బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. కమల్ ఆర్.ఖాన్ అనే క్రిటిక్ మీద పరువు నష్టం దావా వేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలే జీ5, జీప్లస్ ఓటీటీ ద్వారా విడుదలైన తన కొత్త చిత్రం గురించి కమల్ ఇచ్చిన వీడియో రివ్యూ చూసి ఆగ్రహించి సల్మాన్ అతడికి నోటీసులు ఇచ్చినట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి.
ఐతే సినిమాకు సమీక్ష ఇవ్వడంలో తప్పేముంది, ఆ మాత్రానికే పరువు నష్టం దావానా అన్న సందేహాలు రావడం సహజం. ఆ మాటకొస్తే రాధె సినిమా మీద చాలామంది క్రిటిక్స్ నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. సినిమాను ఏకిపడేశారు. మరి కమల్ ఆర్.ఖాన్ మీద మాత్రమే సల్మాన్ టీం ఇలా దావా వేయడం ఏంటన్నది ప్రశ్న. దీనికి సమాధానం సల్మాన్ సన్నిహిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
కమల్.ఆర్.ఖాన్ బాలీవుడ్ స్టార్ల గురించి తన సమీక్షల్లో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తుంటాడు. మొదట్నుంచి వివాదాస్పద వ్యాఖ్యలతోనే అతను సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. సినిమా సమీక్షల్లోనూ హీరోలను వ్యక్తిగతంగా దూషించడం అతడికి అలవాటు. రాధె రివ్యూలో కూడా సల్మాన్ను ఉద్దేశించి చోర్ అనడం అతడి టీం గుర్తించిందట. సినిమా గురించి రివ్యూ ఇస్తూ ఇలా వ్యక్తిగతంగా దూషించడం పట్ల సల్మాన్ టీంలో ఆగ్రహం వ్యక్తమైంది.
గతంలోనూ కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండటంతో ఈసారి అతడికి గట్టిగా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో పరువు నష్టం దావా వేశారని.. ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదలాలనుకోవట్లేదని.. ఇంకోసారి సల్మాన్ గురించే కాక వేరే హీరోల గురించి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి భయపడేలా అతడికి గుణపాఠం నేర్పాలని డిసైడైనట్లు తెలుస్తోంది.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…