ఈపాటికి మామూలుగా అయితే ‘లవ్ స్టోరి’ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉండాలి. ఈ సినిమా థియేటర్లలోకి దిగి ఐదు రోజులు అవుతుండాలి. అలాగే ఇంకో మూడు రోజుల్లో ‘టక్ జగదీష్’ విడుదలకు ముస్తాబవుతుండాలి. దాని గురించి కూడా తెలుగు ప్రేక్షకులు చర్చించుకుంటూ ఉండాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ ఆ ప్రణాళికలన్నింటినీ దెబ్బ తీసేసింది. ‘లవ్ స్టోరి’తో పాటు ‘టక్ జగదీష్’ చిత్రాలను వాయిదా వేయించింది. నెలాఖర్లో రావాల్సిన ‘విరాట పర్వం’ సైతం వాయిదా పడక తప్పలేదు.
ఈ చిత్రాలు ఇలా వాయిదా పడ్డాయో లేదో.. ఇదే మంచి ఛాన్స్ అంటూ కొన్ని చిన్న సినిమాలు రేసులోకి వచ్చేశాయి. హడావుడిగా వాటి రిలీజ్ డేట్లు ప్రకటించేశారు. మామూలుగా వేసవిలో చిన్న సినిమాలకు రిలీజయ్యే అవకాశమే ఉండదు. పెద్ద సినిమాలే ఈ సీజన్ను ఫుల్లుగా వాడేసుకుంటాయి. చిన్న చిత్రాలను వీలైనంత వరకు ఫిబ్రవరి-మార్చి నెలల్లోనే రిలీజ్ చేసేస్తుంటారు. లేదంటే వేసవి అయ్యాక చూసుకుంటారు.
కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు పేరున్న సినిమాలు వాయిదా పడటంతో ఆర్జీవీ ‘దెయ్యం’తో పాటు ‘99 సాంగ్స్’, ‘ఇష్క్’, ‘ఏక్ మినీ కథ’, ‘థ్యాంక్ యు బ్రదర్’ లాంటి చిత్రాలు విడుదలకు ముస్తాబైపోయాయి. వీటిలో తొలి రెండు సినిమాలు రిలీజైన సంగతి కూడా తెలియదు. వాటికి అస్సలు బజ్ లేని మాట కూడా వాస్తవం. ఇక హడావుడిగా రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసిన ఇష్క్, ఏక్ మిని కథ, థ్యాంక్ యు బ్రదర్ సినిమాల పరిస్థితి ఏమవుతుందో చూడాలి. ఈ మూడు చిత్రాల ప్రోమోలైతే ఆసక్తికరంగానే అనిపించాయి. వేరే సమయాల్లో వీటికి మంచి టాక్ వస్తే బాగా ఆడునేమో. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి జనాల మూడ్ మారిపోయింది. మళ్లీ ఒకప్పటి కరోనా భయం కనిపిస్తోంది.
థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే పరిస్థితుల్లో కనిపించట్లేదు. పైగా ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడం, నైట్ కర్ఫ్యూ లాంటి షరతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లు వెలవెలబోతాయేమో అనిపిస్తోంది. సమ్మర్లో మంచి డేట్లు దొరికాయన్న చిన్న సినిమాల సంబరం ఏమో కానీ.. అనవసరంగా తమ సినిమాలను రిలీజ్ చేశాం అని వీటి మేకర్స్ చింతించాల్సి వస్తుందేమో అనిపిస్తోంది.
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…