Movie News

కలల ప్రాజెక్టుపై రాజమౌళిలా చెబుతున్నాడే


తన కలల ప్రాజెక్టు మహాభారతం అని చాలా ఏళ్ల నుంచి చెబుతూ వస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. మరి ఆ సినిమా ఎఫ్పుడు అని అంటే మాత్రం.. ఆ సినిమా తీయడానికి అపార అనుభవం కావాలని, ఇంకా ఆ స్థాయి అనుభవం తనకు రాలేదని.. అది వచ్చింది అనుకున్నాక భవిష్యత్తులో ఆ చిత్రం చేస్తానని పలుమార్లు చెప్పాడు. ఇప్పుడు టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ సైతం ఇదే తరహాలో మాట్లాడుతున్నాడు. అ, కల్కి, జాంబిరెడ్డి లాంటి విభిన్న చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్న ప్రశాంత్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కలల ప్రాజెక్టు గురించి మాట్లాడాడు.

పదేళ్లుగా తాను తన డ్రీమ్ ప్రాజెక్టు మీద పని చేస్తున్నానని.. అదొక పౌరాణిక నేపథ్యం ఉన్న సోషియా ఫాంటసీ కథ అని చెప్పాడు ప్రశాంత్. ఐతే ఆ కథను తెరకెక్కించే అనుభవం తనకు ఇంకా రాలేదని అనుకుంటున్నానని.. తాను తీసే ఒక్కో సినిమా ద్వారా ఎంతో కొంత నేర్చుకుంటున్నానని.. వీలైనంత త్వరగా తన కలల సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తానని అన్నాడు ప్రశాంత్. ఇక ‘జాంబిరెడ్డి’ తన కొత్త సినిమా గురించి ప్రశాంత్ మాట్లాడుతూ.. ఈసారి మరో కొత్త జానర్ ప్రయత్నిస్తున్నానని.. ఆ సినిమాను ఎవరితో చేస్తానో తెలియదని.. తాను సినిమా మొదలుపెట్టాలనుకున్నపుడు ఏ హీరో అందుబాటులో ఉంటే ఆ హీరోతో సినిమా తీస్తానని చెప్పాడు ప్రశాంత్.

అ, జాంబిరెడ్డి సీక్వెల్స్ గురించి ప్రశాంత్‌ను అడిగితే.. ‘అ’ సీక్వెల్ కథ ఎప్పుడో సిద్ధమైందని, ఒక బాలీవుడ్ స్టార్‌తో ఆ సినిమా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోగా
డేట్ల సమస్య వచ్చి ఆ సినిమా ఆగిపోయిందని.. ఐతే ఓ తెలుగు హీరోతోనే కుదిరినపుడు ఈ సీక్వెల్ చేయాలనుకుంటున్నానని చెప్పాడు. ‘జాంబిరెడ్డి’ సీక్వెల్ కోసం కూడా స్క్రిప్టు రెడీ అవుతోందని ప్రశాంత్ తెలిపాడు. సమంత కోసం వేరే కథ రాశానని.. ఆమెతో చేయబోయేది ఏ సినిమాకూ సీక్వెల్ కాదని.. తమ ఇద్దరికీ కుదిరినపుడు ఆ సినిమా చేస్తానని ప్రశాంత్ వెల్లడించాడు.

This post was last modified on May 18, 2021 4:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

27 minutes ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

54 minutes ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

2 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

2 hours ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

2 hours ago

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…

2 hours ago