంథాలజీ ఫిలిం. సందీప్‌తో పాటు హరీష్ కళ్యాణ్, రెజీనా కసాండ్రా, దర్శకుడు వెంకట్ ప్రభు ఇందులో కీలక పాత్రలు పోషించారు. సోనీ లైవ్‌లోనే జులైలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

This post was last modified on June 2, 2021 9:47 am

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

27 minutes ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

1 hour ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

2 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

3 hours ago