బాలీవుడ్ నటి దియా మీర్జా తల్లి కాబోతున్న విషయం ఇటీవలే వెల్లడైన సంగతి తెలిసిందే. తాను గర్భంతో ఉన్న ఫొటోను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఐతే ఆమె బేబీ బంప్ చూస్తే నాలుగైదు నెలల గర్భంతో ఉన్నట్లు అనిపించింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో దియా పెళ్లి జరిగింది ఫిబ్రవరిలోనే. ఇంతలోనే నాలుగైదు నెలల గర్భంతో ఆమె కనిపించడంతో పెళ్లికి ముందే గర్భవతి అయిందని అర్థమైంది.
ప్రెగ్నెన్సీ రావడం వల్లే ఆమె హడావుడిగా, మరీ సింపుల్గా పెళ్లి చేసుకుందనే అభిప్రాయం జనాల్లో కలిగింది. ఐతే ఒక నెటిజన్ తాజాగా దీని గురించి దియాను సోషల్ మీడియాిలో ప్రశ్నించారు. ఆధునిక మహిళ అయిన దియా.. పెళ్లికి ముందే తాను గర్భవతిని అని ఎందుకు ప్రకటించలేకపోయిందని.. పెళ్లైన తర్వాతే గర్భం దాల్చాలని, లేదా ఆ విషయం వెల్లడించాలనే సంప్రదాయ ధోరణిలో ఎందుకు ఆలోచించారు అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలపై దియా స్పందించింది. గర్భవతిని అయ్యాను కాబట్టి తాను హడావుడిగా పెళ్లి చేసుకున్నాననే అభిప్రాయం తప్పని ఆమె వ్యాఖ్యానించింది. ‘‘వివాహ బంధంతో ముడిపడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. అలాంటి సమయంలోనే మా జీవితంలోకి చిన్నారి రాబోతుందనే విషయం తెలిసింది. గర్భవతిని అయ్యాను కాబట్టి హడావుడిగా పెళ్లి చేసుకోలేదు. ప్రెగ్నెన్సీ గురించి పెళ్లికి ముందే ప్రకటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. ప్రెగ్నెన్సీ విషయంలో అంతా సవ్యంగా సాగుతుందా లేదా అన్నదానిపై కొంత సందిగ్ధత నెలకొంది. కాబట్టి ముందే ఈ విషయం బయటపడలేదు. అంతా బాగుందనుకున్నాక అందరికీ చెబుదాం అనుకున్నాం. నా జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం ఇది. ఇలాంటి ఒకరోజు కోసం నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు ఏ ఆందోళనా లేకుండా నేనెంతో సంతోషంగా ఉన్న సమయంలో ఈ విషయాన్ని వెల్లడించాను’’ దియా పేర్కొంది. తెలుగులో ఇటీవలే విడుదలైన ‘వైల్డ్ డాగ్’ సినిమాలో దియా నాగార్జున భార్యగా నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 6, 2021 6:09 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…