టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు సుకుమార్. మొదటి నుంచి కూడా సరికొత్త కాన్సెప్ట్ లను ఎన్నుకుంటూ తన ప్రతిభను చాటుతున్నారు. ‘రంగస్థలం’ సినిమా తరువాత సుకుమార్ క్రేజ్ మరింత పెరిగింది. స్టార్ హీరోలు సుకుమార్ తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓ పక్క దర్శకుడిగా భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూనే మరోపక్క సుకుమార్ రైటింగ్స్ పేరుతో బ్యానర్ పెట్టి చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారు.
కొన్ని నెలల ముందు వరకు సుకుమార్ స్నేహితుడు ప్రసాద్ అనే వ్యక్తి సుకుమార్ రైటింగ్స్ కి సంబంధించిన వ్యవహారాలు చూసుకునేవారు. కానీ రీసెంట్ గా ఆయన మరణించారు. దీంతో ఈ బ్యానర్ కు కొత్త మ్యానేజర్ ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సుకుమార్ తన భార్య తబితను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. మూడేళ్లక్రితం తబిత ‘లాండ్రీకార్ట్’ అనే పేరుతో డ్రై క్లీనింగ్ బిజినెస్ ను మొదలుపెట్టారు. అయితే లాక్ డౌన్ కారణంగా గతేడాది నుండి ఈ వ్యాపారం కాస్త డల్ గా నడుస్తోంది.
అందుకే తబిత కూడా సుకుమార్ రైటింగ్స్ నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. సుకుమార్ గైడెన్స్ లో ఈ పనులను చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ నిఖిల్ నటిస్తోన్న ’18 పేజెస్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇక సుకుమార్ విషయానికొస్తే.. ఆయన ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా తీయడానికి సిద్ధమయ్యారు. కాబట్టి వచ్చే ఏడాది వరకు ఆయన బిజీగా ఉంటారు. ఆ తరువాత విజయ్ దేవరకొండతో సినిమా తీసే ఛాన్స్ ఉంది!
This post was last modified on June 2, 2021 6:06 am
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…