Movie News

కలల ప్రాజెక్టుపై రాజమౌళిలా చెబుతున్నాడే


తన కలల ప్రాజెక్టు మహాభారతం అని చాలా ఏళ్ల నుంచి చెబుతూ వస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. మరి ఆ సినిమా ఎఫ్పుడు అని అంటే మాత్రం.. ఆ సినిమా తీయడానికి అపార అనుభవం కావాలని, ఇంకా ఆ స్థాయి అనుభవం తనకు రాలేదని.. అది వచ్చింది అనుకున్నాక భవిష్యత్తులో ఆ చిత్రం చేస్తానని పలుమార్లు చెప్పాడు. ఇప్పుడు టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ సైతం ఇదే తరహాలో మాట్లాడుతున్నాడు. అ, కల్కి, జాంబిరెడ్డి లాంటి విభిన్న చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్న ప్రశాంత్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కలల ప్రాజెక్టు గురించి మాట్లాడాడు.

పదేళ్లుగా తాను తన డ్రీమ్ ప్రాజెక్టు మీద పని చేస్తున్నానని.. అదొక పౌరాణిక నేపథ్యం ఉన్న సోషియా ఫాంటసీ కథ అని చెప్పాడు ప్రశాంత్. ఐతే ఆ కథను తెరకెక్కించే అనుభవం తనకు ఇంకా రాలేదని అనుకుంటున్నానని.. తాను తీసే ఒక్కో సినిమా ద్వారా ఎంతో కొంత నేర్చుకుంటున్నానని.. వీలైనంత త్వరగా తన కలల సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తానని అన్నాడు ప్రశాంత్. ఇక ‘జాంబిరెడ్డి’ తన కొత్త సినిమా గురించి ప్రశాంత్ మాట్లాడుతూ.. ఈసారి మరో కొత్త జానర్ ప్రయత్నిస్తున్నానని.. ఆ సినిమాను ఎవరితో చేస్తానో తెలియదని.. తాను సినిమా మొదలుపెట్టాలనుకున్నపుడు ఏ హీరో అందుబాటులో ఉంటే ఆ హీరోతో సినిమా తీస్తానని చెప్పాడు ప్రశాంత్.

అ, జాంబిరెడ్డి సీక్వెల్స్ గురించి ప్రశాంత్‌ను అడిగితే.. ‘అ’ సీక్వెల్ కథ ఎప్పుడో సిద్ధమైందని, ఒక బాలీవుడ్ స్టార్‌తో ఆ సినిమా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోగా
డేట్ల సమస్య వచ్చి ఆ సినిమా ఆగిపోయిందని.. ఐతే ఓ తెలుగు హీరోతోనే కుదిరినపుడు ఈ సీక్వెల్ చేయాలనుకుంటున్నానని చెప్పాడు. ‘జాంబిరెడ్డి’ సీక్వెల్ కోసం కూడా స్క్రిప్టు రెడీ అవుతోందని ప్రశాంత్ తెలిపాడు. సమంత కోసం వేరే కథ రాశానని.. ఆమెతో చేయబోయేది ఏ సినిమాకూ సీక్వెల్ కాదని.. తమ ఇద్దరికీ కుదిరినపుడు ఆ సినిమా చేస్తానని ప్రశాంత్ వెల్లడించాడు.

This post was last modified on May 18, 2021 4:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

3 minutes ago

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…

50 minutes ago

తెలుగు రాష్ట్రాలకూ ‘సర్’ వచ్చేస్తున్నారు..

ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…

1 hour ago

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

3 hours ago

అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…

3 hours ago

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు!

​విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…

4 hours ago