బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. కమల్ ఆర్.ఖాన్ అనే క్రిటిక్ మీద పరువు నష్టం దావా వేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలే జీ5, జీప్లస్ ఓటీటీ ద్వారా విడుదలైన తన కొత్త చిత్రం గురించి కమల్ ఇచ్చిన వీడియో రివ్యూ చూసి ఆగ్రహించి సల్మాన్ అతడికి నోటీసులు ఇచ్చినట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి.
ఐతే సినిమాకు సమీక్ష ఇవ్వడంలో తప్పేముంది, ఆ మాత్రానికే పరువు నష్టం దావానా అన్న సందేహాలు రావడం సహజం. ఆ మాటకొస్తే రాధె సినిమా మీద చాలామంది క్రిటిక్స్ నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. సినిమాను ఏకిపడేశారు. మరి కమల్ ఆర్.ఖాన్ మీద మాత్రమే సల్మాన్ టీం ఇలా దావా వేయడం ఏంటన్నది ప్రశ్న. దీనికి సమాధానం సల్మాన్ సన్నిహిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
కమల్.ఆర్.ఖాన్ బాలీవుడ్ స్టార్ల గురించి తన సమీక్షల్లో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తుంటాడు. మొదట్నుంచి వివాదాస్పద వ్యాఖ్యలతోనే అతను సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. సినిమా సమీక్షల్లోనూ హీరోలను వ్యక్తిగతంగా దూషించడం అతడికి అలవాటు. రాధె రివ్యూలో కూడా సల్మాన్ను ఉద్దేశించి చోర్ అనడం అతడి టీం గుర్తించిందట. సినిమా గురించి రివ్యూ ఇస్తూ ఇలా వ్యక్తిగతంగా దూషించడం పట్ల సల్మాన్ టీంలో ఆగ్రహం వ్యక్తమైంది.
గతంలోనూ కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండటంతో ఈసారి అతడికి గట్టిగా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో పరువు నష్టం దావా వేశారని.. ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదలాలనుకోవట్లేదని.. ఇంకోసారి సల్మాన్ గురించే కాక వేరే హీరోల గురించి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి భయపడేలా అతడికి గుణపాఠం నేర్పాలని డిసైడైనట్లు తెలుస్తోంది.
This post was last modified on May 27, 2021 8:37 am
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…