కరోనా విరామం తర్వాత తెలుగులో అతి పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ‘జాతిరత్నాలు’ ఒకటి. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి కామెడీ స్టార్లు నటించిన సినిమా రూ.35 కోట్ల దాకా షేర్ రాబట్టడం అనూహ్యమే. చూడ్డానికి ఇది మామూలుగా సినిమానే. కథా కథనాల్లో పెద్దగా లాజిక్ ఉండదు. చాలా సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. ఐతేనేం ప్రేక్షకులకు ఆ సిల్లీనెస్లో ఉన్న ఫన్ బాగా నచ్చింది. సినిమా ఇరగాడేసింది. రెండు మూడు వారాల పాటు ప్యాక్డ్ హౌస్లతో నడిచింది ‘జాతిరత్నాలు’. ఇప్పుడీ సినిమాను అమేజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయగా.. థియేటర్లలో చూడని వాళ్లందరూ ఓ లుక్కేస్తున్నారు.
ఐతే థియేటర్లలో రిలీజైనపుడు వచ్చిన టాక్ చూసి భారీ అంచనాలతో చూసిన కొందరు.. ఓటీటీలో సినిమా చూసి కొంత పెదవి విరుస్తున్న మాట వాస్తవమే. అదే సమయంలో ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తూ దానిపై ప్రశంసలు కురిపిస్తున్న వాళ్లూ ఉన్నారు.
‘జాతిరత్నాలు’ చూసి ఫిదా అయిపోయిన టీమ్ ఇండియా క్రికెటర్ ఒకరు సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టడం విశేషం. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. తమిళనాడుకు చెందిన దినేశ్ కార్తీక్. జాతిరత్నాలు సినిమా కడుపు చెక్కలయ్యేలా నవ్వించిందని.. ప్రతి సన్నివేశంలోనూ తాను నవ్వుతూనే ఉన్నానని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. డైలాగులు అదిరిపోయాయని.. డైరెక్షన్ అద్భుతమని.. నటీనటులు ప్రతి ఒక్కరూ బాగా చేశారని దినేశ్ కితాబిచ్చాడు. కామెడీ జానర్ అన్నింటికంటే కష్టమైందని.. కానీ దాన్ని ‘జాతిరత్నాలు’ అద్భుతంగా పండించిందని కార్తీక్ అన్నాడు. చివరగా ‘ఔట్ స్టాండింగ్’ అనే కామెంట్తో తన ట్వీట్ రివ్యూను ముగించాడు కార్తీక్.
డైలాగ్స్, నేటివిటీ మీద ఆధారపడ్డ ఓ తెలుగు సినిమా ఓ తమిళ క్రికెటర్కు మన సినిమా ఇంతగా నచ్చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఐతే కార్తీక్కు తెలుగు బాగానే వచ్చన్నది సన్నిహితుల మాట. గత ఐపీఎల్ సీజన్లో ఓ మ్యాచ్ సందర్భంగా తెలుగు అంపైర్ సంషుద్దీన్తో తెలుగులోనే అతను మాట్లాడటం గమనార్హం.
This post was last modified on April 16, 2021 8:03 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…