అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్కు అస్సలు కాలం కలిసి రావట్లేదు. హీరోగా అరంగేట్రం చేసి రెండు దశాబ్దాలు దాటినా అతను స్టార్గా ఎదగలేకపోయాడు. కొన్నేళ్లుగా పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి టైంలో ఓ విభిన్నమైన కథ మీద అతను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. షేర్ మార్కెట్లో భారీ స్కామ్ చేసి 90వ దశకంలో సంచలనాలకు తెర తీసిన హర్షద్ మెహతా కథతో తెరకెక్కిన బిగ్ బుల్ తన కెరీర్ను మలుపు తిప్పుతుందని ఆశించాడు. ఈ సినిమా కోసం అభిషేక్ చాలా కష్టపడ్డాడు. కానీ ఇదే కథతో వేరే వెబ్ సిరీస్ తెరకెక్కడం దీనికి ప్రతికూలమైంది. ‘స్కామ్ 1992’ పేరుతో హన్సల్ మెహతా.. హర్షద్ మెహతా కథను అద్భుత రీతిలో తెరకెక్కించాడు. కొన్ని నెలల కిందట పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఆ సిరీస్ సంచలనాలు రేపింది. ఇండియన్ వెబ్ సిరీస్ల చరిత్రలోనే ది బెస్ట్ అనిపించుకుంది.
ఆ సిరీస్ అంతటి ఆదరణ తెచ్చుకుంటుందని జూనియర్ బచ్చన్ అండ్ కో ఊహించలేదు. దానికి వచ్చిన స్పందన ‘బిగ్ బుల్’కు తలనొప్పిగా మారింది. సినిమా ఎఫ్పుడో రెడీ అయినా.. వెంటనే రిలీజ్ చేస్తే ‘స్కామ్ 1992’ ప్రభావం పడుతుందని ఆపారు. ఇలా ఆగి ఆగి ఈ నెల 8న హాట్ స్టార్లో రిలీజ్ చేశారు. కానీ స్కామ్ 1992తో పోల్చి చూసి ఈ సినిమా పట్ల పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు.
అసలు ఆల్రెడీ చూసిన కథే కదా అని బిగ్ బుల్ పట్ల ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తే కనిపించట్లేదు. ఇక చూసిన వాళ్లయితే ఈ సినిమా పట్ల ఏమాత్రం సానుకూలంగా స్పందించట్లేదు. స్కామ్ 1992 స్థాయిలో ఏమాత్రం లేదని.. దాంతో పోలిక పక్కన పెట్టినా బిగ్ బుల్ అంతగా ఆకట్టుకునే సినిమా కాదని అంటున్నారు. అభిషేక్ బాగానే చేసినా.. స్కామ్ 1992లో ప్రతీక్ గాంధీ ముందు తేలిపోయాడని, ఈ సినిమా వల్ల అతడికెలాంటి ప్రయోజనం లేదని అంటున్నారు. ఓటీటీలో రిలీజైనప్పటికీ అభిషేక్ కెరీర్లో దీన్ని మరో ఫ్లాప్గానే పేర్కొంటున్నారు.
This post was last modified on April 12, 2021 8:17 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…