టాలీవుడ్లో మళ్లీ గత ఏడాది పరిస్థితులే కనిపిస్తున్నాయి. థియేటర్లు మూత పడుతున్నాయి. షూటింగ్స్ ఆగిపోతున్నాయి. కరోనా తీవ్రత దృష్ట్యా మళ్లీ స్తబ్దత నెలకొంటోంది. స్టార్ హీరోలందరూ ఇంటికి పరిమితం అవుతున్నారు. షూటింగ్స్ ఆగిపోతుండటంతో వివిధ చిత్రాల బృందాలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే గత ఏఢాది లాగే సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం జరగబోతోంది.
నిరుడు లాక్ డౌన్ టైంలోనే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాను అనౌన్స్ చేసి అభిమానులను మురిపించాడు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ప్రతి పుట్టిన రోజుకూ తన సినిమాల నుంచి ఏదో ఒక విశేషం పంచుకోవడం మహేష్కు అలవాటే. గత ఏడాది ‘సర్కారు వారి పాట’ సినిమాను అనౌన్స్ చేసింది ఆ రోజే. ఇక ఈసారి కృష్ణ బర్త్ డేకి టీజర్తో పలకరించబోతున్నాడట మహేష్.
‘సర్కారు వారి పాట’ షూటింగ్ను కొన్ని రోజుల కిందటే ఆపేసి ఇంటికి పరిమితం అయిపోయాడు మహేష్. ఇక దర్శకుడు పరశురామ్ అండ్ టీం ఇప్పటిదాకా షూటింగ్ జరిపినంత వరకు రష్ చూసుకుని ఎడిటింగ్ చేసుకోవడం, తర్వాత తీయబోయే సన్నివేశాలను సరి చూసకోవడం లాంటి పనుల్లో నిమగ్నం అవుతున్నారు. మేలో కూడా షూటింగ్ జరగడం సందేహంగానే ఉండటంతో ‘సర్కారు వారి పాట’ టీజర్ రెడీ చేయడానికి బాగానే సమయం దొరికినట్లే.
ఇప్పటికే టీజర్ కోసం కాన్సెప్ట్ రెడీ అయిందని.. షూట్ చేసిన సన్నివేశాల నుంచి షాట్స్ తీసుకుని టీజర్ రెడీ చేయబోతున్నారని అంటున్నారు. కాబట్టి మే 31కి ‘సర్కారు వారి పాట’ ట్రీట్కు మహేష్ అభిమానులు రెడీ అయిపోవచ్చు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది ముందున్న ప్లాన్. కానీ కరోనా సెకండ్ వేవ్ ధాటికి చాలా సినిమాల షెడ్యూళ్లన్నీ మారిపోతుండటంతో కచ్చితంగా ఆ పండక్కే ఈ సినిమా వస్తుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది.
This post was last modified on April 26, 2021 8:08 am
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…