బాలీవుడ్ నటి దియా మీర్జా తల్లి కాబోతున్న విషయం ఇటీవలే వెల్లడైన సంగతి తెలిసిందే. తాను గర్భంతో ఉన్న ఫొటోను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఐతే ఆమె బేబీ బంప్ చూస్తే నాలుగైదు నెలల గర్భంతో ఉన్నట్లు అనిపించింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో దియా పెళ్లి జరిగింది ఫిబ్రవరిలోనే. ఇంతలోనే నాలుగైదు నెలల గర్భంతో ఆమె కనిపించడంతో పెళ్లికి ముందే గర్భవతి అయిందని అర్థమైంది.
ప్రెగ్నెన్సీ రావడం వల్లే ఆమె హడావుడిగా, మరీ సింపుల్గా పెళ్లి చేసుకుందనే అభిప్రాయం జనాల్లో కలిగింది. ఐతే ఒక నెటిజన్ తాజాగా దీని గురించి దియాను సోషల్ మీడియాిలో ప్రశ్నించారు. ఆధునిక మహిళ అయిన దియా.. పెళ్లికి ముందే తాను గర్భవతిని అని ఎందుకు ప్రకటించలేకపోయిందని.. పెళ్లైన తర్వాతే గర్భం దాల్చాలని, లేదా ఆ విషయం వెల్లడించాలనే సంప్రదాయ ధోరణిలో ఎందుకు ఆలోచించారు అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలపై దియా స్పందించింది. గర్భవతిని అయ్యాను కాబట్టి తాను హడావుడిగా పెళ్లి చేసుకున్నాననే అభిప్రాయం తప్పని ఆమె వ్యాఖ్యానించింది. ‘‘వివాహ బంధంతో ముడిపడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. అలాంటి సమయంలోనే మా జీవితంలోకి చిన్నారి రాబోతుందనే విషయం తెలిసింది. గర్భవతిని అయ్యాను కాబట్టి హడావుడిగా పెళ్లి చేసుకోలేదు. ప్రెగ్నెన్సీ గురించి పెళ్లికి ముందే ప్రకటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. ప్రెగ్నెన్సీ విషయంలో అంతా సవ్యంగా సాగుతుందా లేదా అన్నదానిపై కొంత సందిగ్ధత నెలకొంది. కాబట్టి ముందే ఈ విషయం బయటపడలేదు. అంతా బాగుందనుకున్నాక అందరికీ చెబుదాం అనుకున్నాం. నా జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం ఇది. ఇలాంటి ఒకరోజు కోసం నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు ఏ ఆందోళనా లేకుండా నేనెంతో సంతోషంగా ఉన్న సమయంలో ఈ విషయాన్ని వెల్లడించాను’’ దియా పేర్కొంది. తెలుగులో ఇటీవలే విడుదలైన ‘వైల్డ్ డాగ్’ సినిమాలో దియా నాగార్జున భార్యగా నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 6, 2021 6:09 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
+ దేశ సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వానిదే. + దేశ సరిహద్దుల నుంచి పెరుగుతున్న చొరబాట్లను…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…