ఇంతకుముందు వైరముత్తు పేరెత్తితే తమిళులు అంత గొప్ప కవి, గేయ రచయిత తమ వాడని గర్వపడేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారిపోయింది. ‘మీ టూ’ మూమెంట్ మొదలయ్యాక గాయని చిన్మయి, తదితరులు వైరముత్తు మీద చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన ఇమేజ్ బాగానే డ్యామేజ్ అయింది. వైరముత్తు మీద కేసులేమీ నమోదు కాలేదు. ఆయనపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. అయినా సరే.. జనాల దృష్టిలో ఆయన బాగానే చెడు అయ్యారు.
ఒకరో ఇద్దరో అయితే ఓకే కానీ.. రెండంకెల సంఖ్యలో అమ్మాయిలు ఆయనపై ఆరోపణలు చేశారు. చిన్మయి తన వాదనల్ని చాలా బలంగానే వినిపించింది.ప్రతి దానికీ సాక్ష్యాలు తెచ్చి చూపించలేదు కానీ.. తను చెప్పిన ఉదంతాల గురించి వింటుంటే వైరముత్తులో జనాలకు తెలియని కోణం ఉందనే అనిపించింది చాలామందికి.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు వైరముత్తు చేసిన చేపట్టిన ఒక ప్రాజెక్టు విమర్శల పాలవుతోంది. ‘నాట్పదు తెరల్’ పేరుతో వంద పాటల ప్రాజెక్టులో వైరముత్తు భాగమయ్యారు. ఇందులో భాగంగా ఆయన వంద ప్రేమ గీతాలు రాస్తారు. ప్రతి పాటలోనూ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ నేపథ్యంలో వీడియో సాంగ్ రూపొందించి రిలీజ్ చేస్తారు. ఈ క్రమంలో ముందుగా ‘ఎన్ కాదలా’ పేరుతో ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఎన్నై అరిందాల్, విశ్వాసం సినిమాల్లో బాలనటిగా ఆకట్టుకున్న టీనేజ్ అమ్మాయి అనైక మీద ఈ పాట తీశారు.
తనతో పోలిస్తే రెట్టింపు కన్నా ఎక్కువ వయసున్న ఓ నడి వయస్కుడిని చూసి పదహారేళ్ల అమ్మాయి ఆకర్షితురాలై ప్రేమలో పడే కాన్సెప్ట్తో ఈ పాట రూపొందడం గమనార్హం. ప్రేమకు వయసు అడ్డు కాదనే వాక్యాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆమె ప్రేమించేది ఓ కవిని కావడంతో జనాలు వైరముత్తు వ్యక్తిగత జీవితంతో రిలేట్ చేసుకుంటున్నారు. తనతో పోలిస్తే వయసులో చాలా చిన్న వాళ్లయిన అమ్మాయిలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొన్న వైరముత్తు.. తన ఆలోచనలను పరోక్షంగా ఈ పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడని, ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్నాక ఆయనకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో అని నెటిజన్లు ఆశ్చర్యపోతూ ఆయన తీరును దుయ్యబడుతున్నారు.
This post was last modified on May 27, 2021 3:28 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…