Movie News

మన‌సు దోచేసిన స‌మంత‌

సినిమాలు చేసినా చేయ‌క‌పోయినా స‌మంత ఎప్పుడూ వార్త‌ల్లో వ్య‌క్తే. మునుప‌టితో పోలిస్తే ఆమె సినిమాలు త‌గ్గించేసినా సోష‌ల్ మీడియాలో ఆమె పేరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. కెరీర్లో కొంచెం పేరు సంపాదించిన‌ప్ప‌టి నుంచి సేవా కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎంతోమందికి తోడ్పాటు అందించిన సామ్.. ఇప్పుడు మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సును చాటుకుంది. సోష‌ల్ మీడియాలో ఆమెపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళ్తే..

అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఒక ప్రైవేటు కార్య‌క్ర‌మంలో భాగంగా సంగారెడ్డికి చెందిన క‌విత అనే మ‌హిళ గురించి స‌మంత తెలుసుకుంది. ఈ అమ్మాయికి త‌ల్లిదండ్రులు బాల్య వివాహం చేశారు. అయితే భర్త రోజు తాగొచ్చి కొట్టడంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. తన వల్ల కుటుంబానికి భారం కాకూడదని భావించి మొద‌ట ఆమె వ్య‌వ‌సాయం చేసింది. ఆమెకు ఏడుగురు తోబుట్టువులున్నారు. వాళ్లంద‌రినీ త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి పోషిస్తుండ‌గా.. త‌ల్లి, తండ్రి ఒక‌రి త‌ర్వాత ఒక‌రు చ‌నిపోయారు.

ఈ ప‌రిస్థితుల్లో వ్య‌వ‌సాయం చేయ‌డం క‌ష్ట‌మై, కుటుంబాన్ని న‌డ‌ప‌డానికి ఆటో న‌డ‌ప‌డం మొద‌లుపెట్టింది క‌విత‌. మియాపూర్ నుంచి బాచూపల్లి వరకు ఆటోను నడుపుతూ ఆమె కుటుంబానికి అండగా నిలిచింది. ఓ ప్రోగ్రాం ద్వారా క‌విత గురించి తెలుసుకున్న స‌మంత‌.. ఆమెకు ఏదైనా సహాయం చేయాలని భావించింది. రూ.12.50 ల‌క్ష‌ల ఖ‌రీరైన స్విఫ్ట్ కారును కొని క‌వితకు అంద‌జేసింది. దీంతో క‌విత ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. సోష‌ల్ మీడియాలో ఈ వార్త బ‌య‌టికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి స‌మంత‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

This post was last modified on April 18, 2021 7:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago