ఈ మధ్యకాలంలో ఏ సినిమా మీద రానన్ని రూమర్స్ చిరంజీవి 153వ సినిమాపై వచ్చాయి. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న చిరు తన తదుపరి చిత్రంగా ‘లూసిఫర్’ రీమేక్ లో నటించాలనుకున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం ముందుగా వినాయక్, సుజీత్ లాంటి దర్శకులను అనుకొని ఫైనల్ గా మోహన్ రాజాను ఫిక్స్ చేశారు.
అయితే సినిమాను లాంచ్ చేసి చాలా కాలం అవుతున్నప్పటికీ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. పైగా ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో రకరకాల పుకార్లు మొదలయ్యాయి. మోహన్ రాజా చేసిన మార్పులు చిరుకి నచ్చలేదని.. దీంతో ఆయన కొన్నాళ్లు ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టనున్నారని వార్తలొచ్చాయి. ఇది కాకుండా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిరు సినిమాల షూటింగ్ లకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు కాబట్టి ‘లూసిఫర్’ రీమేక్ ఇప్పట్లో రాదంటూ మరికొన్ని వార్తలు వినిపించాయి.
ఇప్పటివరకు వీటిపై మెగా కాంపౌండ్ స్పందించింది లేదు. కానీ ఈరోజు మోహన్ రాజా పుట్టినరోజు సందర్భంగా ఈ రూమర్లకు చెక్ పెట్టింది. కొణిదెల ప్రొడక్షన్స్, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు మోహన్ రాజాకు బర్త్ డే విషెస్ తెలిపాయి. ”మా #చిరు153 దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు” అనే పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాయి. అలా మరోసారి అధికారికంగా ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాయి. అంతేకాకుండా.. ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ పనులు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ‘ఆచార్య’ మిగిలిన పోర్షన్ పూర్తి కాగానే.. ‘లూసిఫర్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది.
This post was last modified on May 30, 2021 1:29 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…