Movie News

జెనీలియా రీఎంట్రీ.. స్వీట్ షాక్

అల్లరి అమ్మాయిగా తెలుగు వెండితెరపై జెనీలియా చేసిన సందడి అంతా ఇంతా కాదు. జెనీలియా పేరు చెప్పగానే బొమ్మరిల్లు, రెడీ, ఢీ లాంటి చిత్రాలు మదిలో మెదులుతాయి. వివాహం తర్వాత జెనీలియా ముంబైలో సెటిల్ అయింది. సినిమాలకు దూరమై మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. 

గత కొన్ని రోజులుగా జెనీలియా రీఎంట్రీ గురించి ప్రచారం జరుగుతోంది. మంచి అవకాశం వస్తే తిరిగి నటించాలనే ఆలోచనలో జెనీలియా కూడా ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. దీనితో టాలీవుడ్ లో ఆమెకు ఉన్న ఫేమ్ దృష్ట్యా ఇప్పటికే కొంతమంది నిర్మాతలు, దర్శకులు సంప్రదింపులు మొదలుపెట్టారట. 

హీరో రామ్ పోతినేని, జెనీలియా మధ్య మంచి స్నేహం ఉంది. తిరిగి నటించాలని రామ్ కూడా జెనీలియాకు సలహాలు ఇస్తుంటాడట. అయితే జెనీలియా రీఎంట్రీ గురించి ప్రచారం అవుతున్న ఓ వార్త అభిమానులని స్వీట్ షాక్ కు గురిచేస్తోంది. రామ్ తదుపరి చిత్రాల్లో ఓ చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా నటించబోతున్నట్లు టాక్.
సాధారణంగా పెళ్లి చేసుకుని గ్యాప్ తీసుకున్న హీరోయిన్లు రీఎంట్రీలో వదిన, అక్క తరహా పాత్రలకు పరిమితమవుతారు. చాలా తక్కువమందికి మాత్రమే హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కుతుంది. మరి జెనీలియాని రామ్ హీరోయిన్ గా రికమండ్ చేస్తాడేమో చూడాలి. 

రెడీ చిత్రంతో వీరిద్దరూ సూపర్ హిట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శత్వంలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడితో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. మరి జెనీలియాకు నిజంగానే రామ్ సరసన హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందా.. వస్తే ఏ చిత్రంలో నటించనుంది అనేవి ఇప్పటికైతే ప్రశ్నలే.

This post was last modified on April 24, 2021 11:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

శంక‌ర్‌కు బ‌డా నిర్మాత కండిష‌న్‌

రాజ‌మౌళి కంటే ముందు సౌత్ ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుత‌మైన క‌థ‌లు, క‌ళ్లు చెదిరే విజువ‌ల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…

18 minutes ago

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

1 hour ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

1 hour ago

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

4 hours ago

మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా

​విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…

7 hours ago

వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…

9 hours ago