Movie News

పవన్ కోసం రెండేళ్లు వెయిట్ చేస్తాడా?

‘వకీల్‌సాబ్‌’ తో పవన్ అభిమానులంతా ఆనందంగా ఉన్నారు. తమ అభిమాన హీరోని పవర్ ప్యాకెడ్ రోల్ లో చూపినందుకు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఓటీటిలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వస్తోంది. ఇదంతా ఖచ్చితంగా దర్శకుడు వేణు శ్రీరామ్ ని ఆనందపరిచే అంశమే. గతంలో రెండు సినిమాలు చేసినా ఈ సినిమాతో దర్శకుడిగా ఓ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్‌ వేణుశ్రీరామ్‌. ‘వకీల్‌సాబ్‌’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తున్న నేపధ్యంలో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది హాట్ టాపిక్ గా మారింది. మీడియాలో చెప్పుకునేదాని ప్రకారం..వేణు శ్రీరామ్ మేకింగ్ స్టెయిల్ నచ్చిన పవన్ కళ్యాణ్ తనకు మరో స్క్రిప్టు రెడీ చేయమని అడిగారట. అందులో వింతేమీ లేదు కూడా.

పవన్ కళ్యాణ్ తనకు నచ్చిన,కంఫర్ట్ గా ఉన్న డైరక్టర్స్ తో కంటిన్యూగా సినిమాలు చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు మరొక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అయితే ఎప్పుడు కాంబినేషన్ స్టార్ట్ అవుతుంది. పవన్ వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. అప్పటిదాకా వేణు శ్రీరామ్ వెయిట్ చేయాలా. మరో హీరోతో సినిమా చేసి వస్తాడా..లేక ఈ లోగా పవన్ ని తన స్క్రిప్టుతో ఒప్పించే పనిలో ఉంటాడా. పవన్ కళ్యాణ్ తోనే సినిమా చేయాలంటే ఖచ్చితంగా చాలా కాలం వెయిట్ చేయాల్సి రావచ్చు. ఎందుకంటే కరోనా క్రైసిస్ తగ్గేదాకా సినిమాలు ప్రారంభం కావు.

అప్పుడు ఒక్కొక్క సినిమా పవన్ పూర్తి చేసుకుంటారు. అవన్నీ అయ్యాక వరసలో వేణు శ్రీరామ్ దగ్గరకు వస్తాడు. అయితే పవన్ వంటి స్టార్ హీరోతో చేయాలనుకున్నప్పుడే వెయిట్ చేయకతప్పదు. అది హరీష్ శంకర్ ని అడిగినా చెప్తాడు. అదంతా సరే ఈలోగా అల్లు అర్జున్ తో ఐకాన్ చేసేస్తాడా అని కొందరి ప్రశ్న. అయితే అసలు ఐకాన్ ప్రాజెక్టు ..ని అల్లు అర్జున్ చేస్తాడా అన్నది మరో ప్రశ్న. ఇవన్ని చూస్తూంటే వేణుశ్రీరామ్ మినిమం రెండు నుంచి మూడేళ్లు వెయిట్ చేస్తే కానీ పవన్ తో సినిమా కష్టం. వెయిట్ చేస్తాడా లేదా అన్నది అతని ఇష్టం.

This post was last modified on May 1, 2021 4:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

50 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago