టాలీవుడ్లోనే కాదు.. మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే కరోనా విరామం తర్వాత వచ్చిన అత్యంత భారీ చిత్రాల్లో వకీల్ సాబ్ ఒకటి. లాక్ డౌన్ తర్వాత తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమా మాస్టర్ మినహాయిస్తే ఏ పెద్ద హీరో సినిమా ఇండియాలో రిలీజ్ కాలేదు. ఆ సినిమా డివైడ్ టాక్ను కూడా తట్టుకుని మంచి వసూళ్లే సాధించింది. ప్రేక్షకులు మంచి ఆకలితో ఉన్నపుడు విడుదల కావడం ఆ చిత్రానికి కలిసొచ్చింది.
తెలుగులో ఆ స్థాయి భారీ చిత్రం లాక్ డౌన్ తర్వాత రిలీజ్ కాలేదు. ఇప్పుడు వకీల్ సాబ్ ఆ లోటును తీర్చింది. పైగా పవన్ కళ్యాణ్కు ఇది రీఎంట్రీ మూవీ కూడా కావడంతో సినిమాపై ఆసక్తి, అంచనాలు మరింత పెరిగాయి. గత శుక్రవారం మంచి హైప్ మధ్య రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వచ్చాయి. ఐతే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమాకు లాంగ్ రన్ ఉంటుందా అని సందేహించారు.
కానీ తొలి వారాంతంలో ఫ్యాన్స్ వకీల్ సాబ్ సినిమాను మోస్తే.. ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ తమ చేతుల్లోకి తీసుకున్నట్లే కనిపిస్తోంది. కేవలం అభిమానుల హంగామాతో సినిమాలు నడిచిపోవు. వాళ్ల సందడంతే వీకెండ్కే పరిమితం. ఆ తర్వాత సినిమా నడవాలంటే ఫ్యామిలీస్ చూడాలి. వకీల్ సాబ్కు ఈ విషయంలో ఢోకా లేకపోయింది. మహిళల సమస్యలు, వారి మనోభావాల నేపథ్యంలో అర్థవంతమైన చర్చ జరిగిన సినిమా ఇది. దీంతో లేడీ ఆడియన్స్, అలాగే ఫ్యామిలీస్కు ఈ సినిమా నచ్చుతోంది. మౌత్ టాక్ బాగానే స్ప్రెడ్ అవుతుండటంతో కుటుంబ ప్రేక్షకులు పెద్ద ఎత్తున సినిమాకు వస్తున్నారు.
ఉగాది రోజు ఈ ట్రెండ్ బాగా కనిపించిందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. థియేటర్ల ముందు జనాల హంగామాకు సంబంధించి అభిమానులు షేర్ చేస్తున్న ఫొటోల్లో లేడీస్, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనిపిస్తున్నారు. కుటుంబ ప్రేక్షకుల్లోకి వెళ్లిన నేపథ్యంలో ఈ వారమంతా వకీల్ సాబ్కు ఢోకా లేనట్లే.
This post was last modified on April 14, 2021 12:16 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…