శ్రుతి హాసన్ పదేళ్లుగా సినిమాల్లో కథానాయికగా కొనసాగుతోంది. కెరీర్ ఆరంభంలో కొంత ఇబ్బంది పడ్డా.. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. చాలా వేగంగా దక్షిణాదిన అగ్ర కథానాయికగా ఎదిగింది. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్గా కొనసాగింది. బాలీవుడ్లోనూ అవకాశాలు అందుకుంది. మరి ఇన్నేళ్లుగా ఎన్ని కోట్లు సంపాదించి ఉంటుందో అంచనా వేయొచ్చు. మధ్యలో వ్యక్తిగత కారణాలతో కొంచెం గ్యాప్ తీసుకున్నప్పటికీ.. మళ్లీ కథానాయికగా బిజీ అయింది. ‘క్రాక్’, ‘లాభం’ లాంటి పెద్ద సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ‘సలార్’లోనూ నటిస్తోంది.
ఇలాంటి హీరోయిన్కు ఆర్థిక సమస్యలు ఉన్నాయంటే నమ్మగలమా? షూటింగ్లు ఆగిపోయి ఇబ్బంది పడుతూ.. మళ్లీ అవి ఎప్పుడు మొదలవుతాయా అని ఎదురు చూసే పరిస్థితుల్లో శ్రుతి ఉందట. తన తండ్రి ఎంత పెద్ద నటుడు అయినప్పటికీ ఒక వయసు వచ్చాక ఆయన మీద తాను ఆధారపడలేదని.. తన కాళ్ల మీద తాను నిలబడే ప్రయత్నమే చేశానని.. ఐతే లాక్ డౌన్ కారణంగా తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డానని శ్రుతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
“ఎప్పుడు షూటింగ్స్ మొదలైతే అప్పుడు వెళ్లి పని చేద్దామని చూస్తున్నా. నాక్కూడా ప్రొఫెషనల్ కమిట్మెంట్లు ఉన్నాయి. ఆర్టిస్టులుగా మా సంపాదన భిన్నంగా ఉంటుంది. మేం చెల్లించాల్సిన బిల్లులు చాలా ఉంటాయి. నా పరిధి నాకు ఉంది. తల్లి దండ్రుల సాయం నేను కోరను. లాక్ డౌన్ మొదలవడానికి ముందు నేను ఒక ఫ్లాట్ కొన్నాను. వ్యక్తిగత ఖర్చులకు తోడు ఎన్నో బిల్లులు చెల్లించాలి. ప్రతి నెలా ఈఎంఐలు కట్టాలి. కానీ సామాన్య జనాల కష్టాలతో పోలిస్తే నాలాంటి వాళ్ల కష్టాలు చాలా చిన్నవని మాత్రం ఒప్పుకుంటా” అని శ్రుతి వెల్లడించింది.
This post was last modified on May 11, 2021 6:31 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…