రెండు నెలల కిందట ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమేజాన్ ప్రైమ్లో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై అదిరిపోయే టాక్ తెచ్చుకుంది మలయాళ సినిమా ‘దృశ్యం-2’. ఆరేళ్ల కిందట వచ్చిన ‘దృశ్యం’కు ఇది సీక్వెల్. ఈ సినిమా మొదలైనపుడు ‘దృశ్యం’ క్రేజ్ను క్యాష్ చేసుకునే ప్రయత్నం లాగానే కనిపించింది చాలామందికి. ఎందుకంటే ‘దృశ్యం’ విడుదలైన ఆరేళ్ల తర్వాత సీక్వెల్ అనడం.. రెండు నెలల్లో సినిమాను పూర్తి చేసేయడం.. థియేటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఓటీటీలో రిలీజ్ చేయడంతో ఈ సినిమా మీద ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేకపోయాయి.
కానీ పెద్ద హైప్ లేకుండా రిలీజైన ఈ సినిమా చూసి.. జనాలు ఆశ్చర్యపోయారు. ద్వితీయార్ధంలో ట్విస్టులకు షాకైపోయారు. తొలి భాగానికి ఏమాత్రం తగ్గని విధంగా థ్రిల్ ఇవ్వడంతో చూసిన వాళ్లందరూ ఈ సినిమాను ఆకాశానికెత్తేశారు. మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయి సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది.
ఐతే మలయాళ వెర్షన్ చూసిన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను తెలుగులో కూడా తీసి ఉంటే బాగుండేదే అనిపించింది. ఆల్రెడీ మలయాళ వెర్షన్ ఓటీటీలో ఉన్న నేపథ్యంలో తెలుగులో ఈ సినిమా తీయరేమో అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఒరిజినల్ డైరెక్టర్ జీతు జోసెఫ్.. మన వెంకీతో కలిసి ‘దృశ్యం-2’ను రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు. సురేష్ ప్రొడక్షన్స్ రంగంలోకి దిగడంతో శరవేగంగా ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. స్క్రిప్టుపై మంచి పట్టు ఉండటంతో షూటింగ్లోనూ ఆలస్యం చేయలేదు జీతు.
మలయాళ వెర్షన్ కంటే తక్కువ వ్యవధిలో, కేవలం నెల రోజుల్లో ‘దృశ్యం-2’ తెలుగు వెర్షన్ పూర్తయిపోవడం విశేషం. సినిమాను ముగించిన సందర్భంగా ప్రధాన తారాగణం అయిన మీనా, కృతిక జయకుమార్, ఎస్తేర్ అనిల్.. దర్శకుడు జీతు జోసెఫ్తో కలిసి ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు వెంకీ. ఎంత రీమేక్ అయితే మాత్రం ఇంత స్పీడుగా సినిమా అయిపోయిందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. వెంకీ కెరీర్లోనే అతి తక్కువ రోజుల్లో పూర్తయిన సినిమాగా ‘దృశ్యం-2’ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం.
This post was last modified on April 15, 2021 4:09 pm
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…