Movie News

సల్మాన్ సినిమా.. ఒకేసారి థియేటర్లలో, టీవీల్లో

పోయినేడాది మార్చి నుంచి భారతీయ సినిమాకు కరోనా గ్రహణం పట్టుకుంది. దీన్నుంచి వేరే ఇండస్ట్రీలు కొంచెం కోలుకున్నాయి కానీ.. బాలీవుడ్ మాత్రం ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. గత డిసెంబర్లో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున:ప్రారంభయం అయ్యాక.. సంక్రాంతి నుంచి తెలుగు సినిమాలు బాగానే ఆడాయి. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో అనివార్య పరిస్థితుల్లో థియేటర్లు మూత పడ్డాయి.

మిగతా ఇండస్ట్రీలు కూడా గత కొన్ని నెలల్లో కొంతమేర పుంజుకుని ఇప్పుడు షట్ డౌన్ అవుతున్నాయి కానీ.. హిందీ సినిమాలు మాత్రం ఎప్పుడూ కుదురుకున్నది లేదు. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. హిందీ సినిమాలకు కేంద్ర స్థానం అయిన మహారాష్ట్ర కరోనాతో ఎలా అల్లాడిపోతోందో తెలిసిందే. సమీప భవిష్యత్తులో అక్కడ పరిస్థితులు మారతాయన్న ఆశ లేదు. అయినా సరే.. సల్మాన్ ఖాన్ నటించిన భారీ చిత్రం ‘రాధె’ను విడుదలకు సిద్ధం చేయడం విశేషం.

‘రాధె’ను రంజాన్ కానుకగా మే 13న విడుదల చేయనున్నట్లు ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ చిత్రాన్ని వాయిదా వేయడం అనివార్యం అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా మే 13నే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. గురువారం ట్రైలర్ కూడా లాంచ్ చేయబోతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో థియేటర్లలో సినిమా ఏమాత్రం ఆడుతుందో అన్న సందేహాలు అలాగే ఉన్నాయి. ఐతే ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది చిత్ర బృందం.

సినిమాను థియేటర్లతో పాటు నేరుగా టీవీల్లోనూ ఆడించనున్నారు. జీ ప్లెక్స్, జీ5లతో పాటు కొన్ని డీటీహెచ్‌ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో చూసే అవకాశం కల్పిస్తున్నారు. టికెట్ రేటు ఎంత అన్నది ఇంకా ప్రకటించలేదు. కానీ థియేటర్లకు బిగ్ స్క్రీన్ మీద సల్మాన్‌ను చూడాలనుకునే వాళ్లు అక్కడికి వెళ్లొచ్చు. లేదంటే ఇంటి పట్టునే ఉండి డబ్బులు కట్టి సినిమా చూడొచ్చన్నమాట. ఈ పద్ధతి సక్సెస్ అయితే మున్ముందు మరిన్ని బాలీవుడ్ సినిమాలు ఈ బాట పట్టొచ్చేమో.

This post was last modified on April 21, 2021 9:08 pm

Share
Show comments
Published by
Satya
Tags: Salman Khan

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

2 hours ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

3 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

4 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

4 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

5 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

6 hours ago