బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. కమల్ ఆర్.ఖాన్ అనే క్రిటిక్ మీద పరువు నష్టం దావా వేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలే జీ5, జీప్లస్ ఓటీటీ ద్వారా విడుదలైన తన కొత్త చిత్రం గురించి కమల్ ఇచ్చిన వీడియో రివ్యూ చూసి ఆగ్రహించి సల్మాన్ అతడికి నోటీసులు ఇచ్చినట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి.
ఐతే సినిమాకు సమీక్ష ఇవ్వడంలో తప్పేముంది, ఆ మాత్రానికే పరువు నష్టం దావానా అన్న సందేహాలు రావడం సహజం. ఆ మాటకొస్తే రాధె సినిమా మీద చాలామంది క్రిటిక్స్ నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. సినిమాను ఏకిపడేశారు. మరి కమల్ ఆర్.ఖాన్ మీద మాత్రమే సల్మాన్ టీం ఇలా దావా వేయడం ఏంటన్నది ప్రశ్న. దీనికి సమాధానం సల్మాన్ సన్నిహిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
కమల్.ఆర్.ఖాన్ బాలీవుడ్ స్టార్ల గురించి తన సమీక్షల్లో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తుంటాడు. మొదట్నుంచి వివాదాస్పద వ్యాఖ్యలతోనే అతను సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. సినిమా సమీక్షల్లోనూ హీరోలను వ్యక్తిగతంగా దూషించడం అతడికి అలవాటు. రాధె రివ్యూలో కూడా సల్మాన్ను ఉద్దేశించి చోర్ అనడం అతడి టీం గుర్తించిందట. సినిమా గురించి రివ్యూ ఇస్తూ ఇలా వ్యక్తిగతంగా దూషించడం పట్ల సల్మాన్ టీంలో ఆగ్రహం వ్యక్తమైంది.
గతంలోనూ కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండటంతో ఈసారి అతడికి గట్టిగా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో పరువు నష్టం దావా వేశారని.. ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదలాలనుకోవట్లేదని.. ఇంకోసారి సల్మాన్ గురించే కాక వేరే హీరోల గురించి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి భయపడేలా అతడికి గుణపాఠం నేర్పాలని డిసైడైనట్లు తెలుస్తోంది.
This post was last modified on May 27, 2021 8:37 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…