Movie News

‘పుష్ప’ టీం అత్యాశ కొంపముంచదుగా..


‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారన్న సమాచారం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. సుకుమార్ ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాడు అనే ప్రశ్నను కూడా రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఇలా ఏ సినిమాను పడితే ఆ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తే బాగోదు. బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాల విషయంలో ఈ ఐడియా బాగానే వర్కవుట్ అయింది. నిజానికి ‘బాహుబలి’ని ఒక సినిమాగా తీద్దామని మొదలుపెట్టి.. మధ్యలో రెండు భాగాల ఆలోచన చేసినపుడు చాలామంది పెదవి విరిచారు. ఇదేం విడ్డూరం అన్నట్లుగా మాట్లాడారు.

కానీ ఆ కథను రెండుగా విభజించడంలో రాజమౌళి చూపిన ప్రతిభ అసామాన్యమైంది. ఆ కథలో ఆ స్పాన్ ఉందని జక్కన్న గుర్తించాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న దగ్గర సినిమాను ముగించాడు. బాహుబలి ఫ్లాష్ బ్యాక్‌ ప్రధానంగా రెండో భాగాన్ని నడిపించాడు. మొత్తంగా రెండు భాగాల ఐడియా అద్భుత ఫలితాన్నిచ్చింది. ఇక ‘కేజీఎఫ్’ విషయానికి వస్తే.. దాన్ని ముందు నుంచే రెండు భాగాలుగా తీయాలనుకున్నారు. ఆ ప్రకారమే కథను సిద్ధం చేసుకున్నాడు ప్రశాంత్ నీల్.

ఐతే ఈ రెండు సినిమాల రేంజ్ వేరు. వాటి కథలకు ఉన్న రీచ్ కూడా వేరు. విజువల్‌గా అవి మైండ్ బ్లోయింగ్ అనిపించాయి. కానీ ‘పుష్ప’ అనేది మామూలు సినిమాలాగే కనిపిస్తోంది. బాహుబలి, కేజీఎఫ్ సినిమాల్లోని విజువల్ మెరుపులు ఇందులో ఉంటాయా, ఈ కథకు రెండు భాగాలుగా తీసేంత రీచ్ ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగస్థలం, అల వైకుంఠపురములో లాంటి భారీ విజయాల తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో దీనికి హైప్ బాగానే వచ్చింది. ఆ హైప్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా.. రెండు భాగాలుగా సినిమా తీస్తే ఎక్కువ బిజినెస్ జరిగి ఎక్కువ ఆదాయం వస్తుందన్న అత్యాశతో ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

నిజంగా కథ డిమాండ్ చేయడం వల్ల రెండు భాగాలుగా తీస్తే సమస్య లేదు. కానీ ‘పుష్ప’ను ఒక సినిమాగా మొదలుపెట్టి, సగం చిత్రీకరణ పూర్తిచేసి, రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసి, ఇంకో మూణ్నాలుగు నెలల్లో విడుదల అనుకుంటుండగా ఇప్పుడు ఇలా రెండు భాగాల ప్రతిపాదన తేవడంతోనే సందేహాలు ముసురుకుంటున్నాయి. అత్యాశతో ఈ సినిమాను చెడగొట్టుకుంటారా.. అసలుకే మోసం వస్తుందా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

This post was last modified on May 14, 2021 10:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

3 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

4 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

5 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

5 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

6 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

8 hours ago