రెండు నెలల కిందట ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమేజాన్ ప్రైమ్లో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై అదిరిపోయే టాక్ తెచ్చుకుంది మలయాళ సినిమా ‘దృశ్యం-2’. ఆరేళ్ల కిందట వచ్చిన ‘దృశ్యం’కు ఇది సీక్వెల్. ఈ సినిమా మొదలైనపుడు ‘దృశ్యం’ క్రేజ్ను క్యాష్ చేసుకునే ప్రయత్నం లాగానే కనిపించింది చాలామందికి. ఎందుకంటే ‘దృశ్యం’ విడుదలైన ఆరేళ్ల తర్వాత సీక్వెల్ అనడం.. రెండు నెలల్లో సినిమాను పూర్తి చేసేయడం.. థియేటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఓటీటీలో రిలీజ్ చేయడంతో ఈ సినిమా మీద ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేకపోయాయి.
కానీ పెద్ద హైప్ లేకుండా రిలీజైన ఈ సినిమా చూసి.. జనాలు ఆశ్చర్యపోయారు. ద్వితీయార్ధంలో ట్విస్టులకు షాకైపోయారు. తొలి భాగానికి ఏమాత్రం తగ్గని విధంగా థ్రిల్ ఇవ్వడంతో చూసిన వాళ్లందరూ ఈ సినిమాను ఆకాశానికెత్తేశారు. మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయి సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది.
ఐతే మలయాళ వెర్షన్ చూసిన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను తెలుగులో కూడా తీసి ఉంటే బాగుండేదే అనిపించింది. ఆల్రెడీ మలయాళ వెర్షన్ ఓటీటీలో ఉన్న నేపథ్యంలో తెలుగులో ఈ సినిమా తీయరేమో అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఒరిజినల్ డైరెక్టర్ జీతు జోసెఫ్.. మన వెంకీతో కలిసి ‘దృశ్యం-2’ను రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు. సురేష్ ప్రొడక్షన్స్ రంగంలోకి దిగడంతో శరవేగంగా ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. స్క్రిప్టుపై మంచి పట్టు ఉండటంతో షూటింగ్లోనూ ఆలస్యం చేయలేదు జీతు.
మలయాళ వెర్షన్ కంటే తక్కువ వ్యవధిలో, కేవలం నెల రోజుల్లో ‘దృశ్యం-2’ తెలుగు వెర్షన్ పూర్తయిపోవడం విశేషం. సినిమాను ముగించిన సందర్భంగా ప్రధాన తారాగణం అయిన మీనా, కృతిక జయకుమార్, ఎస్తేర్ అనిల్.. దర్శకుడు జీతు జోసెఫ్తో కలిసి ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు వెంకీ. ఎంత రీమేక్ అయితే మాత్రం ఇంత స్పీడుగా సినిమా అయిపోయిందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. వెంకీ కెరీర్లోనే అతి తక్కువ రోజుల్లో పూర్తయిన సినిమాగా ‘దృశ్యం-2’ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం.
This post was last modified on April 15, 2021 4:09 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…