తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. తెలుగు విలక్షణ నటుడు మోహన్ బాబు కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన కొత్త చిత్రం అన్నాత్తె షూటింగ్ కోసం నెల రోజులకు పైగా హైదరాబాద్లో గడిపిన సందర్భంగా రజినీ.. శంషాబాద్లోని మోహన్ బాబు ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఆయన రెండు రోజులు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
ఈ సందర్భంగానే మోహన్ బాబుతో.. ఆయన కుటుంబ సభ్యులతో రజినీ ఫొటోలు దిగినట్లున్నారు. దీని కోసం మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ బాగానే తయారైనట్లున్నారు. ఫొటో షూట్ అదీ రిచ్గానే చేసినట్లున్నారు. ఇందులో రజినీని మించిన ఆకర్షణతో కనిపిస్తున్నారు మోహన్ బాబు. ఆయన లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇక రజినీ అట్రాక్షన్ గురించి చెప్పేదేముంది? బయట బట్టతలతో చాలా సాధారణంగా కనిపించినా ఆయనలో ఆకర్షణకు లోటుండదు.
రజినీ, మోహన్ బాబు కలిసి ఉన్న ఫొటోలు చూసిన వాళ్లకు వీళ్లిద్దరి కలయికలో ఇప్పుడో సినిమా వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగితే ఆశ్చర్యం లేదు. మోహన్ బాబు సొంత సంస్థలో నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీ పెదరాయుడులో రజినీ ఓ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. క్యామియో రోల్ అయినా సరే… అది అద్భుతంగా పండింది. తర్వాత మోహన్ బాబు చేసిన రాయలసీమ రామన్న చౌదరి చిత్రానికి రజినీ స్వయంగా కథ అందించడం విశేషం. తర్వాత ఇద్దరూ కలిసి ఏ సినిమాకూ పని చేయలేదు. వ్యక్తిగతంగా ఇద్దరూ కలిసి కనిపించింది తక్కువ.
ఐతే ఇప్పుడు ఈ ఇద్దరు మిత్రులు కలిసి సమయాన్ని గడిపిన సందర్భంగా మంచి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎవరికి స్థాయిలో వాళ్లకు తిరుగులేని ఇమేజ్ ఉన్న ఇద్దరు నటులు కలిసి సినిమా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను అద్భుతంగా పండించే మోహన్ బాబు.. రజినీ చిత్రంలో విలన్గా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఎగ్జైట్ చేసేదే. మరి ఈ ఫొటోలు చూసి ఏ దర్శకుడికైనా ఈ ఆలోచన కలిగి కథ రాసి, ఈ ఇద్దరినీ ఒప్పించి సినిమా చేస్తాడేమో చూడాలి.
This post was last modified on May 21, 2021 10:04 pm
నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…
తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…