తెలుగులో భారీ సినిమాలు ఎక్కువగా టార్గెట్ చేసేది సంక్రాంతి సీజన్నే. ఇంకే సీజన్లోనూ లేని సినిమా మూడ్ జనాల్లో అప్పుడే ఉంటుంది. ఇంకెప్పుడూ రానన్ని వసూళ్లు అప్పుడు వస్తుంటాయి. అందుకే వేరే సినిమాలతో పోటీ ఉన్నా సరే.. సంక్రాంతికే తమ సినిమాను రిలీజ్ చేయాలని భారీ చిత్రాల నిర్మాతలు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు భారీ వసూళ్లు రావడంతో సంక్రాంతి మీద మరింత గురి కుదిరింది. దీంతో చాలా ముందుగానే బెర్తులు బుక్ చేసుకునే పనిలో పడ్డారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి తన కొత్త సినిమాను తీసుకెళ్లి సంక్రాంతి రేసులో నిలబెట్టేశాడు.
ఈ ఏడాది జులై 30న రావాల్సిన ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జక్కన్న ఇచ్చిన షాక్తో కొందరు స్టార్ హీరోలు, బడా నిర్మాతలకు దిమ్మదిరిగిపోయింది. దీంతో వాళ్ల ప్రణాళికలు మార్చుకోవాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఆ సీజన్లో కొంచెం రేంజ్ ఉన్న సినిమాలే మూడు రిలీజ్ చేసుకునే అవకాశముండేది. కానీ ఆర్ఆర్ఆర్కు ఎదురెళ్లడం ఎందుకని ఆగిపోయారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది వేసవి, ఆ తర్వాతి నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలకు కరోనా రూపంలో పెద్ద చిక్కొచ్చి పడింది.
ఈ నెలల్లో షెడ్యూల్ అయిన పేరున్న సినిమాలన్నీ వెనక్కి వెళ్తున్నాయి. ఇప్పుడిక వాటికి మిగిలిన మంచి సీజన్ అంటే.. దసరా-దీపావళి మధ్య కాలమే. కానీ ఆ సీజన్లో మహా అయితే మూడో నాలుగో సినిమాలు రిలీజ్ చేయొచ్చు. మిగతా వాటి పరిస్థితేంటి? కాస్త వెనక్కి వెళ్లి సంక్రాంతికి ట్రై చేద్దామంటే అక్కడ రాజమౌళి సినిమా ఉంది. దీంతో ఇంకా ముందుకెళ్లి వేసవిని టార్గెట్ చేయాల్సి వస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వచ్చే సీజన్కు విపరీతమైన పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on April 9, 2020 6:30 pm
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…
నటసింహం బాలయ్య హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన అఖండ్-2 సినిమాలకు బాలారిష్టాలు తీరడం లేదు. ఈ నెల తొలి…