Movie News

చిరు డైరెక్టర్ మారలేదు.. ఇదిగో క్లారిటీ!

ఈ మధ్యకాలంలో ఏ సినిమా మీద రానన్ని రూమర్స్ చిరంజీవి 153వ సినిమాపై వచ్చాయి. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న చిరు తన తదుపరి చిత్రంగా ‘లూసిఫర్’ రీమేక్ లో నటించాలనుకున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం ముందుగా వినాయక్, సుజీత్ లాంటి దర్శకులను అనుకొని ఫైనల్ గా మోహన్ రాజాను ఫిక్స్ చేశారు.

అయితే సినిమాను లాంచ్ చేసి చాలా కాలం అవుతున్నప్పటికీ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. పైగా ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో రకరకాల పుకార్లు మొదలయ్యాయి. మోహన్ రాజా చేసిన మార్పులు చిరుకి నచ్చలేదని.. దీంతో ఆయన కొన్నాళ్లు ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టనున్నారని వార్తలొచ్చాయి. ఇది కాకుండా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిరు సినిమాల షూటింగ్ లకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు కాబట్టి ‘లూసిఫర్’ రీమేక్ ఇప్పట్లో రాదంటూ మరికొన్ని వార్తలు వినిపించాయి.

ఇప్పటివరకు వీటిపై మెగా కాంపౌండ్ స్పందించింది లేదు. కానీ ఈరోజు మోహన్ రాజా పుట్టినరోజు సందర్భంగా ఈ రూమర్లకు చెక్ పెట్టింది. కొణిదెల ప్రొడక్షన్స్, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు మోహన్ రాజాకు బర్త్ డే విషెస్ తెలిపాయి. ”మా #చిరు153 దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు” అనే పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాయి. అలా మరోసారి అధికారికంగా ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాయి. అంతేకాకుండా.. ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ పనులు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ‘ఆచార్య’ మిగిలిన పోర్షన్ పూర్తి కాగానే.. ‘లూసిఫర్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది.

This post was last modified on May 30, 2021 1:29 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…

48 mins ago

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

4 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

4 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

5 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

5 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

6 hours ago