గత ఏడాది కరోనా కారణంగా తలెత్తిన లాక్ డౌన్ వల్ల మూత పడ్డ థియేటర్లు ఏడు నెలల పాటు తెరుచుకోలేదు. తర్వాత థియేటర్లు నడుపుకోవడానికి అనుమతులు వచ్చినా అవి పూర్తి స్థాయిలో నడవడానికి బాగానే టైం పట్టింది. ఐతే మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ త్వరగానే కుదురుకుంది. ఇక్కడ థియేటర్లు పూర్వ వైభవం సంతరించుకున్నాయి. కొన్ని సినిమాలు భారీగా వసూళ్లు తెచ్చుకున్నాయి.
ఇక మళ్లీ గత ఏడాది చూసిన విపత్కర పరిస్థితి ఎప్పటికీ రాదనే అనుకున్నారంతా. కానీ గత కొన్ని వారాల్లో ఉన్నట్లుండి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. థియేటర్ల మీద ఆంక్షలు తప్పలేదు. ప్రభుత్వం ఆదేశించకున్నా సరే.. థియేటర్లను యాజమాన్యాలు స్వచ్ఛందంగా మూసి వేసే పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ నెలలో ముందు షెడ్యూల్ అయిన పేరున్న సినిమాలు.. ఆ తర్వాత రేసులోకి వచ్చిన చిన్న సినిమాలు వాయిదా పడక తప్పలేదు.
‘విరాట పర్వం’ రిలీజ్ వాయిదా పడటంతో అది రావాల్సిన ఏప్రిల్ 30కి అనసూయ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘థ్యాంక్ యు బ్రదర్’ షెడ్యూల్ కావడం.. తర్వాత థియేటర్లు పూర్తిగా మూత పడుతున్న పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేయాల్సి రావడం తెలిసిందే. ఐతే ఇప్పుడిప్పుడే పరిస్థితులు బాగుపడేలా లేకపోవడంతో ఈ సినిమాకు పూర్తిగా థియేట్రికల్ రిలీజ్ ఆపేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.
ఇప్పటికే ఈ చిత్ర డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న ‘ఆహా’ ఓటీటీలో నేరుగా రిలీజ్ చేయడానికి డిసైడయ్యారు. మే 7న ఈ సినిమాకు ‘ఆహా’లో ప్రిమియర్స్ పడబోతున్నాయి. బహుశా ఈ చిత్రాన్ని 30న థియేటర్లలో రిలీజ్ చేసి ఉన్నా వారానికే ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఒప్పందం కుదిరి ఉండొచ్చు. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఆ తేదీనే సినిమాను ఆహాలో వదిలేస్తున్నారు. రమేష్ రాపర్తి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.
This post was last modified on April 26, 2021 2:30 pm
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…