ఫ్యామిలీ మ్యాన్.. ఫ్యామిలీ మ్యాన్.. ఈ ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. అమేజాన్ ప్రైమ్లో రెండేళ్ల ముందు విడుదలై అద్భుత ఆదరణ సంపాదించుకున్న ఈ వెబ్ సిరీస్కు కొనసాగింపుగా ఇప్పడు సెకండ్ సీజన్ విడుదలకు సిద్ధమైంది. దీని ట్రైలర్ను బుధవారం ఉదయం రిలీజ్ చేశారు. ఇలా ట్రైలర్ లాంచ్ కావడం.. అలా వైరల్ అయిపోయింది. దీనికి భారీగా వ్యూస్ వస్తున్నాయి. అందరూ ట్రైలర్ అదుర్స్ అనే అంటున్నారు.
సెకండ్ సీజన్ మీద ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా కావాల్సినంత ఉత్కంఠ, ఫన్ ఉండటంతో ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. థ్రిల్లర్ సిరీస్లో ఉత్కంఠకు తోడు ఫ్యామిలీ ఎమోషన్స్ పండటం.. కామెడీ కూడా హైలైట్ అరుదుగా జరుగుతుంటుంది. ‘ఫ్యామిలీ మ్యాన్’కు మంచి రీచ్ రావడానికి ఇదొక ముఖ్య కారణం. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఇది ఆకట్టుకుంది. గత రెండేళ్ల వ్యవధిలో కోట్ల మంది ఈ సిరీస్ చూశారు.
సెకండ్ సీజన్ కోసం ఆ కోట్ల మంది ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ వచ్చారు. తొలి సీజన్ చివర్లో తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠ మధ్య సిరీస్ను ముగించడంతో సెకండ్ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు ట్రైలర్లో సమంత పాత్రకు తోడు కొత్త ఎపిసోడ్స్ ఉత్కంఠ రేకెత్తించేలాగే కనిపిస్తున్నాయి. ట్రైలర్ లాంచ్ కావడం ఆలస్యం.. ఇండియాలో టాప్లో ట్రెండ్ అయింది ‘ఫ్యామిలీ మ్యాన్’ హ్యాష్ ట్యాగ్. సామాన్య ప్రేక్షకులే కాదు.. సెలబ్రెటీలు సైతం ఈ సిరీస్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ట్రైలర్ గురించి వాళ్లు ఎగ్జైట్మెంట్తో పెట్టిన కామెంట్లను బట్టి తెలుస్తోంది.
ఇక మామూలు ప్రేక్షకుల గురించైతే చెప్పాల్సిన పని లేదు. అందరూ ట్రైలర్ అదుర్స్ అంటూ సిరీస్ కోసం ఎదురు చూడలేకపోతున్నాం అంటున్నారు. చూస్తుంటే.. ఇండియన్ ఓటీటీ రికార్డులన్నీ బద్దలు కొట్టే స్థాయిలో ‘ఫ్యామిలీ మ్యాన్’ సెకండ్ సీజన్ ఆదరణ పొందడం, వ్యూస్ తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జూన్ 4న ఫ్యామిలీ మ్యాన్-2 ప్రిమియర్స్ పడనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 19, 2021 3:49 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…