గత ఏడాది కరోనా కారణంగా తలెత్తిన లాక్ డౌన్ వల్ల మూత పడ్డ థియేటర్లు ఏడు నెలల పాటు తెరుచుకోలేదు. తర్వాత థియేటర్లు నడుపుకోవడానికి అనుమతులు వచ్చినా అవి పూర్తి స్థాయిలో నడవడానికి బాగానే టైం పట్టింది. ఐతే మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ త్వరగానే కుదురుకుంది. ఇక్కడ థియేటర్లు పూర్వ వైభవం సంతరించుకున్నాయి. కొన్ని సినిమాలు భారీగా వసూళ్లు తెచ్చుకున్నాయి.
ఇక మళ్లీ గత ఏడాది చూసిన విపత్కర పరిస్థితి ఎప్పటికీ రాదనే అనుకున్నారంతా. కానీ గత కొన్ని వారాల్లో ఉన్నట్లుండి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. థియేటర్ల మీద ఆంక్షలు తప్పలేదు. ప్రభుత్వం ఆదేశించకున్నా సరే.. థియేటర్లను యాజమాన్యాలు స్వచ్ఛందంగా మూసి వేసే పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ నెలలో ముందు షెడ్యూల్ అయిన పేరున్న సినిమాలు.. ఆ తర్వాత రేసులోకి వచ్చిన చిన్న సినిమాలు వాయిదా పడక తప్పలేదు.
‘విరాట పర్వం’ రిలీజ్ వాయిదా పడటంతో అది రావాల్సిన ఏప్రిల్ 30కి అనసూయ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘థ్యాంక్ యు బ్రదర్’ షెడ్యూల్ కావడం.. తర్వాత థియేటర్లు పూర్తిగా మూత పడుతున్న పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేయాల్సి రావడం తెలిసిందే. ఐతే ఇప్పుడిప్పుడే పరిస్థితులు బాగుపడేలా లేకపోవడంతో ఈ సినిమాకు పూర్తిగా థియేట్రికల్ రిలీజ్ ఆపేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.
ఇప్పటికే ఈ చిత్ర డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న ‘ఆహా’ ఓటీటీలో నేరుగా రిలీజ్ చేయడానికి డిసైడయ్యారు. మే 7న ఈ సినిమాకు ‘ఆహా’లో ప్రిమియర్స్ పడబోతున్నాయి. బహుశా ఈ చిత్రాన్ని 30న థియేటర్లలో రిలీజ్ చేసి ఉన్నా వారానికే ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఒప్పందం కుదిరి ఉండొచ్చు. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఆ తేదీనే సినిమాను ఆహాలో వదిలేస్తున్నారు. రమేష్ రాపర్తి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.
This post was last modified on April 26, 2021 2:30 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…