Movie News

ఎన్టీఆర్ సరసన తొలిసారి ఆమె?

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. నెల ముందు వరకు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోనే అనుకుంటూ వచ్చారంతా. ఏడాది ముందే ఈ సినిమా గురించి ప్రకటన వచ్చింది. అప్పట్నుంచి సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి. తారక్ ‘ఆర్ఆర్ఆర్’ పని పూర్తి చేసి ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ఈ సినిమా మొదలవుతుందని అనుకుంటూ వచ్చారు. కానీ ఉన్నట్లుండి కథ మారిపోయింది.

త్రివిక్రమ్‌తో తారక్ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. ఆ స్థానంలోకి కొరటాల శివ ప్రాజెక్టు వచ్చింది. శివ మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో గత నెలలోనే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ అని ఇప్పటికే ప్రకటించిన సంగతీ తెలిసిందే.

ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్‌కు కూడా బ్రేక్ పడటంతో కొరటాల.. తారక్ సినిమా స్క్రిప్ట్, ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. పనిలో పనిగా ముఖ్య తారాగణం ఎంపిక మీదా దృష్టిపెట్టాడట. ఈ చిత్రానికి కథానాయికగా బాలీవుడ్ భామ కియారా అద్వానీని ఖరారు చేశారన్నది తాజా సమాచారం.

కొరటాల చిత్రం ‘భరత్ అనే నేను’తోనే ఆమె తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమాతో ఆమెకు మంచి ఎంట్రీ కూడా లభించింది. ఐతే రెండో సినిమా ‘వినయ విధేయ రామ’ మాత్రం నిరాశ పరిచింది. ఆ తర్వాత ఆమె మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. కొన్ని ప్రాజెక్టుల్లో ఆమె పేరు వినిపించింది కానీ.. ఏదీ ఓకే కాలేదు.

ఐతే తారక్-కొరటాల చిత్రానికి మాత్రం ఆమె సంతకం చేసిందనే అంటున్నారు. తారక్‌తో కియారా జోడీ బాగుంటుందనే అనుకుంటున్నారు. ఈ సినిమాలో తారక్ స్టూడెంట్ లీడర్ పాత్ర చేయబోతున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చే అవకాశముంది.

This post was last modified on May 15, 2021 3:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

4 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

5 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

5 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

5 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

7 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

8 hours ago