టాలీవుడ్లోనే కాదు.. మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే కరోనా విరామం తర్వాత వచ్చిన అత్యంత భారీ చిత్రాల్లో వకీల్ సాబ్ ఒకటి. లాక్ డౌన్ తర్వాత తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమా మాస్టర్ మినహాయిస్తే ఏ పెద్ద హీరో సినిమా ఇండియాలో రిలీజ్ కాలేదు. ఆ సినిమా డివైడ్ టాక్ను కూడా తట్టుకుని మంచి వసూళ్లే సాధించింది. ప్రేక్షకులు మంచి ఆకలితో ఉన్నపుడు విడుదల కావడం ఆ చిత్రానికి కలిసొచ్చింది.
తెలుగులో ఆ స్థాయి భారీ చిత్రం లాక్ డౌన్ తర్వాత రిలీజ్ కాలేదు. ఇప్పుడు వకీల్ సాబ్ ఆ లోటును తీర్చింది. పైగా పవన్ కళ్యాణ్కు ఇది రీఎంట్రీ మూవీ కూడా కావడంతో సినిమాపై ఆసక్తి, అంచనాలు మరింత పెరిగాయి. గత శుక్రవారం మంచి హైప్ మధ్య రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వచ్చాయి. ఐతే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమాకు లాంగ్ రన్ ఉంటుందా అని సందేహించారు.
కానీ తొలి వారాంతంలో ఫ్యాన్స్ వకీల్ సాబ్ సినిమాను మోస్తే.. ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ తమ చేతుల్లోకి తీసుకున్నట్లే కనిపిస్తోంది. కేవలం అభిమానుల హంగామాతో సినిమాలు నడిచిపోవు. వాళ్ల సందడంతే వీకెండ్కే పరిమితం. ఆ తర్వాత సినిమా నడవాలంటే ఫ్యామిలీస్ చూడాలి. వకీల్ సాబ్కు ఈ విషయంలో ఢోకా లేకపోయింది. మహిళల సమస్యలు, వారి మనోభావాల నేపథ్యంలో అర్థవంతమైన చర్చ జరిగిన సినిమా ఇది. దీంతో లేడీ ఆడియన్స్, అలాగే ఫ్యామిలీస్కు ఈ సినిమా నచ్చుతోంది. మౌత్ టాక్ బాగానే స్ప్రెడ్ అవుతుండటంతో కుటుంబ ప్రేక్షకులు పెద్ద ఎత్తున సినిమాకు వస్తున్నారు.
ఉగాది రోజు ఈ ట్రెండ్ బాగా కనిపించిందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. థియేటర్ల ముందు జనాల హంగామాకు సంబంధించి అభిమానులు షేర్ చేస్తున్న ఫొటోల్లో లేడీస్, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనిపిస్తున్నారు. కుటుంబ ప్రేక్షకుల్లోకి వెళ్లిన నేపథ్యంలో ఈ వారమంతా వకీల్ సాబ్కు ఢోకా లేనట్లే.
This post was last modified on April 14, 2021 12:16 pm
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…