సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమైపోతోంది ఈ మధ్య. మునుపటి తరం స్టార్ల లాగా తమ వయసులో మూడో వంతు వయసున్న హీరోయిన్లతో ఎంచక్కా చిందులు వేసేస్తే ఇప్పటి ప్రేక్షకులు ఒప్పుకోరు. సోషల్ మీడియాలో ఏకిపడేస్తారు. అలాగని చేసిన హీరోయిన్లతోనే మళ్లీ చేస్తే మొహం మొత్తేస్తుంది.
ఈ నేపథ్యంలో సీనియర్ హీరోలు కొత్త సినిమా మొదలుపెడుతున్నారంటే హీరోయిన్ ఎవరా అనే తలనొప్పి మొదలవుతుంది. ఐతే సౌత్లో వెతుకుతూ కూర్చుంటే కష్టమని భావించి అక్కినేని నాగార్జున ఈ మధ్య వరుసగా బాలీవుడ్ భామల వైపు చూస్తున్నాడు. ఆయన చివరి సినిమా ‘వైల్డ్ డాగ్’లో బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జాతో జోడీ కట్టిన సంగతి తెలిసిందే. అంతకుముందు కూడా నాగ్ ఆఫీసర్, దేవదాస్ సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్లతోనే జత కట్టాడు.
ఇప్పుడు నాగ్ నటించబోయే అచ్చ తెలుగు సినిమా కోసం కూడా ఓ హిందీ హీరోయిన్నే తీసుకోనున్నారట. ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న ‘బంగార్రాజు’ చిత్రాన్ని నాగ్ త్వరలోనే మొదలుపెట్టాలనుకుంటున్న సంగతి తెలిసిందే. జులైలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా నటించనుందట. హిందీలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి సీనియర్ల సరసన సోనాక్షి నటించింది. దక్షిణాదిన సూపర్ స్టార్ రజినీకాంత్తోనూ ఆమె జోడీ కట్టింది.
ట్రెడిషనల్గా కనిపించే సోనాక్షిని ‘బంగార్రాజు’లో నటింపజేస్తే బాగుంటుందని నాగ్ ఫీలయ్యాడట. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడా ఓకే అనడంతో ఆమెనే ఈ సినిమాకు మెయిన్ హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే ప్రవీణ్ సత్తారు సినిమాను మొదలుపెట్టి అది పూర్తయ్యాక ‘బంగార్రాజు’ను మొదలుపెట్టాలని నాగ్ చూస్తున్నాడు.
This post was last modified on May 7, 2021 9:02 am
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…