టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు సుకుమార్. మొదటి నుంచి కూడా సరికొత్త కాన్సెప్ట్ లను ఎన్నుకుంటూ తన ప్రతిభను చాటుతున్నారు. ‘రంగస్థలం’ సినిమా తరువాత సుకుమార్ క్రేజ్ మరింత పెరిగింది. స్టార్ హీరోలు సుకుమార్ తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓ పక్క దర్శకుడిగా భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూనే మరోపక్క సుకుమార్ రైటింగ్స్ పేరుతో బ్యానర్ పెట్టి చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారు.
కొన్ని నెలల ముందు వరకు సుకుమార్ స్నేహితుడు ప్రసాద్ అనే వ్యక్తి సుకుమార్ రైటింగ్స్ కి సంబంధించిన వ్యవహారాలు చూసుకునేవారు. కానీ రీసెంట్ గా ఆయన మరణించారు. దీంతో ఈ బ్యానర్ కు కొత్త మ్యానేజర్ ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సుకుమార్ తన భార్య తబితను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. మూడేళ్లక్రితం తబిత ‘లాండ్రీకార్ట్’ అనే పేరుతో డ్రై క్లీనింగ్ బిజినెస్ ను మొదలుపెట్టారు. అయితే లాక్ డౌన్ కారణంగా గతేడాది నుండి ఈ వ్యాపారం కాస్త డల్ గా నడుస్తోంది.
అందుకే తబిత కూడా సుకుమార్ రైటింగ్స్ నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. సుకుమార్ గైడెన్స్ లో ఈ పనులను చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ నిఖిల్ నటిస్తోన్న ’18 పేజెస్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇక సుకుమార్ విషయానికొస్తే.. ఆయన ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా తీయడానికి సిద్ధమయ్యారు. కాబట్టి వచ్చే ఏడాది వరకు ఆయన బిజీగా ఉంటారు. ఆ తరువాత విజయ్ దేవరకొండతో సినిమా తీసే ఛాన్స్ ఉంది!
This post was last modified on June 2, 2021 6:06 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…