అనుకున్న ప్రకటన రానే వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’ ఊహించినట్లే వాయిదా పడిపోయింది. మే 13న ఈ సినిమా విడుదల కానున్నట్లు కొన్ని నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రం ఆ తేదీకి రాదని గత నెలలోనే సందేహాలు మొదలయ్యాయి. షూటింగ్ ఆలస్యం కావడమే అందుక్కారణం. మామూలుగానే షూటింగ్ ఆలస్యంగా జరుగుతుంటే.. దీనికి తోడు కరోనా సెకండ్ వేవ్ యూనిట్ మీద తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పూర్తిగా షూటింగ్ ఆపేయక తప్పలేదు.
అటు ఇటుగా ఇంకో రెండు వారాల్లో సినిమా విడుదల కావాల్సి ఉండగా సినిమా షూటింగే పూర్తి కాలేదు. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ థియేటర్లు మూత పడి ఉన్నాయి. కరోనా విలయం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో ‘ఆచార్య’ను వాయిదా వేయడం మినహా మార్గం లేకపోయింది నిర్మాతలకు.
ఈ రోజో రేపో అధికారిక ప్రకటన వస్తుందనగా.. మంగళవారం నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ఉమ్మడిగా తమ చిత్రం వాయిదా పడటంపై అధికారిక ప్రకటన ఇచ్చారు. అనివార్య పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేస్తున్నామని.. తర్వాత సినిమాను ఎప్పుడు రిలీజ్ చేసేది పరిస్థితులను బట్టి, చర్చించి నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం అయితే ‘ఆచార్య’కు సంబంధించి ఇంకో నెల రోజుల దాకా షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. మే అంతటా కూడా షూటింగ్ జరిగే అవకాశాలు తక్కువే. జూన్లో మళ్లీ షూటింగ్ మొదలుపెడితే టాకీ పార్ట్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా అవగొట్టడానికి రెండు నెలలు పట్టొచ్చు. కాబట్టి ఆగస్టులో కానీ సినిమా విడుదలయ్యే అవకాశాలు లేవంటున్నారు. అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప’ ఆగస్టు 13 నుంచి వాయిదా పడేట్లయితే ఆ తేదీని చిరు సినిమాకు వాడుకునే అవకాశం ఉంది.
This post was last modified on April 27, 2021 12:08 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన సొంతింటికి బుధవారం శ్రీకారం చుట్టారు.…
ఎవరైనా సంగీత దర్శకుడికి పేరొచ్చేది అతనిచ్చే మొదటి ఆల్బమ్ ని బట్టే. అది హిట్టయ్యిందా అవకాశాలు క్యూ కడతాయి. లేదూ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం అత్యంత దారుణంగా గడిచిందని చెప్పక తప్పదు. ఓ…
రేపు, ఎల్లుండి బాక్సాఫీస్ కు నాలుగు కొత్త రిలీజులు ఉన్నాయి. మాములుగా అయితే సందడి ఓ రేంజ్ లో ఉండాలి.…
నాయకుడు అన్న వ్యక్తి.. హుందాగా వ్యవహరించాలి. పైగా.. గతంలో ఉన్నస్థాయి పదవులు అలంకరించిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే..…
భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా…