ల్లు అర్జున్ కెరీర్ ఎదుగుదలలో నిర్మాత దిల్ రాజు పాత్ర అత్యంత కీలకం. బన్నీ తొలి సినిమా ‘గంగోత్రి’ బాగా ఆడినా.. అతడికి అంత మంచి పేరేమీ రాలేదు. హీరోగా అతను నిలదొక్కుకుంటాడన్న నమ్మకాలేమీ కలగలేదు. అలాంటి సమయంలో బన్నీని, అలాగే కొత్త దర్శకుడైన సుకుమార్ను నమ్మి మంచి బడ్జెట్లో, రాజీ లేకుండా ‘ఆర్య’ సినిమాను నిర్మించాడు రాజు. ఆ సినిమాతో ఆ ఇద్దరి కెరీర్లు ఎలా మలుపు తిరిగాయో తెలిసిందే.
ఈ సినిమాతో నిర్మాతగా రాజు కెరీర్కు గొప్ప ప్రయోజనమే దక్కింది కానీ.. అప్పటికే రాజు నిలదొక్కకున్నాడు కాబట్టి ఆయనే బన్నీ, సుకుమార్లకు లైఫ్ ఇచ్చాడని చెప్పాలి. ఆ తర్వాత బన్నీతో.. పరుగు, దువ్వాడ జగన్నాథం లాంటి సినిమాలు తీశాడు రాజు. తన కెరీర్ ఎదుగుదల తాలూకు క్రెడిట్ను సుకుమార్కు ఎంత ఇస్తాడో రాజుకు కూడా అంతే ఇవ్వాలి బన్నీ. ఐతే ఈ మధ్య బన్నీ తనను ఇబ్బంది పెడుతుండటం పట్ల రాజు కొంత అసంతృప్తితో ఉన్నాడన్నది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
తన ప్రొడక్షన్లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమా చేయడానికి ఒప్పుకుని ఎంతకీ ఆ సినిమాకు డేట్లు ఇవ్వకపోవడం, ఏ విషయం తేల్చకపోవడం దిల్ రాజుకు నచ్చట్లేదని తెలుస్తోంది. ఎప్పుడు అడిగినా చూస్తా, చేస్తా అంటున్నాడే తప్ప ఏదీ కచ్చితంగా చెప్పట్లేదట బన్నీ. మొన్న ప్రెస్ మీట్లో భాగంగా త్వరలోనే తమ బేనర్లో ‘ఐకాన్’ సినిమా మొదలవుతుందని రాజు చెప్పగా.. ఆ తర్వాత కూడా బన్నీ నుంచి స్పందన లేదట.
తనకు కథ నచ్చకపోయినా, లేక డేట్ల సమస్య ఉన్నా ఆ విషయం చెప్పాలి కానీ, ఇలా ఏదీ తేల్చకపోవడం ఏంటి అన్నది రాజు ప్రశ్న. ఈ నేపథ్యంలోనే తనకు నచ్చిన కథను బన్నీతో కాకపోయినా వేరే హీరోతో అయినా చేసేద్దామని రాజు నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. బన్నీ పట్ల రాజు అసంతృప్తితో ఉన్నాడనడానికి.. ‘ఐకాన్ స్టార్’ కామెంట్ కూడా ఒక నిదర్శనం. బన్నీకి ఈ టైటిల్ ఇచ్చింది మీరే కదా అని విలేకరులు అంటే.. ‘‘అది ఆయనే పెట్టుకున్నాడు’’ అంటూ రాజు ఒకింత వ్యంగ్యంగానే వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on April 21, 2021 1:38 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…