టాలీవుడ్లో మళ్లీ గత ఏడాది పరిస్థితులే కనిపిస్తున్నాయి. థియేటర్లు మూత పడుతున్నాయి. షూటింగ్స్ ఆగిపోతున్నాయి. కరోనా తీవ్రత దృష్ట్యా మళ్లీ స్తబ్దత నెలకొంటోంది. స్టార్ హీరోలందరూ ఇంటికి పరిమితం అవుతున్నారు. షూటింగ్స్ ఆగిపోతుండటంతో వివిధ చిత్రాల బృందాలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే గత ఏఢాది లాగే సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం జరగబోతోంది.
నిరుడు లాక్ డౌన్ టైంలోనే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాను అనౌన్స్ చేసి అభిమానులను మురిపించాడు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ప్రతి పుట్టిన రోజుకూ తన సినిమాల నుంచి ఏదో ఒక విశేషం పంచుకోవడం మహేష్కు అలవాటే. గత ఏడాది ‘సర్కారు వారి పాట’ సినిమాను అనౌన్స్ చేసింది ఆ రోజే. ఇక ఈసారి కృష్ణ బర్త్ డేకి టీజర్తో పలకరించబోతున్నాడట మహేష్.
‘సర్కారు వారి పాట’ షూటింగ్ను కొన్ని రోజుల కిందటే ఆపేసి ఇంటికి పరిమితం అయిపోయాడు మహేష్. ఇక దర్శకుడు పరశురామ్ అండ్ టీం ఇప్పటిదాకా షూటింగ్ జరిపినంత వరకు రష్ చూసుకుని ఎడిటింగ్ చేసుకోవడం, తర్వాత తీయబోయే సన్నివేశాలను సరి చూసకోవడం లాంటి పనుల్లో నిమగ్నం అవుతున్నారు. మేలో కూడా షూటింగ్ జరగడం సందేహంగానే ఉండటంతో ‘సర్కారు వారి పాట’ టీజర్ రెడీ చేయడానికి బాగానే సమయం దొరికినట్లే.
ఇప్పటికే టీజర్ కోసం కాన్సెప్ట్ రెడీ అయిందని.. షూట్ చేసిన సన్నివేశాల నుంచి షాట్స్ తీసుకుని టీజర్ రెడీ చేయబోతున్నారని అంటున్నారు. కాబట్టి మే 31కి ‘సర్కారు వారి పాట’ ట్రీట్కు మహేష్ అభిమానులు రెడీ అయిపోవచ్చు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది ముందున్న ప్లాన్. కానీ కరోనా సెకండ్ వేవ్ ధాటికి చాలా సినిమాల షెడ్యూళ్లన్నీ మారిపోతుండటంతో కచ్చితంగా ఆ పండక్కే ఈ సినిమా వస్తుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది.
This post was last modified on April 26, 2021 8:08 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…