అనుకున్న ప్రకటన రానే వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’ ఊహించినట్లే వాయిదా పడిపోయింది. మే 13న ఈ సినిమా విడుదల కానున్నట్లు కొన్ని నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రం ఆ తేదీకి రాదని గత నెలలోనే సందేహాలు మొదలయ్యాయి. షూటింగ్ ఆలస్యం కావడమే అందుక్కారణం. మామూలుగానే షూటింగ్ ఆలస్యంగా జరుగుతుంటే.. దీనికి తోడు కరోనా సెకండ్ వేవ్ యూనిట్ మీద తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పూర్తిగా షూటింగ్ ఆపేయక తప్పలేదు.
అటు ఇటుగా ఇంకో రెండు వారాల్లో సినిమా విడుదల కావాల్సి ఉండగా సినిమా షూటింగే పూర్తి కాలేదు. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ థియేటర్లు మూత పడి ఉన్నాయి. కరోనా విలయం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో ‘ఆచార్య’ను వాయిదా వేయడం మినహా మార్గం లేకపోయింది నిర్మాతలకు.
ఈ రోజో రేపో అధికారిక ప్రకటన వస్తుందనగా.. మంగళవారం నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ఉమ్మడిగా తమ చిత్రం వాయిదా పడటంపై అధికారిక ప్రకటన ఇచ్చారు. అనివార్య పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేస్తున్నామని.. తర్వాత సినిమాను ఎప్పుడు రిలీజ్ చేసేది పరిస్థితులను బట్టి, చర్చించి నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం అయితే ‘ఆచార్య’కు సంబంధించి ఇంకో నెల రోజుల దాకా షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. మే అంతటా కూడా షూటింగ్ జరిగే అవకాశాలు తక్కువే. జూన్లో మళ్లీ షూటింగ్ మొదలుపెడితే టాకీ పార్ట్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా అవగొట్టడానికి రెండు నెలలు పట్టొచ్చు. కాబట్టి ఆగస్టులో కానీ సినిమా విడుదలయ్యే అవకాశాలు లేవంటున్నారు. అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప’ ఆగస్టు 13 నుంచి వాయిదా పడేట్లయితే ఆ తేదీని చిరు సినిమాకు వాడుకునే అవకాశం ఉంది.
This post was last modified on April 27, 2021 12:08 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…