టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు సుకుమార్. మొదటి నుంచి కూడా సరికొత్త కాన్సెప్ట్ లను ఎన్నుకుంటూ తన ప్రతిభను చాటుతున్నారు. ‘రంగస్థలం’ సినిమా తరువాత సుకుమార్ క్రేజ్ మరింత పెరిగింది. స్టార్ హీరోలు సుకుమార్ తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓ పక్క దర్శకుడిగా భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూనే మరోపక్క సుకుమార్ రైటింగ్స్ పేరుతో బ్యానర్ పెట్టి చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారు.
కొన్ని నెలల ముందు వరకు సుకుమార్ స్నేహితుడు ప్రసాద్ అనే వ్యక్తి సుకుమార్ రైటింగ్స్ కి సంబంధించిన వ్యవహారాలు చూసుకునేవారు. కానీ రీసెంట్ గా ఆయన మరణించారు. దీంతో ఈ బ్యానర్ కు కొత్త మ్యానేజర్ ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సుకుమార్ తన భార్య తబితను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. మూడేళ్లక్రితం తబిత ‘లాండ్రీకార్ట్’ అనే పేరుతో డ్రై క్లీనింగ్ బిజినెస్ ను మొదలుపెట్టారు. అయితే లాక్ డౌన్ కారణంగా గతేడాది నుండి ఈ వ్యాపారం కాస్త డల్ గా నడుస్తోంది.
అందుకే తబిత కూడా సుకుమార్ రైటింగ్స్ నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. సుకుమార్ గైడెన్స్ లో ఈ పనులను చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ నిఖిల్ నటిస్తోన్న ’18 పేజెస్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇక సుకుమార్ విషయానికొస్తే.. ఆయన ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా తీయడానికి సిద్ధమయ్యారు. కాబట్టి వచ్చే ఏడాది వరకు ఆయన బిజీగా ఉంటారు. ఆ తరువాత విజయ్ దేవరకొండతో సినిమా తీసే ఛాన్స్ ఉంది!
This post was last modified on June 2, 2021 6:06 am
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…