Movie News

దటీజ్ సూర్య అండ్ ఫ్యామిలీ


అధికారం చేపట్టిన నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి అందరూ ప్రయత్నిస్తారు. సినీ జనాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రభుత్వం మారగానే వెళ్లి అభినందలు చెప్పడం.. లేదా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం.. ప్రశంసలు కురిపించడం మామూలే. ఆ టైంలో వెళ్లి ప్రభుత్వ అధినేతను కలిసి వస్తే తమ పట్ల అధికారంలో ఉన్న వాళ్లకు సానుకూల అభిప్రాయం ఉంటుందని, అవసరం పడ్డపుడు పనులు అవుతాయని, తమకు ఏ రకమైన ఇబ్బందీ రాదని సెలబ్రెటీలు ఈ పని చేస్తుంటారు. తర్వాత కూడా సందర్భం వచ్చినపుడల్లా అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి.

తాజాగా తమిళనాట ఎన్నికల్లో అనుకున్నట్లే డీఎంకే పార్టీ జయకేతనం ఎగురవేయడం, కరుణానిధి తనయుడు స్టాలిన్ ముఖ్యమంత్రి కావడం తెలిసిందే. ఆయన సీఎం ఆఫీసులో అడుగు పెట్టడం ఆలస్యం.. సినీ ప్రముఖులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడిపోయారు.

స్వయంగా ఎన్నికల్లో పోటీ పడ్డ కమల్ హాసన్‌కు తోడు ఎంతోమంది సినిమా వాళ్లు స్టాలిన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఇప్పుడు స్టార్ హీరో సూర్య కూడా తన తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తిలతో కలిసి వెళ్లి ముఖ్యమంత్రిని మీట్ అయ్యాడు. ఐతే మిగతా వాళ్లు ఒక పుష్పగుచ్ఛంతోనో, ఏదైనా బహుమతితోనో వెళ్లి స్టాలిన్‌ను కలిసి వస్తే.. సూర్య కుటుంబం మాత్రం కోటి రూపాయల చెక్కుతో వెళ్లి ఆయన్ని కలిసింది. కరోనా కల్లోలం నేపథ్యంలో సహాయ చర్యలు చేపట్టడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ మొత్తాన్ని అందజేశారు.

అగరం ఫౌండేషన్ తరఫున వందల మంది పిల్లలకు తిండి పెడుతూ విద్యనందించడమే కాదు.. కరోనా వేళ మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది సూర్య కుటుంబం. గత ఏడాది కరోనా టైంలోనూ ఆ కుటుంబం విరాళం ఇవ్వడంతో పాటు ఎంతో చేసింది. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లి కోటి రూపాయల విరాళం ఇవ్వడం పట్ల ఆ కుటుంబంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

This post was last modified on May 13, 2021 8:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

44 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

2 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

3 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

3 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

4 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

5 hours ago