సెట్లో జరిగిన క్రేన్ ప్రమాదం కారణంగా ఇండియన్-2 సినిమా మధ్యలో ఆగిపోవడం.. ఆ తర్వాత ఎంతకీ అది పున:ప్రారంభం కాకపోవడం.. ఈ విషయమై దర్శకుడు శంకర్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేతల మధ్య తీవ్ర విభేదాలు నెలకొనడం తెలిసిన సంగతే. త్వరగా ఈ సినిమాను పున:ప్రారంభించే విషయం తేల్చాలని కొన్ని నెలల ముందు నిర్మాతలను నిలదీస్తే వాళ్లు స్పందించలేదు. తర్వాత శంకరేమో రామ్ చరణ్తో వేరే సినిమా మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటుంటే నిర్మాతలు అడ్డం పడ్డారు.
వీళ్లిలా గొడవ పడుతుంటే హీరో కమల్ హాసన్ మాత్రం చోద్యం చూస్తూ కూర్చున్నాడు. నిజానికి ‘ఇండియన్-2’ పున:ప్రారంభం కాకపోవడానికి అసలు కారణం కమలే అన్నది కోలీవుడ్ వర్గాల మాట. క్రేన్ ప్రమాదం తర్వాత నిర్మాతలతో ఆయనకు పెద్ద గొడవే జరిగింది. ఆయన పొలిటికల్ కమిట్మెంట్లు కూడా సినిమా మళ్లీ మొదలు కాకపోవడానికి కారణం. ఇండియన్-2 సంగతి తేల్చకుండా ‘బిగ్ బాస్’ షో చేయడం, అలాగే ‘విక్రమ్’ అనే మరో సినిమాను ఆయన మొదలుపెట్టడం తెలిసిందే.
ఐతే ఇటీవల వెల్లడైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమల్ హాసన్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు రాలేదు. స్వయంగా కమలే ఓడిపోయాడు. ఇప్పుడు తన రాజకీయ గమ్యం ఏంటో తెలియని అయోమయంలో ఉన్నారు కమల్. ప్రస్తుతానికి రాజకీయాల్లో ఆయన చేయడానికి ఏమీ లేదు. దీంతో మళ్లీ అభిమానుల కోరిక మేరకు సినిమాల్లో బిజీ అవ్వాలని కమల్ చూస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ‘ఇండియన్-2’ వివాదాన్ని పరిష్కరించి ఈ సినిమాను పున:ప్రారంభించడానికి కమలే చొరవ తీసుకోనున్నాడట. ఏకంగా రూ.180 కోట్లు ఖర్చు పెట్టిన సినిమాను ఆపేయడం సరి కాదని భావించి.. లైకా అధినేతలు, శంకర్తో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ‘ఇండియన్-2’ను పున:ప్రారంభించి పూర్తి చేయాలని కమల్ భావిస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ‘ఇండియన్-2’తో పాటు ‘విక్రమ్’ షూటింగ్లో కమల్ సమాంతరంగా పాల్గొనే అవకాశాలున్నాయంటున్నారు.
This post was last modified on May 9, 2021 9:23 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…