హీరోయిన్గా చేసిన తొలి సినిమాలో ఢిల్లీలో ఉండే తెలుగమ్మాయిగా నటించింది రాశి ఖన్నా. వాస్తవానికి ఆమె హైదరాబాద్లో ఉంటున్న ఢిల్లీ అమ్మాయి కావడం విశేషం. హైదరాబాద్లో సొంత ఇల్లు కూడా కొనుక్కుని ఇక్కడే స్థిరపడి పోవాలని నిర్ణయించుకుందామె. ప్రస్తుతం తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నప్పటికీ ఆమె ఫోకస్ తెలుగు సినిమాల మీదే ఉంది.
ఇక్కడి ప్రేక్షకుల అభిమానమే వేరు అంటున్న రాశి.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన కెరీర్లో వరస్ట్ ఫేజ్ గురించి మాట్లాడింది. ఒకప్పుడు రాశి కొంచెం లావుగా, బబ్లీగా కనిపించేదన్న సంగతి తెలిసిందే. అప్పుడు మీడియాతో పాటు అభిమానులు కూడా రకరకాలుగా మాట్లాడుకున్నారని.. కానీ అప్పుడు తాను కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటం వల్లే అలా లావుగా తయారయ్యానని రాశి చెప్పుకొచ్చింది. ఇదే తన కెరీర్లో వరస్ట్ ఫేజ్ అని కూడా చెప్పింది.
ఐతే తన బాడీ గురించి విమర్శలు మంచే చేశాయని.. పట్టుదలతో బరువు తగ్గాలని చూశానని రాశి తెలిపింది. ఐతే బరువు తగ్గేందుకు చేసిన కొన్ని ప్రయత్నాలు ఎంతమాత్రం ఫలితాన్నివ్వలేదని.. తర్వాత ఎంతో కష్టపడి.. క్రమ పద్ధతిలో వ్యాయామాలు చేసి, ఆహార నియమాలు పాటించి బరువు తగ్గినట్లు రాశి వెల్లడించింది.
ఇక తెలుగులో చివరగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విషయంలో తాను రిగ్రెట్ అవుతున్నట్లు వచ్చిన వార్తల్ని ఆమె ఖండించింది. ఆ సినిమాలో తన పాత్ర గురించి చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యానని.. కచ్చితంగా ఆ సినిమా చేయాలని అనుకున్నానని.. ఐతే కొన్నిసార్లు పేపర్ ఉన్నంత ఎగ్జైటింగ్గా తెరపైకి పాత్రలు రాకపోవచ్చని.. ఎడిటింగ్లో తన సన్నివేశాలు కొన్ని పోవడం వల్ల కూడా ఆ పాత్రకు కొంత అన్యాయం జరిగిందని ఆమె అభిప్రాయపడింది. ఏదేమైనప్పటికీ ఈ సినిమా తనకు మంచి పాఠం అని రాశి చెప్పింది.
This post was last modified on May 13, 2020 4:04 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…