హీరోయిన్గా చేసిన తొలి సినిమాలో ఢిల్లీలో ఉండే తెలుగమ్మాయిగా నటించింది రాశి ఖన్నా. వాస్తవానికి ఆమె హైదరాబాద్లో ఉంటున్న ఢిల్లీ అమ్మాయి కావడం విశేషం. హైదరాబాద్లో సొంత ఇల్లు కూడా కొనుక్కుని ఇక్కడే స్థిరపడి పోవాలని నిర్ణయించుకుందామె. ప్రస్తుతం తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నప్పటికీ ఆమె ఫోకస్ తెలుగు సినిమాల మీదే ఉంది.
ఇక్కడి ప్రేక్షకుల అభిమానమే వేరు అంటున్న రాశి.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన కెరీర్లో వరస్ట్ ఫేజ్ గురించి మాట్లాడింది. ఒకప్పుడు రాశి కొంచెం లావుగా, బబ్లీగా కనిపించేదన్న సంగతి తెలిసిందే. అప్పుడు మీడియాతో పాటు అభిమానులు కూడా రకరకాలుగా మాట్లాడుకున్నారని.. కానీ అప్పుడు తాను కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటం వల్లే అలా లావుగా తయారయ్యానని రాశి చెప్పుకొచ్చింది. ఇదే తన కెరీర్లో వరస్ట్ ఫేజ్ అని కూడా చెప్పింది.
ఐతే తన బాడీ గురించి విమర్శలు మంచే చేశాయని.. పట్టుదలతో బరువు తగ్గాలని చూశానని రాశి తెలిపింది. ఐతే బరువు తగ్గేందుకు చేసిన కొన్ని ప్రయత్నాలు ఎంతమాత్రం ఫలితాన్నివ్వలేదని.. తర్వాత ఎంతో కష్టపడి.. క్రమ పద్ధతిలో వ్యాయామాలు చేసి, ఆహార నియమాలు పాటించి బరువు తగ్గినట్లు రాశి వెల్లడించింది.
ఇక తెలుగులో చివరగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విషయంలో తాను రిగ్రెట్ అవుతున్నట్లు వచ్చిన వార్తల్ని ఆమె ఖండించింది. ఆ సినిమాలో తన పాత్ర గురించి చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యానని.. కచ్చితంగా ఆ సినిమా చేయాలని అనుకున్నానని.. ఐతే కొన్నిసార్లు పేపర్ ఉన్నంత ఎగ్జైటింగ్గా తెరపైకి పాత్రలు రాకపోవచ్చని.. ఎడిటింగ్లో తన సన్నివేశాలు కొన్ని పోవడం వల్ల కూడా ఆ పాత్రకు కొంత అన్యాయం జరిగిందని ఆమె అభిప్రాయపడింది. ఏదేమైనప్పటికీ ఈ సినిమా తనకు మంచి పాఠం అని రాశి చెప్పింది.
ఏపీ రాజధాని అమరావతిలో పనుల నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనేక…
సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…