శర్వానంద్ హీరోగా మారుతి తీసిన ‘మహానుభావుడు’ సినిమాలో హీరో పాత్ర దేన్ని ముట్టుకున్నా వెంటనే చేతులకు శానిటైజర్ రాసేసుకోవడం అందరికీ చిత్రంగా అనిపించింది. కానీ మూడేళ్లు తిరిగాక ఇండియాలో ప్రతి ఒక్కరూ ఇలా శానిటైజర్ రాసుకునే పరిస్థితి వచ్చింది. మారుతి అప్పుడే భవిష్యత్ దర్శనం చేయించాడంటూ అందరూ ‘మహానుభావుడు’ సినిమాలోని సన్నివేశాలను గుర్తు చేసుకోవడం చూశాం.
కాగా ఇలాగే 13 ఏళ్ల ముందు వచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను చూపించడం విశేషం. అభిషేక్ బచ్చన్ మీద అప్పట్లో ఐడియా వాళ్లు తీసిన ‘వాట్ ఎన్ ఐడియా సర్ జీ’ యాడ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అందులో ఒక యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం. సరిగ్గా ఇప్పుడు చూస్తున్న పరిస్థితులే అప్పుడు ఆ యాడ్లో కనిపించడం విశేషం.
ఆ యాడ్లో అభిషేక్ టీచర్ పాత్రలో కనిపిస్తాడు. ఓ పల్లెటూరి పేద అమ్మాయికి స్కూల్లో అడ్మిషన్ దొరక్క వెనక్కి వెళ్లిపోతుంటే.. ఆ అమ్మాయి ఉండే పల్లెటూరిలోని పిల్లలందరికీ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా ఆన్ లైన్ పాఠాలు చెప్పించడం.. ఆ తర్వాత ఆ అమ్మాయి బెస్ట్ స్టూడెంట్గా అవార్డు అందుకోవడం.. ఈ ప్రకటనలో చూస్తాం. మధ్యలో ఇంటర్నెట్ ద్వారా పిల్లలకు టీచర్ పాఠాలు చెప్పే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి.
మొబైల్ ఇంటర్నెట్ అంతగా పాపులర్ కాని ఆ రోజుల్లో ఈ యాడ్ చూసిన వాళ్లకు ఇలా నిజంగా జరుగుతుందా అనిపించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ పల్లెటూళ్లకూ వెళ్లిపోయింది. అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. పైగా కరోనా-లాక్ డౌన్ పుణ్యమా అని ఏడాదిగా సిటీలు, పల్లెటూళ్లు అని తేడా లేకుండా అన్ని చోట్లా ఆన్ లైన్ పాఠాలే శరణ్యం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి పరిస్థితులను అప్పుడే ఊహించి ఈ యాడ్ భలేగా తీర్చిదిద్దారే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
This post was last modified on May 26, 2021 11:17 am
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…