తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. తెలుగు విలక్షణ నటుడు మోహన్ బాబు కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన కొత్త చిత్రం అన్నాత్తె షూటింగ్ కోసం నెల రోజులకు పైగా హైదరాబాద్లో గడిపిన సందర్భంగా రజినీ.. శంషాబాద్లోని మోహన్ బాబు ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఆయన రెండు రోజులు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
ఈ సందర్భంగానే మోహన్ బాబుతో.. ఆయన కుటుంబ సభ్యులతో రజినీ ఫొటోలు దిగినట్లున్నారు. దీని కోసం మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ బాగానే తయారైనట్లున్నారు. ఫొటో షూట్ అదీ రిచ్గానే చేసినట్లున్నారు. ఇందులో రజినీని మించిన ఆకర్షణతో కనిపిస్తున్నారు మోహన్ బాబు. ఆయన లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇక రజినీ అట్రాక్షన్ గురించి చెప్పేదేముంది? బయట బట్టతలతో చాలా సాధారణంగా కనిపించినా ఆయనలో ఆకర్షణకు లోటుండదు.
రజినీ, మోహన్ బాబు కలిసి ఉన్న ఫొటోలు చూసిన వాళ్లకు వీళ్లిద్దరి కలయికలో ఇప్పుడో సినిమా వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగితే ఆశ్చర్యం లేదు. మోహన్ బాబు సొంత సంస్థలో నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీ పెదరాయుడులో రజినీ ఓ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. క్యామియో రోల్ అయినా సరే… అది అద్భుతంగా పండింది. తర్వాత మోహన్ బాబు చేసిన రాయలసీమ రామన్న చౌదరి చిత్రానికి రజినీ స్వయంగా కథ అందించడం విశేషం. తర్వాత ఇద్దరూ కలిసి ఏ సినిమాకూ పని చేయలేదు. వ్యక్తిగతంగా ఇద్దరూ కలిసి కనిపించింది తక్కువ.
ఐతే ఇప్పుడు ఈ ఇద్దరు మిత్రులు కలిసి సమయాన్ని గడిపిన సందర్భంగా మంచి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎవరికి స్థాయిలో వాళ్లకు తిరుగులేని ఇమేజ్ ఉన్న ఇద్దరు నటులు కలిసి సినిమా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను అద్భుతంగా పండించే మోహన్ బాబు.. రజినీ చిత్రంలో విలన్గా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఎగ్జైట్ చేసేదే. మరి ఈ ఫొటోలు చూసి ఏ దర్శకుడికైనా ఈ ఆలోచన కలిగి కథ రాసి, ఈ ఇద్దరినీ ఒప్పించి సినిమా చేస్తాడేమో చూడాలి.
This post was last modified on May 21, 2021 10:04 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…