నాలుగు దశాబ్దాల కిందట్నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటూ.. ఏకంగా 1500 సినిమాలకు పీఆర్వోగా పని చేసి.. పరిశ్రమలోని అందరితోనూ చాలా సన్నిహితంగా మెలుగుతూ.. అందరివాడిగా పేరు తెచ్చుకుని.. ఇండస్ట్రీలో అందరికీ తలలో నాలుకలా ఉన్న బీఏ మూడు రోజుల కిందట హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం సాయంత్రం కూడా ఓ సినిమా గురించి ట్వీట్ వేసిన ఆయన.. ఆ రోజు రాత్రి గుండె పోటుతో మరణించారు. ఇది సినీ పరిశ్రమకు మామూలు షాక్ కాదు. టాలీవుడ్కు సంబంధించి చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి సినిమాతోనూ ఏదో రకంగా ఆయనకు సంబంధం ఉంటుంది. తెలియని వాళ్లు తీసిన సినిమా అయినా సరే.. దాన్ని తన వంతుగా ప్రమోట్ చేస్తారు.
ట్విట్టర్ అకౌంట్ ద్వారానే కాక సుదీర్ఘ చరిత్ర ఉన్న ‘సూపర్ హిట్’ మ్యాగజైన్ ద్వారా.. అలాగే ‘ఇండస్ట్రీ హిట్’ పేరుతో నెలకొల్పిన వెబ్ సైట్ ద్వారా ఆయన సినిమాలకు మంచి ప్రచారం కల్పిస్తారు. అలాగే ఆయన పీఆర్ టీం సైతం సినిమాలకు ఎంత బాగా పబ్లిసిటీ చేస్తుందో అందరికీ తెలుసు. ఐతే బీఏ రాజు ఉన్నట్లుండి చనిపోవడంతో ఇక వీటన్నింటినీ నడిపించేదెవరు అన్న ప్రశ్న తలెత్తింది. ఇండస్ట్రీలో ఇంకెవరి దగ్గరా లేని విధంగా ఎన్నో దశాబ్దాల కిందటి సినిమాల సమాచారం ఉన్న రాజు.. వాటి గురించి ట్వీట్లు వేసే ఇక మిస్ అయిపోతామేమో అని ఆయన్ని ట్విట్టర్లో అనుసరించే 6 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఫీలవుతున్నారు.
ఐతే రాజు లేకపోయినా.. తను చేస్తూ వచ్చిన పనులన్నీ అలాగే కొనసాగుతాయంటూ ఆయన తనయుడు శివకుమార్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాడు. దర్శకత్వ విభాగంలో పని చేసిన శివకుమార్ ‘22’ అనే సినిమా తీశాడు. అది ఇంకా విడుదల కాలేదు. తండ్రి ఉండగా దర్శకత్వం మీదే దృష్టిపెట్టిన శివకుమార్.. ఇప్పుడు తన తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నాడు. రాజు దగ్గరున్న పీఆర్ టీంతో కలిసి పని చేస్తానని.. అలాగే ఆయన నడుపుతున్న సూపర్ హిట్ మ్యాగజైన్, ఇండస్ట్రీ హిట్ వెబ్ సైట్ల నిర్వహణ చూసుకుంటానని.. రాజు ట్విట్టర్ అకౌంట్ కూడా అలాగే కొనసాగుతుందని వెల్లడించాడు. సినీ ప్రముఖులను త్వరలోనే కలిసి ఈ విషయాన్ని తెలియజేస్తానని, తనకు అందరూ సహకారం అందించాలని శివకుమార్ కోరాడు.
This post was last modified on May 24, 2021 7:02 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…