అధికారం చేపట్టిన నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి అందరూ ప్రయత్నిస్తారు. సినీ జనాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రభుత్వం మారగానే వెళ్లి అభినందలు చెప్పడం.. లేదా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం.. ప్రశంసలు కురిపించడం మామూలే. ఆ టైంలో వెళ్లి ప్రభుత్వ అధినేతను కలిసి వస్తే తమ పట్ల అధికారంలో ఉన్న వాళ్లకు సానుకూల అభిప్రాయం ఉంటుందని, అవసరం పడ్డపుడు పనులు అవుతాయని, తమకు ఏ రకమైన ఇబ్బందీ రాదని సెలబ్రెటీలు ఈ పని చేస్తుంటారు. తర్వాత కూడా సందర్భం వచ్చినపుడల్లా అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి.
తాజాగా తమిళనాట ఎన్నికల్లో అనుకున్నట్లే డీఎంకే పార్టీ జయకేతనం ఎగురవేయడం, కరుణానిధి తనయుడు స్టాలిన్ ముఖ్యమంత్రి కావడం తెలిసిందే. ఆయన సీఎం ఆఫీసులో అడుగు పెట్టడం ఆలస్యం.. సినీ ప్రముఖులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడిపోయారు.
స్వయంగా ఎన్నికల్లో పోటీ పడ్డ కమల్ హాసన్కు తోడు ఎంతోమంది సినిమా వాళ్లు స్టాలిన్ను కలిసిన వారిలో ఉన్నారు. ఇప్పుడు స్టార్ హీరో సూర్య కూడా తన తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తిలతో కలిసి వెళ్లి ముఖ్యమంత్రిని మీట్ అయ్యాడు. ఐతే మిగతా వాళ్లు ఒక పుష్పగుచ్ఛంతోనో, ఏదైనా బహుమతితోనో వెళ్లి స్టాలిన్ను కలిసి వస్తే.. సూర్య కుటుంబం మాత్రం కోటి రూపాయల చెక్కుతో వెళ్లి ఆయన్ని కలిసింది. కరోనా కల్లోలం నేపథ్యంలో సహాయ చర్యలు చేపట్టడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు ఈ మొత్తాన్ని అందజేశారు.
అగరం ఫౌండేషన్ తరఫున వందల మంది పిల్లలకు తిండి పెడుతూ విద్యనందించడమే కాదు.. కరోనా వేళ మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది సూర్య కుటుంబం. గత ఏడాది కరోనా టైంలోనూ ఆ కుటుంబం విరాళం ఇవ్వడంతో పాటు ఎంతో చేసింది. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లి కోటి రూపాయల విరాళం ఇవ్వడం పట్ల ఆ కుటుంబంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
This post was last modified on May 13, 2021 8:51 am
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…