సినిమాలు చేసినా చేయకపోయినా సమంత ఎప్పుడూ వార్తల్లో వ్యక్తే. మునుపటితో పోలిస్తే ఆమె సినిమాలు తగ్గించేసినా సోషల్ మీడియాలో ఆమె పేరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. కెరీర్లో కొంచెం పేరు సంపాదించినప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎంతోమందికి తోడ్పాటు అందించిన సామ్.. ఇప్పుడు మరోసారి తన పెద్ద మనసును చాటుకుంది. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డికి చెందిన కవిత అనే మహిళ గురించి సమంత తెలుసుకుంది. ఈ అమ్మాయికి తల్లిదండ్రులు బాల్య వివాహం చేశారు. అయితే భర్త రోజు తాగొచ్చి కొట్టడంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. తన వల్ల కుటుంబానికి భారం కాకూడదని భావించి మొదట ఆమె వ్యవసాయం చేసింది. ఆమెకు ఏడుగురు తోబుట్టువులున్నారు. వాళ్లందరినీ తల్లిదండ్రులతో కలిసి పోషిస్తుండగా.. తల్లి, తండ్రి ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు.
ఈ పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం కష్టమై, కుటుంబాన్ని నడపడానికి ఆటో నడపడం మొదలుపెట్టింది కవిత. మియాపూర్ నుంచి బాచూపల్లి వరకు ఆటోను నడుపుతూ ఆమె కుటుంబానికి అండగా నిలిచింది. ఓ ప్రోగ్రాం ద్వారా కవిత గురించి తెలుసుకున్న సమంత.. ఆమెకు ఏదైనా సహాయం చేయాలని భావించింది. రూ.12.50 లక్షల ఖరీరైన స్విఫ్ట్ కారును కొని కవితకు అందజేసింది. దీంతో కవిత ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి సమంతపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
This post was last modified on April 18, 2021 7:03 am
టాలీవుడ్ లో చాలా మీడియం రేంజ్ సినిమాల ఓటిటి డీల్స్ డోలాయమానంలో ఉన్నాయి. ప్రాజెక్టు మొదలుపెట్టిన టైంలో ఏవేవో ఊహించుకున్న…
మే 1వ తేదీకి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడం.. ఇంటింటికీ వెళ్లి ఇచ్చే పింఛన్ల వ్యవహారం నిలిచిపోవడం…
ఆదివారం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు పెద్ద సర్ప్రైజే ఇచ్చింది. మా ఇంటి బంగారం…
ఎంత స్టార్ సపోర్ట్ ఉన్నా సినిమాలో దమ్ము లేకపోతే ఏం చేయలేమని బాక్సాఫీస్ ఎన్నోసార్లు రుజువు చేసింది. తాజాగా మరో…
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. మేనిఫెస్టో ప్రకటించారు. ఆ వెంటనే ఆయన జిల్లాల పర్యటనలు కూడా చేస్తున్నారు. ఆదివా…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందానే…