తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. తెలుగు విలక్షణ నటుడు మోహన్ బాబు కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన కొత్త చిత్రం అన్నాత్తె షూటింగ్ కోసం నెల రోజులకు పైగా హైదరాబాద్లో గడిపిన సందర్భంగా రజినీ.. శంషాబాద్లోని మోహన్ బాబు ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఆయన రెండు రోజులు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
ఈ సందర్భంగానే మోహన్ బాబుతో.. ఆయన కుటుంబ సభ్యులతో రజినీ ఫొటోలు దిగినట్లున్నారు. దీని కోసం మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ బాగానే తయారైనట్లున్నారు. ఫొటో షూట్ అదీ రిచ్గానే చేసినట్లున్నారు. ఇందులో రజినీని మించిన ఆకర్షణతో కనిపిస్తున్నారు మోహన్ బాబు. ఆయన లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇక రజినీ అట్రాక్షన్ గురించి చెప్పేదేముంది? బయట బట్టతలతో చాలా సాధారణంగా కనిపించినా ఆయనలో ఆకర్షణకు లోటుండదు.
రజినీ, మోహన్ బాబు కలిసి ఉన్న ఫొటోలు చూసిన వాళ్లకు వీళ్లిద్దరి కలయికలో ఇప్పుడో సినిమా వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగితే ఆశ్చర్యం లేదు. మోహన్ బాబు సొంత సంస్థలో నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీ పెదరాయుడులో రజినీ ఓ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. క్యామియో రోల్ అయినా సరే… అది అద్భుతంగా పండింది. తర్వాత మోహన్ బాబు చేసిన రాయలసీమ రామన్న చౌదరి చిత్రానికి రజినీ స్వయంగా కథ అందించడం విశేషం. తర్వాత ఇద్దరూ కలిసి ఏ సినిమాకూ పని చేయలేదు. వ్యక్తిగతంగా ఇద్దరూ కలిసి కనిపించింది తక్కువ.
ఐతే ఇప్పుడు ఈ ఇద్దరు మిత్రులు కలిసి సమయాన్ని గడిపిన సందర్భంగా మంచి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎవరికి స్థాయిలో వాళ్లకు తిరుగులేని ఇమేజ్ ఉన్న ఇద్దరు నటులు కలిసి సినిమా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను అద్భుతంగా పండించే మోహన్ బాబు.. రజినీ చిత్రంలో విలన్గా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఎగ్జైట్ చేసేదే. మరి ఈ ఫొటోలు చూసి ఏ దర్శకుడికైనా ఈ ఆలోచన కలిగి కథ రాసి, ఈ ఇద్దరినీ ఒప్పించి సినిమా చేస్తాడేమో చూడాలి.
This post was last modified on May 21, 2021 10:04 pm
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…