సినిమాల్లో స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్లు ఒక్కొక్కరుగా డిజిటిల్ మీడియం వైపు అడుగులు వేస్తున్నారు. తమన్నా సైతం ఎన్నో ఆశలతో అటు వైపు అడుగులేసింది. ఆమె అరంగేట్ర వెబ్ సిరీస్ ‘లెవెంత్ అవర్’ గత నెలలోనే ఆహాలో ప్రసారం అయింది. కానీ ఈ సిరీస్కు ఆశించిన స్పందన రాలేదు. మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో భారీగానే ఈ సిరీస్ను తీర్చిదిద్దారు కానీ.. కథ బాగున్నా సరే, ట్రీట్మెంట్ అంత ఆసక్తికరంగా లేకపోవడంతో ‘లెవెంత్ అవర్’ ఆదరణ పొందలేదు.
అయినా సరే.. తమన్నా వెనకడుగు వేయలేదు. ఈసారి హాట్ స్టార్ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ‘నవంబర్ స్టోరీ’ పేరుతో ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ నెల 20న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో దీని ట్రైలర్ లాంచ్ చేశారు. అది ఆద్యంతం ఆసక్తికరంగా అనిపిస్తోంది.
వెబ్ సిరీస్ల్లో క్రైమ్ థ్రిల్లర్ జానర్కు మంచి సక్సెస్ రేట్ ఉంది. తమన్నా ఈసారి ఆ జానరే ట్రై చేస్తోంది. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే సిరీస్ ఇది. ఒక ఇంట్లో ఓ హత్య జరగడం.. ఏకంగా దానిపై 47 పోట్లు ఉండటం.. ఆ పోట్లు కత్తితో కాకుండా పెన్నుతో పొడిచినట్లు తేలడం.. ఏ ఆధారాలు దొరక్కుండా హంతుకుడు హతుడి ఒంటి మీద పెయింట్ పోయడంతో పోలీసులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకోవడం.. తమన్నా తండ్రే ఈ హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు రేకెత్తడం.. ఈ నేపథ్యంలో ట్రైలర్ చాలా ఉత్కంఠభరితంగానే అనిపిస్తోంది. బోలెడన్ని మలుపులతో ఈ సిరీస్ ప్రేక్షకులకు కావాల్సినంత థ్రిల్ ఇచ్చేలాగే ఉంది. ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. తమన్నా స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. చూస్తుంటే మిల్కీ బ్యూటీ ఈసారి సక్సెస్ అందుకునేలాగే కనిపిస్తోంది.
This post was last modified on May 6, 2021 4:06 pm
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…