తెలుగులో భారీ సినిమాలు ఎక్కువగా టార్గెట్ చేసేది సంక్రాంతి సీజన్నే. ఇంకే సీజన్లోనూ లేని సినిమా మూడ్ జనాల్లో అప్పుడే ఉంటుంది. ఇంకెప్పుడూ రానన్ని వసూళ్లు అప్పుడు వస్తుంటాయి. అందుకే వేరే సినిమాలతో పోటీ ఉన్నా సరే.. సంక్రాంతికే తమ సినిమాను రిలీజ్ చేయాలని భారీ చిత్రాల నిర్మాతలు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు భారీ వసూళ్లు రావడంతో సంక్రాంతి మీద మరింత గురి కుదిరింది. దీంతో చాలా ముందుగానే బెర్తులు బుక్ చేసుకునే పనిలో పడ్డారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి తన కొత్త సినిమాను తీసుకెళ్లి సంక్రాంతి రేసులో నిలబెట్టేశాడు.
ఈ ఏడాది జులై 30న రావాల్సిన ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జక్కన్న ఇచ్చిన షాక్తో కొందరు స్టార్ హీరోలు, బడా నిర్మాతలకు దిమ్మదిరిగిపోయింది. దీంతో వాళ్ల ప్రణాళికలు మార్చుకోవాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఆ సీజన్లో కొంచెం రేంజ్ ఉన్న సినిమాలే మూడు రిలీజ్ చేసుకునే అవకాశముండేది. కానీ ఆర్ఆర్ఆర్కు ఎదురెళ్లడం ఎందుకని ఆగిపోయారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది వేసవి, ఆ తర్వాతి నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలకు కరోనా రూపంలో పెద్ద చిక్కొచ్చి పడింది.
ఈ నెలల్లో షెడ్యూల్ అయిన పేరున్న సినిమాలన్నీ వెనక్కి వెళ్తున్నాయి. ఇప్పుడిక వాటికి మిగిలిన మంచి సీజన్ అంటే.. దసరా-దీపావళి మధ్య కాలమే. కానీ ఆ సీజన్లో మహా అయితే మూడో నాలుగో సినిమాలు రిలీజ్ చేయొచ్చు. మిగతా వాటి పరిస్థితేంటి? కాస్త వెనక్కి వెళ్లి సంక్రాంతికి ట్రై చేద్దామంటే అక్కడ రాజమౌళి సినిమా ఉంది. దీంతో ఇంకా ముందుకెళ్లి వేసవిని టార్గెట్ చేయాల్సి వస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వచ్చే సీజన్కు విపరీతమైన పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on April 9, 2020 6:30 pm
ఇటీవలే ప్రమాదానికి గురై భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల…
నిన్న జరిగిన బండ్ల గణేష్ కూతురి వివాహ వేడుకకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి…
విశ్వనాథ్ అండ్ సన్స్ తో దర్శకుడు వెంకీ అట్లూరి దిగ్విజయంగా హ్యాట్రిక్ పూర్తి చేశారు. ఇంత స్థిరంగా బ్యాక్ టు…
లోకేష్ కనగరాజ్ హీరోగా వచ్చిన 'డీసీ' సినిమాకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఆగస్టు 7న రిలీజైన…
ఓటిటిలు ఇంత విస్తృతంగా పెరిగిన తర్వాత ఏదైనా హిట్ సినిమాని రీమేక్ చేయాలంటే సంవత్సరాలు కాకుండా నెలల్లోనే పూర్తి చేయాలి.…
దర్శకుడు కొరటాల శివ టైం అంత బాగా నడుస్తున్నట్టు లేదు. ఆచార్య మానని గాయం చేసింది. డిజాస్టర్లు అందరికీ వస్తాయి…