టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు సుకుమార్. మొదటి నుంచి కూడా సరికొత్త కాన్సెప్ట్ లను ఎన్నుకుంటూ తన ప్రతిభను చాటుతున్నారు. ‘రంగస్థలం’ సినిమా తరువాత సుకుమార్ క్రేజ్ మరింత పెరిగింది. స్టార్ హీరోలు సుకుమార్ తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓ పక్క దర్శకుడిగా భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూనే మరోపక్క సుకుమార్ రైటింగ్స్ పేరుతో బ్యానర్ పెట్టి చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారు.
కొన్ని నెలల ముందు వరకు సుకుమార్ స్నేహితుడు ప్రసాద్ అనే వ్యక్తి సుకుమార్ రైటింగ్స్ కి సంబంధించిన వ్యవహారాలు చూసుకునేవారు. కానీ రీసెంట్ గా ఆయన మరణించారు. దీంతో ఈ బ్యానర్ కు కొత్త మ్యానేజర్ ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సుకుమార్ తన భార్య తబితను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. మూడేళ్లక్రితం తబిత ‘లాండ్రీకార్ట్’ అనే పేరుతో డ్రై క్లీనింగ్ బిజినెస్ ను మొదలుపెట్టారు. అయితే లాక్ డౌన్ కారణంగా గతేడాది నుండి ఈ వ్యాపారం కాస్త డల్ గా నడుస్తోంది.
అందుకే తబిత కూడా సుకుమార్ రైటింగ్స్ నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. సుకుమార్ గైడెన్స్ లో ఈ పనులను చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ నిఖిల్ నటిస్తోన్న ’18 పేజెస్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇక సుకుమార్ విషయానికొస్తే.. ఆయన ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా తీయడానికి సిద్ధమయ్యారు. కాబట్టి వచ్చే ఏడాది వరకు ఆయన బిజీగా ఉంటారు. ఆ తరువాత విజయ్ దేవరకొండతో సినిమా తీసే ఛాన్స్ ఉంది!
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల…
టాలీవుడ్ యంగ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో జరిగిన మార్పులు, ఆ వెంటనే వారు అందుకున్న సక్సెస్ లపై నెటిజన్లు…
తెలుగులో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీకి వంద కోట్ల వసూళ్లు రావడం అన్నది అనూహ్యమే. అందులోనూ అది ఫ్యామిలీ సినిమా…
వీకెండ్ వసూళ్లను ఘనంగా రాబట్టుకున్న లెనిన్ అసలు పరీక్ష మొదలుపెట్టింది. సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద…