టాలీవుడ్లో మళ్లీ గత ఏడాది పరిస్థితులే కనిపిస్తున్నాయి. థియేటర్లు మూత పడుతున్నాయి. షూటింగ్స్ ఆగిపోతున్నాయి. కరోనా తీవ్రత దృష్ట్యా మళ్లీ స్తబ్దత నెలకొంటోంది. స్టార్ హీరోలందరూ ఇంటికి పరిమితం అవుతున్నారు. షూటింగ్స్ ఆగిపోతుండటంతో వివిధ చిత్రాల బృందాలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే గత ఏఢాది లాగే సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం జరగబోతోంది.
నిరుడు లాక్ డౌన్ టైంలోనే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాను అనౌన్స్ చేసి అభిమానులను మురిపించాడు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ప్రతి పుట్టిన రోజుకూ తన సినిమాల నుంచి ఏదో ఒక విశేషం పంచుకోవడం మహేష్కు అలవాటే. గత ఏడాది ‘సర్కారు వారి పాట’ సినిమాను అనౌన్స్ చేసింది ఆ రోజే. ఇక ఈసారి కృష్ణ బర్త్ డేకి టీజర్తో పలకరించబోతున్నాడట మహేష్.
‘సర్కారు వారి పాట’ షూటింగ్ను కొన్ని రోజుల కిందటే ఆపేసి ఇంటికి పరిమితం అయిపోయాడు మహేష్. ఇక దర్శకుడు పరశురామ్ అండ్ టీం ఇప్పటిదాకా షూటింగ్ జరిపినంత వరకు రష్ చూసుకుని ఎడిటింగ్ చేసుకోవడం, తర్వాత తీయబోయే సన్నివేశాలను సరి చూసకోవడం లాంటి పనుల్లో నిమగ్నం అవుతున్నారు. మేలో కూడా షూటింగ్ జరగడం సందేహంగానే ఉండటంతో ‘సర్కారు వారి పాట’ టీజర్ రెడీ చేయడానికి బాగానే సమయం దొరికినట్లే.
ఇప్పటికే టీజర్ కోసం కాన్సెప్ట్ రెడీ అయిందని.. షూట్ చేసిన సన్నివేశాల నుంచి షాట్స్ తీసుకుని టీజర్ రెడీ చేయబోతున్నారని అంటున్నారు. కాబట్టి మే 31కి ‘సర్కారు వారి పాట’ ట్రీట్కు మహేష్ అభిమానులు రెడీ అయిపోవచ్చు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది ముందున్న ప్లాన్. కానీ కరోనా సెకండ్ వేవ్ ధాటికి చాలా సినిమాల షెడ్యూళ్లన్నీ మారిపోతుండటంతో కచ్చితంగా ఆ పండక్కే ఈ సినిమా వస్తుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది.
This post was last modified on April 26, 2021 8:08 am
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…