వర్తమానంలో కావచ్చు.. గతంలో కావచ్చు.. మొత్తంగా ప్రపంచ సినీ చరిత్రనే తీసుకున్నా సరే.. ఏవి అత్యంత గొప్ప సినిమాలో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎక్కువగా చూసేది ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) వైపే. ప్రేక్షకుల సమీక్షలు, ఓటింగ్ ఆధారంగా ప్రతి సినిమాకూ రేటింగ్ ఇస్తుంటుంది ఐఎండీబీ. ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రపంచ సినిమాలో ఏవి ఉత్తమమైనవో ఐఎండీబీ చూసే తెలుసుకుంటారు. గూగుల్లో బెస్ట్ మూవీస్ అంటూ వెతికినా ఐఎండీబీ జాబితాలే కనిపిస్తాయి. ఈ వెబ్ సైట్లో తమ సినిమాలకు మంచి రేటింగ్ వస్తే దాన్ని గొప్పగా చూపించుకుంటారు ఫిలిం మేకర్స్.
ఇంత ప్రాధాన్యం ఉన్న ఐఎండీబీలో ఆల్ టైం వరల్డ్ మూవీస్లో ఓ తమిళ-తెలుగు చిత్రానికి మూడో స్థానం దక్కడం విశేషం. ఆ సినిమానే సూరారై పొట్రు/ఆకాశం నీ హద్దురా. గత ఏడాది అక్టోబరు 12న ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన సంగతి తెలిసిందే.
థియేటర్లు మూతపడి జనాలకు ఓటీటీల్లోనూ సరైన సినిమా వినోదం దక్కని సమయంలో ‘సూరారై పొట్రు’ విడుదలై దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి చాలా మంచి సమీక్షలు వచ్చాయి. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ కూడా అదిరిపోయింది. అమేజాన్ ప్రైమ్లో అత్యంత ఆదరణ సంపాదించుకున్న భారతీయ చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. ‘సూరారై పొట్రు’ ఆస్కార్ అవార్డులకు కూడా పోటీ పడటం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ చిత్రానికి మరో గౌరవం దక్కింది.
ఐఎండీబీ ఆల్ టైం హైయెస్ట్ రేటింగ్ చిత్రాల్లో మూడో స్థానం సాధించడం విశేషం. ఈ జాబితాలో ఎప్పట్నుంచో ‘ష్వాషాంగ్ రిడెంప్షన్’ అగ్రస్థానంలో ఉంది. 1994లో విడుదలైన ఈ చిత్రం 9.3 రేటింగ్తో నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. 1972లో రిలీజైన ‘గాడ్ ఫాదర్’ 9.2 రేటింగ్తో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు ‘సూరారై పొట్రు’ 9.2 రేటింగ్తో మూడో స్థానానికి చేరుకుంది. ఐతే దీర్ఘకాలంలో ఈ రేటింగ్ నిలబెట్టుకోవడం మాత్రం అంత తేలిక కాదు.
This post was last modified on May 14, 2021 11:16 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…