పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా ఎలాంటిదో మరోసారి రుజువైంది. మూడేళ్లకు పైగా విరామం తీసుకుని, లేడీ ఓరియెంటెడ్ సినిమా రీమేక్తో ఆయన రీఎంట్రీ ఇచ్చినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ‘వకీల్ సాబ్’ అంచనాల్ని మించి వసూళ్లు రాబడుతోంది.
ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ మూవీ అవడం, పైగా రీమేక్ కావడం ప్రతికూల విషయాలే. పైగా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉంది. ఏపీలో చూస్తే టికెట్ల రేట్లపై నియంత్రణ కొనసాగుతోంది. ఇన్ని ప్రతికూలతల్లోనూ ‘వకీల్ సాబ్’ జోరు సాగుతుండటం విశేషం. తొలి వారాంతంలోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.50 కోట్లకు పైగా షేర్ సాధించడం విశేషం. కరెక్ట్ ఫిగర్స్ రావడానికి టైం పట్టేలా ఉంది కానీ.. రూ.50 కోట్ల షేర్ మార్కును అయితే ఈ చిత్రం దాటేసిందన్నది స్పష్టం. గ్రాస్ రూ.75-80 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే గ్రాస్ రూ.100 కోట్లు దాటబోతోంది.
ఇక షేర్ రూ.100 కోట్ల మార్కును అందుకోవడం కూడా సాధ్యమే అనిపిస్తోంది. ఎందుకంటే మంగళవారం ఉగాది సెలవు కలిసొస్తోంది. ఇక వచ్చే రెండు వారాలకు కొత్త సినిమాలేవీ విడుదలయ్యే సూచనలు లేవు. లవ్ స్టోరి, టక్ జగదీష్ వాయిదా పడిపోయాయి. ఇంకే పేరున్న సినిమా రిలీజయ్యేలా లేదు. వచ్చే రెండు వారాలు థియేటర్లను బతికించాల్సింది ఈ సినిమానే.
కొన్ని థియేటర్లు తగ్గినా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో ఈ సినిమా కొనసాగబోతోంది. ప్రేక్షకులకు వేరే ఛాయిస్ కనిపిస్తే పాత సినిమాను పక్కన పెట్టేస్తారు కానీ.. అలా లేనపుడు ముందు వారంలో వచ్చిన సినిమా చూసుకోవాల్సిందే. ఫ్యామిలీస్, లేడీస్ను ఆకర్షించే సినిమా కావడం ‘వకీల్ సాబ్’కు కలిసొచ్చే అంశం. ఒకవేళ 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం అమల్లో పెట్టినా అది పెద్ద ఇబ్బంది కాదు. మాగ్జిమం థియేటర్లలో ఈ సినిమా ఆడుతుంది కాబట్టి ఫుల్ రన్లో రూ.100 కోట్ల షేర్ క్లబ్బులో చేరిన తొలి పవన్ కళ్యాణ్ సినిమాగా ‘వకీల్ సాబ్’ నిలిచే అవకాశాలున్నాయి.
This post was last modified on April 12, 2021 10:23 pm
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…