Movie News

కోలీవుడ్లో రెండు కరోనా విషాదాలు

కరోనా మహమ్మారి ధాటికి సినీ పరిశ్రమల్లోనూ తరచుగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్లో ఇటీవలే రైటర్ కమ్ డైరెక్టర్ నంద్యాల రవి కరోనాతో పోరాడి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు జర్నలిస్టు, నటుడు టీఎన్ఆర్ కరోనాకు బలయ్యాడు. కోలీవుడ్లోనూ ఇలాంటి విషాదాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా కొన్ని గంటల వ్యవధిలో రెండు తమిళ సినీ కుటుంబాల్లో విషాదం నెలకొంది.

నితీష్ వీర అనే పేరున్న తమిళ నటుడు కరోనాతో పోరాడి అలసిపోయాడు. 45 ఏళ్ల వీర.. సోమవారం ప్రాణాలు కోల్పోయాడు. రెండు వారాల కిందట కరోనా బారిన పడ్డ వీర.. తాజాగా పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచాడు. ధనుష్ హీరోగా సెల్వ రాఘవన్ రూపొందించిన పుదుపేట్టై (తెలుగులో ధూల్ పేట) చిత్రంతో వీరకు బ్రేక్ వచ్చింది. అందులో అతను హీరోయిన్ సోనియా అగర్వాల్ సోదరుడిగా కనిపిస్తాడు. కథలో ఆ పాత్ర కీలకంగా ఉంటుంది.

ఆ తర్వాత రజినీకాంత్‌తో ‘కాలా’, ధనుష్ క్లాసిక్ మూవీ ‘అసురన్’ ఇంకా చాలా సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించాడు వీర. కెరీర్ మంచి ఊపులో ఉండగా వీర ఇలా చనిపోవడం కోలీవుడ్లో విషాదాన్ని నింపింది. మరోవైపు నటుడు, గాయకుడు, దర్శకుడు అయిన అరుణ్ రాజా కుటుంబంలోనూ కరోనా విషాదం నింపింది. అతడి భార్య ఇందుజ ఈ మహమ్మారికి బలైంది. అరుణ్ రాజా తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. ‘రాజా రాణి’ సినిమాలో ఆర్య ఫ్రెండుగా ఒక నీగ్రో తరహా పాత్రలో కనిపిస్తాడు అరుణ్. ఆ సినిమాలో అతను మంచి కామెడీ పండించాడు.

నటుడిగా మరిన్ని సినిమాల్లో నటించిన అరుణ్ రాజా.. కొన్నేళ్ల కిందటే మన తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో ‘కనా’ అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్టయింది. తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ పేరుతో రీమేక్ అయింది. ప్రస్తుతం తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, ఎమ్మెల్యే ఉదయనిధి హీరోగా హిందీ హిట్ మూవీ ‘ఆర్టికల్ 15’ రీమేక్‌ను కొన్ని రోజుల కిందటే మొదలుపెట్టాడు అరుణ్. ఇంతలో అతడి భార్య కరోనా బారిన పడటం.. కొన్ని రోజుల్లోనే ఆమె పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోవడం పెద్ద విషాదం.

This post was last modified on May 17, 2021 7:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

3 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

4 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

4 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

4 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

5 hours ago