సినిమాల్లో స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్లు ఒక్కొక్కరుగా డిజిటిల్ మీడియం వైపు అడుగులు వేస్తున్నారు. తమన్నా సైతం ఎన్నో ఆశలతో అటు వైపు అడుగులేసింది. ఆమె అరంగేట్ర వెబ్ సిరీస్ ‘లెవెంత్ అవర్’ గత నెలలోనే ఆహాలో ప్రసారం అయింది. కానీ ఈ సిరీస్కు ఆశించిన స్పందన రాలేదు. మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో భారీగానే ఈ సిరీస్ను తీర్చిదిద్దారు కానీ.. కథ బాగున్నా సరే, ట్రీట్మెంట్ అంత ఆసక్తికరంగా లేకపోవడంతో ‘లెవెంత్ అవర్’ ఆదరణ పొందలేదు.
అయినా సరే.. తమన్నా వెనకడుగు వేయలేదు. ఈసారి హాట్ స్టార్ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ‘నవంబర్ స్టోరీ’ పేరుతో ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ నెల 20న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో దీని ట్రైలర్ లాంచ్ చేశారు. అది ఆద్యంతం ఆసక్తికరంగా అనిపిస్తోంది.
వెబ్ సిరీస్ల్లో క్రైమ్ థ్రిల్లర్ జానర్కు మంచి సక్సెస్ రేట్ ఉంది. తమన్నా ఈసారి ఆ జానరే ట్రై చేస్తోంది. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే సిరీస్ ఇది. ఒక ఇంట్లో ఓ హత్య జరగడం.. ఏకంగా దానిపై 47 పోట్లు ఉండటం.. ఆ పోట్లు కత్తితో కాకుండా పెన్నుతో పొడిచినట్లు తేలడం.. ఏ ఆధారాలు దొరక్కుండా హంతుకుడు హతుడి ఒంటి మీద పెయింట్ పోయడంతో పోలీసులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకోవడం.. తమన్నా తండ్రే ఈ హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు రేకెత్తడం.. ఈ నేపథ్యంలో ట్రైలర్ చాలా ఉత్కంఠభరితంగానే అనిపిస్తోంది. బోలెడన్ని మలుపులతో ఈ సిరీస్ ప్రేక్షకులకు కావాల్సినంత థ్రిల్ ఇచ్చేలాగే ఉంది. ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. తమన్నా స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. చూస్తుంటే మిల్కీ బ్యూటీ ఈసారి సక్సెస్ అందుకునేలాగే కనిపిస్తోంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…