పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా ఎలాంటిదో మరోసారి రుజువైంది. మూడేళ్లకు పైగా విరామం తీసుకుని, లేడీ ఓరియెంటెడ్ సినిమా రీమేక్తో ఆయన రీఎంట్రీ ఇచ్చినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ‘వకీల్ సాబ్’ అంచనాల్ని మించి వసూళ్లు రాబడుతోంది.
ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ మూవీ అవడం, పైగా రీమేక్ కావడం ప్రతికూల విషయాలే. పైగా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉంది. ఏపీలో చూస్తే టికెట్ల రేట్లపై నియంత్రణ కొనసాగుతోంది. ఇన్ని ప్రతికూలతల్లోనూ ‘వకీల్ సాబ్’ జోరు సాగుతుండటం విశేషం. తొలి వారాంతంలోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.50 కోట్లకు పైగా షేర్ సాధించడం విశేషం. కరెక్ట్ ఫిగర్స్ రావడానికి టైం పట్టేలా ఉంది కానీ.. రూ.50 కోట్ల షేర్ మార్కును అయితే ఈ చిత్రం దాటేసిందన్నది స్పష్టం. గ్రాస్ రూ.75-80 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే గ్రాస్ రూ.100 కోట్లు దాటబోతోంది.
ఇక షేర్ రూ.100 కోట్ల మార్కును అందుకోవడం కూడా సాధ్యమే అనిపిస్తోంది. ఎందుకంటే మంగళవారం ఉగాది సెలవు కలిసొస్తోంది. ఇక వచ్చే రెండు వారాలకు కొత్త సినిమాలేవీ విడుదలయ్యే సూచనలు లేవు. లవ్ స్టోరి, టక్ జగదీష్ వాయిదా పడిపోయాయి. ఇంకే పేరున్న సినిమా రిలీజయ్యేలా లేదు. వచ్చే రెండు వారాలు థియేటర్లను బతికించాల్సింది ఈ సినిమానే.
కొన్ని థియేటర్లు తగ్గినా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో ఈ సినిమా కొనసాగబోతోంది. ప్రేక్షకులకు వేరే ఛాయిస్ కనిపిస్తే పాత సినిమాను పక్కన పెట్టేస్తారు కానీ.. అలా లేనపుడు ముందు వారంలో వచ్చిన సినిమా చూసుకోవాల్సిందే. ఫ్యామిలీస్, లేడీస్ను ఆకర్షించే సినిమా కావడం ‘వకీల్ సాబ్’కు కలిసొచ్చే అంశం. ఒకవేళ 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం అమల్లో పెట్టినా అది పెద్ద ఇబ్బంది కాదు. మాగ్జిమం థియేటర్లలో ఈ సినిమా ఆడుతుంది కాబట్టి ఫుల్ రన్లో రూ.100 కోట్ల షేర్ క్లబ్బులో చేరిన తొలి పవన్ కళ్యాణ్ సినిమాగా ‘వకీల్ సాబ్’ నిలిచే అవకాశాలున్నాయి.
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…