ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ అనుకున్న ప్రకారం జూన్ 4న రిలీజవుతుందో లేదో అన్న సందేహాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ సిరీస్ చుట్టూ ముసురుకున్న వివాదం ఇంకా పెద్దదవుతోంది. ఈ సిరీస్లో సమంత పోషించిన పాత్రను ట్రైలర్లో గమనిస్తే.. అందులో ఎల్టీటీఈ నేపథ్యం కనిపిస్తోంది. తమిళ టైగర్ల తరహాలోనే ఆమె వస్త్రధారణ, లుక్ ఉంది. దీని పట్ల తమిళులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళ టైగర్లను చెడుగా చూపిస్తున్నారన్నది వారి వాదన.
దీనిపై వైగో అనే ఎంపీ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్కు లేఖ రాయడం తెలిసిందే. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ ప్రసారం కాకుండా అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే బాట పట్టడం గమనార్హం.
వైగో తరహాలోనే కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్కు తమిళనాడు ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ లేఖ రాశారు. ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ తమిళుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని, సమంత పోషించిన పాత్ర తమిళ టైగర్లను ప్రతికూల కోణంలో చూపించేలా కనిపిస్తోందని.. దీని పట్ల అన్ని రాజకీయ పక్షాలతో పాటు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. అమేజాన్ ప్రైమ్ ఉద్దేశపూర్వకంగా తమిళుల మనోభావాలు దెబ్బ తీసేలా ఈ సిరీస్ను రూపొందించిందని ఇందులో పేర్కొన్నారు. జూన్ 4 నుంచి తమిళనాడులోనే కాక.. దేశవ్యాప్తంగా ఎక్కడా ఫ్యామిలీ మ్యాన్-2 ప్రసారం కాకుండా అడ్డుకోవాలని కోరారు.
ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఇలాంటి లేఖ వచ్చిందంటే ఫ్యామిలీ మ్యాన్-2కు అడ్డంకులు తప్పేలా లేవు. ఈ సిరీస్ను ఆపాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇదే జరిగితే ఫ్యామిలీ మ్యాన్-2 కోసం ఎప్పట్నుంచో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు తీవ్ర నిరాశ తప్పదు.
This post was last modified on May 25, 2021 8:16 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…