హీరోయిన్గా చేసిన తొలి సినిమాలో ఢిల్లీలో ఉండే తెలుగమ్మాయిగా నటించింది రాశి ఖన్నా. వాస్తవానికి ఆమె హైదరాబాద్లో ఉంటున్న ఢిల్లీ అమ్మాయి కావడం విశేషం. హైదరాబాద్లో సొంత ఇల్లు కూడా కొనుక్కుని ఇక్కడే స్థిరపడి పోవాలని నిర్ణయించుకుందామె. ప్రస్తుతం తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నప్పటికీ ఆమె ఫోకస్ తెలుగు సినిమాల మీదే ఉంది.
ఇక్కడి ప్రేక్షకుల అభిమానమే వేరు అంటున్న రాశి.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన కెరీర్లో వరస్ట్ ఫేజ్ గురించి మాట్లాడింది. ఒకప్పుడు రాశి కొంచెం లావుగా, బబ్లీగా కనిపించేదన్న సంగతి తెలిసిందే. అప్పుడు మీడియాతో పాటు అభిమానులు కూడా రకరకాలుగా మాట్లాడుకున్నారని.. కానీ అప్పుడు తాను కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటం వల్లే అలా లావుగా తయారయ్యానని రాశి చెప్పుకొచ్చింది. ఇదే తన కెరీర్లో వరస్ట్ ఫేజ్ అని కూడా చెప్పింది.
ఐతే తన బాడీ గురించి విమర్శలు మంచే చేశాయని.. పట్టుదలతో బరువు తగ్గాలని చూశానని రాశి తెలిపింది. ఐతే బరువు తగ్గేందుకు చేసిన కొన్ని ప్రయత్నాలు ఎంతమాత్రం ఫలితాన్నివ్వలేదని.. తర్వాత ఎంతో కష్టపడి.. క్రమ పద్ధతిలో వ్యాయామాలు చేసి, ఆహార నియమాలు పాటించి బరువు తగ్గినట్లు రాశి వెల్లడించింది.
ఇక తెలుగులో చివరగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విషయంలో తాను రిగ్రెట్ అవుతున్నట్లు వచ్చిన వార్తల్ని ఆమె ఖండించింది. ఆ సినిమాలో తన పాత్ర గురించి చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యానని.. కచ్చితంగా ఆ సినిమా చేయాలని అనుకున్నానని.. ఐతే కొన్నిసార్లు పేపర్ ఉన్నంత ఎగ్జైటింగ్గా తెరపైకి పాత్రలు రాకపోవచ్చని.. ఎడిటింగ్లో తన సన్నివేశాలు కొన్ని పోవడం వల్ల కూడా ఆ పాత్రకు కొంత అన్యాయం జరిగిందని ఆమె అభిప్రాయపడింది. ఏదేమైనప్పటికీ ఈ సినిమా తనకు మంచి పాఠం అని రాశి చెప్పింది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…