Movie News

50 మంది కొత్త తారల కలకు బ్రేక్


తెలుగులో కొత్త నటీనటులు, టెక్నీషియన్లకు అత్యధికంగా అవకాశాలు ఇచ్చిన దర్శకుల్లో తేజ ఒకడు. తొలి సినిమా ‘చిత్రం’తోనే ఉదయ్ కిరణ్, రీమా సేన్, ఆర్పీ పట్నాయక్ లాంటి ప్రతిభావంతులకు బ్రేక్ ఇచ్చిన తేజ.. ఆ తర్వాత మరెంతో మంది నటీనటలు, టెక్నీషియన్లను వెలుగులోకి తెచ్చాడు. ‘చిత్రం’ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు కావస్తున్న తరుణంలో కొన్ని నెలల కిందట తేజ ‘చిత్రం 2.0’ పేరుతో కొత్త సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

‘చిత్రం’ తరహాలోనే దీన్ని కూడా అందరూ కొత్త వాళ్లతో చేయాలనుకున్నాడు తేజ. 50 మంది కొత్త నటీనటులను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకోవడం విశేషం. స్వీయ నిర్మాణంలో ఈ సినిమా చేయడానికి తేజ సిద్ధమయ్యారు. స్క్రిప్టు సిద్ధం చేసి, ఆడిషన్స్ ద్వారా నటీనటులను ఎంపిక చేసుకుని.. వారికి శిక్షణ కూడా ఇచ్చిన తేజ.. త్వరలోనే ఈ సినిమా మొదలుపెట్టడానికి ఆయన సన్నాహాల్లో ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా చేయడానికి తగిన ఆర్థిక వనరులు తేజ దగ్గర లేవట. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త వాళ్లతో సినిమా తీయడం కష్టమని భావించి ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టాడట తేజ.

దీంతో ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న 50 మంది కొత్త ఆర్టిస్టులకు నిరాశ తప్పలేదు. ఈ ప్రాజెక్టును పూర్తిగా ఆపేయట్లేదని.. తాత్కాలికంగా దానికి విరామం ఇస్తున్నాడని.. దీని బదులు రానా తమ్ముడు అభిరామ్‌‌ను హీరోగా పరిచయం చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమా చేయబోతున్నాడట తేజ. ఈ సినిమాతో హిట్టు కొట్టి డబ్బులు సమకూరితే, అలాగే కరోనా సంక్షోభం ముగిసిపోతే.. ఆ తర్వాత ‘చిత్రం-2.0’ను పట్టాలెక్కించాలని తేజ యోచిస్తున్నాడట. టాలీవుడ్లో షూటింగ్స్ పున:ప్రారంభం అయ్యాక అభిరామ్‌తో తేజ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని తెలుస్తోంది.

This post was last modified on May 11, 2021 7:36 am

Share
Show comments

Recent Posts

ప్రేక్షకులు మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

1 hour ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

2 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

3 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

4 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

5 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

5 hours ago