టాలీవుడ్లోనే కాదు.. మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే కరోనా విరామం తర్వాత వచ్చిన అత్యంత భారీ చిత్రాల్లో వకీల్ సాబ్ ఒకటి. లాక్ డౌన్ తర్వాత తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమా మాస్టర్ మినహాయిస్తే ఏ పెద్ద హీరో సినిమా ఇండియాలో రిలీజ్ కాలేదు. ఆ సినిమా డివైడ్ టాక్ను కూడా తట్టుకుని మంచి వసూళ్లే సాధించింది. ప్రేక్షకులు మంచి ఆకలితో ఉన్నపుడు విడుదల కావడం ఆ చిత్రానికి కలిసొచ్చింది.
తెలుగులో ఆ స్థాయి భారీ చిత్రం లాక్ డౌన్ తర్వాత రిలీజ్ కాలేదు. ఇప్పుడు వకీల్ సాబ్ ఆ లోటును తీర్చింది. పైగా పవన్ కళ్యాణ్కు ఇది రీఎంట్రీ మూవీ కూడా కావడంతో సినిమాపై ఆసక్తి, అంచనాలు మరింత పెరిగాయి. గత శుక్రవారం మంచి హైప్ మధ్య రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వచ్చాయి. ఐతే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమాకు లాంగ్ రన్ ఉంటుందా అని సందేహించారు.
కానీ తొలి వారాంతంలో ఫ్యాన్స్ వకీల్ సాబ్ సినిమాను మోస్తే.. ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ తమ చేతుల్లోకి తీసుకున్నట్లే కనిపిస్తోంది. కేవలం అభిమానుల హంగామాతో సినిమాలు నడిచిపోవు. వాళ్ల సందడంతే వీకెండ్కే పరిమితం. ఆ తర్వాత సినిమా నడవాలంటే ఫ్యామిలీస్ చూడాలి. వకీల్ సాబ్కు ఈ విషయంలో ఢోకా లేకపోయింది. మహిళల సమస్యలు, వారి మనోభావాల నేపథ్యంలో అర్థవంతమైన చర్చ జరిగిన సినిమా ఇది. దీంతో లేడీ ఆడియన్స్, అలాగే ఫ్యామిలీస్కు ఈ సినిమా నచ్చుతోంది. మౌత్ టాక్ బాగానే స్ప్రెడ్ అవుతుండటంతో కుటుంబ ప్రేక్షకులు పెద్ద ఎత్తున సినిమాకు వస్తున్నారు.
ఉగాది రోజు ఈ ట్రెండ్ బాగా కనిపించిందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. థియేటర్ల ముందు జనాల హంగామాకు సంబంధించి అభిమానులు షేర్ చేస్తున్న ఫొటోల్లో లేడీస్, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనిపిస్తున్నారు. కుటుంబ ప్రేక్షకుల్లోకి వెళ్లిన నేపథ్యంలో ఈ వారమంతా వకీల్ సాబ్కు ఢోకా లేనట్లే.
This post was last modified on April 14, 2021 12:16 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…