పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా ఎలాంటిదో మరోసారి రుజువైంది. మూడేళ్లకు పైగా విరామం తీసుకుని, లేడీ ఓరియెంటెడ్ సినిమా రీమేక్తో ఆయన రీఎంట్రీ ఇచ్చినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ‘వకీల్ సాబ్’ అంచనాల్ని మించి వసూళ్లు రాబడుతోంది.
ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ మూవీ అవడం, పైగా రీమేక్ కావడం ప్రతికూల విషయాలే. పైగా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉంది. ఏపీలో చూస్తే టికెట్ల రేట్లపై నియంత్రణ కొనసాగుతోంది. ఇన్ని ప్రతికూలతల్లోనూ ‘వకీల్ సాబ్’ జోరు సాగుతుండటం విశేషం. తొలి వారాంతంలోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.50 కోట్లకు పైగా షేర్ సాధించడం విశేషం. కరెక్ట్ ఫిగర్స్ రావడానికి టైం పట్టేలా ఉంది కానీ.. రూ.50 కోట్ల షేర్ మార్కును అయితే ఈ చిత్రం దాటేసిందన్నది స్పష్టం. గ్రాస్ రూ.75-80 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే గ్రాస్ రూ.100 కోట్లు దాటబోతోంది.
ఇక షేర్ రూ.100 కోట్ల మార్కును అందుకోవడం కూడా సాధ్యమే అనిపిస్తోంది. ఎందుకంటే మంగళవారం ఉగాది సెలవు కలిసొస్తోంది. ఇక వచ్చే రెండు వారాలకు కొత్త సినిమాలేవీ విడుదలయ్యే సూచనలు లేవు. లవ్ స్టోరి, టక్ జగదీష్ వాయిదా పడిపోయాయి. ఇంకే పేరున్న సినిమా రిలీజయ్యేలా లేదు. వచ్చే రెండు వారాలు థియేటర్లను బతికించాల్సింది ఈ సినిమానే.
కొన్ని థియేటర్లు తగ్గినా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో ఈ సినిమా కొనసాగబోతోంది. ప్రేక్షకులకు వేరే ఛాయిస్ కనిపిస్తే పాత సినిమాను పక్కన పెట్టేస్తారు కానీ.. అలా లేనపుడు ముందు వారంలో వచ్చిన సినిమా చూసుకోవాల్సిందే. ఫ్యామిలీస్, లేడీస్ను ఆకర్షించే సినిమా కావడం ‘వకీల్ సాబ్’కు కలిసొచ్చే అంశం. ఒకవేళ 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం అమల్లో పెట్టినా అది పెద్ద ఇబ్బంది కాదు. మాగ్జిమం థియేటర్లలో ఈ సినిమా ఆడుతుంది కాబట్టి ఫుల్ రన్లో రూ.100 కోట్ల షేర్ క్లబ్బులో చేరిన తొలి పవన్ కళ్యాణ్ సినిమాగా ‘వకీల్ సాబ్’ నిలిచే అవకాశాలున్నాయి.
This post was last modified on April 12, 2021 10:23 pm
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు…
ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం.…
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…