అనుకున్న ప్రకటన రానే వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’ ఊహించినట్లే వాయిదా పడిపోయింది. మే 13న ఈ సినిమా విడుదల కానున్నట్లు కొన్ని నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రం ఆ తేదీకి రాదని గత నెలలోనే సందేహాలు మొదలయ్యాయి. షూటింగ్ ఆలస్యం కావడమే అందుక్కారణం. మామూలుగానే షూటింగ్ ఆలస్యంగా జరుగుతుంటే.. దీనికి తోడు కరోనా సెకండ్ వేవ్ యూనిట్ మీద తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పూర్తిగా షూటింగ్ ఆపేయక తప్పలేదు.
అటు ఇటుగా ఇంకో రెండు వారాల్లో సినిమా విడుదల కావాల్సి ఉండగా సినిమా షూటింగే పూర్తి కాలేదు. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ థియేటర్లు మూత పడి ఉన్నాయి. కరోనా విలయం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో ‘ఆచార్య’ను వాయిదా వేయడం మినహా మార్గం లేకపోయింది నిర్మాతలకు.
ఈ రోజో రేపో అధికారిక ప్రకటన వస్తుందనగా.. మంగళవారం నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ఉమ్మడిగా తమ చిత్రం వాయిదా పడటంపై అధికారిక ప్రకటన ఇచ్చారు. అనివార్య పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేస్తున్నామని.. తర్వాత సినిమాను ఎప్పుడు రిలీజ్ చేసేది పరిస్థితులను బట్టి, చర్చించి నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం అయితే ‘ఆచార్య’కు సంబంధించి ఇంకో నెల రోజుల దాకా షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. మే అంతటా కూడా షూటింగ్ జరిగే అవకాశాలు తక్కువే. జూన్లో మళ్లీ షూటింగ్ మొదలుపెడితే టాకీ పార్ట్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా అవగొట్టడానికి రెండు నెలలు పట్టొచ్చు. కాబట్టి ఆగస్టులో కానీ సినిమా విడుదలయ్యే అవకాశాలు లేవంటున్నారు. అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప’ ఆగస్టు 13 నుంచి వాయిదా పడేట్లయితే ఆ తేదీని చిరు సినిమాకు వాడుకునే అవకాశం ఉంది.
This post was last modified on April 27, 2021 12:08 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…