పోయినేడాది మార్చి నుంచి భారతీయ సినిమాకు కరోనా గ్రహణం పట్టుకుంది. దీన్నుంచి వేరే ఇండస్ట్రీలు కొంచెం కోలుకున్నాయి కానీ.. బాలీవుడ్ మాత్రం ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. గత డిసెంబర్లో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున:ప్రారంభయం అయ్యాక.. సంక్రాంతి నుంచి తెలుగు సినిమాలు బాగానే ఆడాయి. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో అనివార్య పరిస్థితుల్లో థియేటర్లు మూత పడ్డాయి.
మిగతా ఇండస్ట్రీలు కూడా గత కొన్ని నెలల్లో కొంతమేర పుంజుకుని ఇప్పుడు షట్ డౌన్ అవుతున్నాయి కానీ.. హిందీ సినిమాలు మాత్రం ఎప్పుడూ కుదురుకున్నది లేదు. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. హిందీ సినిమాలకు కేంద్ర స్థానం అయిన మహారాష్ట్ర కరోనాతో ఎలా అల్లాడిపోతోందో తెలిసిందే. సమీప భవిష్యత్తులో అక్కడ పరిస్థితులు మారతాయన్న ఆశ లేదు. అయినా సరే.. సల్మాన్ ఖాన్ నటించిన భారీ చిత్రం ‘రాధె’ను విడుదలకు సిద్ధం చేయడం విశేషం.
‘రాధె’ను రంజాన్ కానుకగా మే 13న విడుదల చేయనున్నట్లు ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ చిత్రాన్ని వాయిదా వేయడం అనివార్యం అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా మే 13నే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. గురువారం ట్రైలర్ కూడా లాంచ్ చేయబోతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో థియేటర్లలో సినిమా ఏమాత్రం ఆడుతుందో అన్న సందేహాలు అలాగే ఉన్నాయి. ఐతే ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది చిత్ర బృందం.
సినిమాను థియేటర్లతో పాటు నేరుగా టీవీల్లోనూ ఆడించనున్నారు. జీ ప్లెక్స్, జీ5లతో పాటు కొన్ని డీటీహెచ్ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో చూసే అవకాశం కల్పిస్తున్నారు. టికెట్ రేటు ఎంత అన్నది ఇంకా ప్రకటించలేదు. కానీ థియేటర్లకు బిగ్ స్క్రీన్ మీద సల్మాన్ను చూడాలనుకునే వాళ్లు అక్కడికి వెళ్లొచ్చు. లేదంటే ఇంటి పట్టునే ఉండి డబ్బులు కట్టి సినిమా చూడొచ్చన్నమాట. ఈ పద్ధతి సక్సెస్ అయితే మున్ముందు మరిన్ని బాలీవుడ్ సినిమాలు ఈ బాట పట్టొచ్చేమో.
This post was last modified on April 21, 2021 9:08 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…