Movie News

థియేట్రికల్ రిలీజ్ క్యాన్సిల్.. నేరుగా ఓటీటీలోనే

గత ఏడాది కరోనా కారణంగా తలెత్తిన లాక్ డౌన్ వల్ల మూత పడ్డ థియేటర్లు ఏడు నెలల పాటు తెరుచుకోలేదు. తర్వాత థియేటర్లు నడుపుకోవడానికి అనుమతులు వచ్చినా అవి పూర్తి స్థాయిలో నడవడానికి బాగానే టైం పట్టింది. ఐతే మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ త్వరగానే కుదురుకుంది. ఇక్కడ థియేటర్లు పూర్వ వైభవం సంతరించుకున్నాయి. కొన్ని సినిమాలు భారీగా వసూళ్లు తెచ్చుకున్నాయి.

ఇక మళ్లీ గత ఏడాది చూసిన విపత్కర పరిస్థితి ఎప్పటికీ రాదనే అనుకున్నారంతా. కానీ గత కొన్ని వారాల్లో ఉన్నట్లుండి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. థియేటర్ల మీద ఆంక్షలు తప్పలేదు. ప్రభుత్వం ఆదేశించకున్నా సరే.. థియేటర్లను యాజమాన్యాలు స్వచ్ఛందంగా మూసి వేసే పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ నెలలో ముందు షెడ్యూల్ అయిన పేరున్న సినిమాలు.. ఆ తర్వాత రేసులోకి వచ్చిన చిన్న సినిమాలు వాయిదా పడక తప్పలేదు.

‘విరాట పర్వం’ రిలీజ్ వాయిదా పడటంతో అది రావాల్సిన ఏప్రిల్ 30కి అనసూయ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘థ్యాంక్ యు బ్రదర్’ షెడ్యూల్ కావడం.. తర్వాత థియేటర్లు పూర్తిగా మూత పడుతున్న పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేయాల్సి రావడం తెలిసిందే. ఐతే ఇప్పుడిప్పుడే పరిస్థితులు బాగుపడేలా లేకపోవడంతో ఈ సినిమాకు పూర్తిగా థియేట్రికల్ రిలీజ్ ఆపేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.

ఇప్పటికే ఈ చిత్ర డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న ‘ఆహా’ ఓటీటీలో నేరుగా రిలీజ్ చేయడానికి డిసైడయ్యారు. మే 7న ఈ సినిమాకు ‘ఆహా’లో ప్రిమియర్స్ పడబోతున్నాయి. బహుశా ఈ చిత్రాన్ని 30న థియేటర్లలో రిలీజ్ చేసి ఉన్నా వారానికే ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఒప్పందం కుదిరి ఉండొచ్చు. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఆ తేదీనే సినిమాను ఆహాలో వదిలేస్తున్నారు. రమేష్ రాపర్తి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.

This post was last modified on April 26, 2021 2:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

44 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

3 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

5 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

5 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

6 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago