కరోనా మహమ్మారి అన్ని రంగాలనూ అతలాకుతలం చేస్తోంది. సినీ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ రంగంలో అవస్థలు పడుతున్న కార్మికులను ఆదుకోవడానికి సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల్లోనూ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇతర రంగాల్లో కష్టాలు పడుతున్న వారికి కూడా సిినీ జనాలు సాయం చేస్తున్నారు.
తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇప్పటికే సినీ కార్మికుల కోసం సహాయ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పుడతను మరో మంచి పనికి ముందుకొచ్చాడు. సోనూకు ముంబయిలోని జుహు ప్రాంతంలో పెద్ద హోటల్ ఉంది. లాక్ డౌన్ కారణంగా అది మూతపడింది. ఐతే ఇంకా లాక్ డౌన్ ఎత్తేయకముందే సోనూ ఆ ఆసుపత్రిని తెరుస్తున్నాడు. ఐతే ఇలాంటి సమయంలో హోటల్ మళ్లీ తెరవడం వెనుక ో మంచి కారణం ఉంది.
ఈ అత్యవసర పరిస్థితుల్లో సమయం చూసుకోకుండా పని చేస్తున్న హెల్త్ వర్కర్లకు తోడ్పాటు అందించడానికే సోనూ సూద్ తన హోటల్ను మళ్లీ తెరుస్తున్నాడు. ఇందుకోసం అతను ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా తీసుకున్నాడు. వైద్య సిబ్బందికి ఉచితంగా భోజనం పెట్టబోతున్నాడు సోనూ.
‘‘ఈ కష్ట కాలంలో మన జాతీయ హీరోలకు అండగా నిలవాల్సిన అవసరముంది. రోజు మొత్తం విరామం లేకుండా కష్టపడుతున్న హెల్త్ వర్కర్ల కోసం జుహులోని నా హోటల్ను తెరుస్తున్నా. వాళ్లు పడుతున్న అసాధారణ కష్టానికి మనం చేయగలిగే చిన్న సాయం ఇది. జైహింద్’’ అంటూ సోనూ ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టాడు.
మరోవైపు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వేలమందికి భోజన ఏర్పాట్లు చేస్తుండగా.. సల్మాన్ ఖాన్ 25 వేల మంది కార్మికుల అకౌంట్లలోకి పరిస్థితులు మెరుగు పడే వరకు నెలవారీగా డబ్బులు వేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా మరిందరు బాలీవుడ్ తారలు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నారు.
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…
ఇప్పుడు హీరోయిన్ గా కనిపించడం తగ్గించేసింది కానీ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన బ్లాక్ బస్టర్స్ లో నటించిన ట్రాక్…
వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…