తెలుగులో భారీ సినిమాలు ఎక్కువగా టార్గెట్ చేసేది సంక్రాంతి సీజన్నే. ఇంకే సీజన్లోనూ లేని సినిమా మూడ్ జనాల్లో అప్పుడే ఉంటుంది. ఇంకెప్పుడూ రానన్ని వసూళ్లు అప్పుడు వస్తుంటాయి. అందుకే వేరే సినిమాలతో పోటీ ఉన్నా సరే.. సంక్రాంతికే తమ సినిమాను రిలీజ్ చేయాలని భారీ చిత్రాల నిర్మాతలు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు భారీ వసూళ్లు రావడంతో సంక్రాంతి మీద మరింత గురి కుదిరింది. దీంతో చాలా ముందుగానే బెర్తులు బుక్ చేసుకునే పనిలో పడ్డారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి తన కొత్త సినిమాను తీసుకెళ్లి సంక్రాంతి రేసులో నిలబెట్టేశాడు.
ఈ ఏడాది జులై 30న రావాల్సిన ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జక్కన్న ఇచ్చిన షాక్తో కొందరు స్టార్ హీరోలు, బడా నిర్మాతలకు దిమ్మదిరిగిపోయింది. దీంతో వాళ్ల ప్రణాళికలు మార్చుకోవాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఆ సీజన్లో కొంచెం రేంజ్ ఉన్న సినిమాలే మూడు రిలీజ్ చేసుకునే అవకాశముండేది. కానీ ఆర్ఆర్ఆర్కు ఎదురెళ్లడం ఎందుకని ఆగిపోయారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది వేసవి, ఆ తర్వాతి నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలకు కరోనా రూపంలో పెద్ద చిక్కొచ్చి పడింది.
ఈ నెలల్లో షెడ్యూల్ అయిన పేరున్న సినిమాలన్నీ వెనక్కి వెళ్తున్నాయి. ఇప్పుడిక వాటికి మిగిలిన మంచి సీజన్ అంటే.. దసరా-దీపావళి మధ్య కాలమే. కానీ ఆ సీజన్లో మహా అయితే మూడో నాలుగో సినిమాలు రిలీజ్ చేయొచ్చు. మిగతా వాటి పరిస్థితేంటి? కాస్త వెనక్కి వెళ్లి సంక్రాంతికి ట్రై చేద్దామంటే అక్కడ రాజమౌళి సినిమా ఉంది. దీంతో ఇంకా ముందుకెళ్లి వేసవిని టార్గెట్ చేయాల్సి వస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వచ్చే సీజన్కు విపరీతమైన పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on April 9, 2020 6:30 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…