సంగీత దర్శకుడు కావడానికి ముందు గాయకుడిగా రఘు కుంచెకు మంచి పేరు తెచ్చిన పాట.. ‘బాచి’లోని లచ్చిమి లచ్చిమి లచ్చిమి. సంగీత దర్శకుడిగా చక్రికి బ్రేక్ ఇచ్చింది కూడా ఈ పాటే. ఐతే నిజానికి ఈ పాటను రఘు పాడాల్సిందే కాదట. ఒరిజినల్గా దాన్ని చక్రినే పాడదామనుకున్నాడట. మరి ఆ పాట తన ఖాతాలోకి ఎలా వచ్చిందో.. ఆ పాట ద్వారా ఎలా తన కెరీర్ మలుపు తిరిగిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు రఘు కుంచె.
సినిమాల మీద పిచ్చితో తాను హైదరాబాద్కు వచ్చినపుడు పూరి జగన్నాథ్ ఒక కేఫ్లో పరిచయం అయ్యాడని.. తర్వాత తామిద్దరం రూం మేట్స్ అయ్యామని.. అప్పటికి పూరి దర్శకుడిగా అవకాశం కోసం చూస్తున్నాడని రఘు తెలిపాడు. రూంలో తాను పాడే పాటలు విని తాను దర్శకుడైతే గాయకుడిగా ఛాన్స్ ఇప్పిస్తానని పూరి మాట ఇచ్చాడని.. కానీ తొలి సినిమా ‘బద్రి’ పెద్ద బేనర్లో, పెద్ద హీరోతో కావడంతో తనకు పాట ఇప్పించలేకపోయాడని రఘు వెల్లడించాడు.
‘బద్రి’కి తొలి రోజు డివైడ్ టాక్ రావడంతో సినిమా పోయిందని పూరి నిరాశలో మునిగిపోయాడని.. కానీ తర్వాత పుంజుకున్న సినిమా పెద్ద హిట్టయిందని.. ఆపై పూరి కొంచెం డిఫరెంట్ స్టయిల్లో ‘బాచి’ సినిమా చేయడానికి రెడీ అయ్యాడన్నాడు.
ఈ సినిమాకు కొత్త సంగీత దర్శకుడిని ట్రై చేద్దామనుకుని చక్రిని పిలిపించాడని.. అతను టేబుల్ మీద చేత్తో వాయిస్తూ కొన్ని పాటలు పాడాడని.. అవి విని ఇంప్రెస్ అయి వెంటనే సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడని.. అప్పుడే తనతో ఈ సినిమాలో ఓ పాట పాడించాలని చక్రికి చెప్పడంతో అతను ఓకే అన్నాడని తెలిపాడు. ఐతే చక్రి కంపోజ్ చేసుకున్న ఐదు పాటల్లో తనకు ‘లచ్చిమి లచ్చిమి’ నచ్చి ఆ పాటే పాడతానని పూరితో చెప్పానని.. నిజానికి ఆ పాటను చక్రి ఎంతో ఇష్టపడి, తాను పాడాలనుకున్నాడని.. కానీ పూరి చెప్పడంతో తనతో పాడించాడని రఘు తెలిపాడు. ముందు తాను బాలసుబ్రహ్మణ్యం స్టయిల్లో ట్రెడిషనల్గా ఈ పాట పాడానని.. కానీ చక్రి ఒక డిఫరెంట్ స్టైల్ కోరుకున్నాడని.. తర్వాత ఆడియోలో ఉన్నట్లుగా వెరైటీగా ఈ పాట పాడానని.. ఈ పాట సూపర్ హిట్టయి తన కెరీర్ను మార్చేసిందని రఘు వెల్లడించాడు.
This post was last modified on May 8, 2021 8:46 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…