లాక్ డౌన్ టైంలో సెలబ్రెటీలు తమ అభిమానుల్ని అలరించేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. టిక్ టాక్ను ఫుల్లుగా వాడుకుంటూ ఫాలోవర్లకు వినోదం పంచుతున్నారు. ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, ప్రస్తుత యోగా టీచర్ కమ్ బిజినెస్ ఉమన్ శిల్పా శెట్టి తరచుగా టిక్ టాక్ వీడియోలు చేస్తుంటుంది. ఆమె ఆ మధ్య ‘బుట్ట బొమ్మ’ పాటకు సైతం డ్యాన్స్ చేసి అలరించిన సంగతి తెలిసిందే.
తాజాగా శిల్పా ఓ ఫన్నీ వీడియో చేసింది. అందులో భర్త రాజ్ కుంద్రాను ఉతికి ఆరేసింది. ఇందుకోసం ఆమె ఫన్నీ కాన్సెప్ట్ తీసుకుంది. పక్కన భర్త ఉండగా తాను ఇంటి పనికి సిద్ధమైంది శిల్పా. బట్టలు సర్దుతూ.. తాను పనిలో ఉన్నానని, మధ్యలో ముద్దులు పెట్టడం లాంటివి చేయొద్దని భర్తను హెచ్చరించింది శిల్పా.
ఐతే అంతలోనే పని మనిషి అందుకుంది. నేను కూడా పని చేసేటపుడు ముద్దులు పెట్టడం లాంటివి చేయొద్దని చెప్పినా వినడేంటి మీ ఆయన అంటూ కౌంటర్ వేసింది. వెంటనే శిల్పా ఆగ్రహంతో ఊగిపోతూ భర్తను ఉతికారేసింది. ఐతే ఇక్కడ పని మనిషి పాత్రలో కనిపించింది కూడా శిల్పానే. ఏవో ఎఫెక్టులు జోడించి మరో వ్యక్తిలా చూపించారు. ఐతే కాన్సెప్ట్ ఫన్నీగా ఉండటంతో శిల్పా ఫాలోవర్లు బాగానే ఎంటర్టైన్ అవుతున్నారు.
బాలీవుడ్లో శిల్పా ఒకప్పుడు మీడియం రేంజ్ హీరోయినే కానీ.. కెరీర్ చరమాంకంలో ఆమె మంచి పాపులారిటీ సంపాదించింది. ‘బిగ్ బాస్’ తరహాలో సాగిన బ్రిటిష్ షో ‘బిగ్ బ్రదర్’లో ఓ బ్రిటిష్ నటి జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంతో శిల్పాకు సింపతీతో పాటు పాపులారిటీ కూడా వచ్చింది. ఆ తర్వాత ఆమె వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లాడటం, ఇద్దరూ కలిసి ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్లో భాగస్వాములు కావడం.. 2013 మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంలో బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న రాజ్ ఫ్రాంఛైజీ నుంచి బయటికి రావడం తెలిసిందే.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…