‘అ!’ లాంటి ప్రయోగాత్మక సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత కల్కి, జాంబి రెడ్డి డిఫరెంట్సి మూవీస్ తీసిన తీసిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ.. తాజాగా ‘హనుమాన్’ అనే సోషియో ఫాంటసీ మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో ఇదే తొలి సూపర్ హీరో సినిమా అని ప్రశాంత్ అంటున్నాడు. ఐతే కొన్ని దశాబ్దాల కిందటే సీనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ‘సూపర్ మ్యాన్’ అనే సినిమా రావడం ప్రశాంత్కు తెలిసి ఉండకపోవచ్చు.
ఐతే తన సినిమాలకు ఓ రేంజిలో ఎలివేషన్ ఇచ్చుకుంటూ ప్రశాంత్కు మొదట్నుంచి ఇలా ఘనమైన ప్రకటనలు ఇవ్వడం అలవాటే. నిజానికి అతడి తొలి మూడు చిత్రాల్లో పూర్తి స్థాయిలో ఏదీ ప్రేక్షకులను మెప్పించలేదు.
‘అ!’ మూవీని మంచి ప్రయోగంగా పేర్కొన్నవాళ్లూ ఉన్నారు. అదే సమయంలో అదొక వేస్ట్ మూవీ అన్న వాళ్లూ లేకపోలేదు. ‘కల్కి’ అయితే పూర్తిగా నిరాశకు గురి చేసింది. ‘జాంబి రెడ్డి’ మిక్స్డ్ ఫీలింగ్ ఇచ్చింది. మరి భారీ బిల్డప్తో అనౌన్స్ చేసిన ‘హనుమాన్’ సంగతేంటో చూడాలి. ఇంతకీ ప్రశాంత్ చెబుతున్న ప్రకారం తెలుగులో తొలి సూపర్ హీరోగా కనిపించబోయే నటుడెవరన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
కొన్ని రోజుల కిందట ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో త్వరలోనే తన కొత్త సినిమాను ప్రకటించనున్నానని, అదొక డిఫరెంట్ జానర్లో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని.. ఐతే ఈ చిత్రానికి హీరో ఇంకా ఖరారవ్వలేదని.. సినిమా ప్రకటించే సమయానికి ఏ స్టార్ హీరో ఖాళీగా ఉంటే ఆ హీరోతో చేస్తానని.. లేదంటే కొత్త హీరోతోనే ఈ చిత్రం ఉంటుందని చెప్పాడు. ఐతే నిజానికి ఇప్పుడు ప్రశాంత్కు ఏ స్టార్ హీరో కూడా దొరకట్లేదని.. ‘జాంబిరెడ్డి’ హీరో తేజ సజ్జానే ఈ చిత్రంలో లీడ్ రోల్కు ఓకే అయ్యాడని.. త్వరలోనే ఈ మేరకు ప్రకటన చేయనున్నారని అంటున్నారు. ఓ మోస్తరు బడ్జెట్లోనే ఈ సినిమా తీయడానికి ప్రశాంత్ సన్నాహాలు చేసుకుంటున్నాడు.
This post was last modified on May 29, 2021 11:00 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…