బాలీవుడ్ నటి దియా మీర్జా తల్లి కాబోతున్న విషయం ఇటీవలే వెల్లడైన సంగతి తెలిసిందే. తాను గర్భంతో ఉన్న ఫొటోను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఐతే ఆమె బేబీ బంప్ చూస్తే నాలుగైదు నెలల గర్భంతో ఉన్నట్లు అనిపించింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో దియా పెళ్లి జరిగింది ఫిబ్రవరిలోనే. ఇంతలోనే నాలుగైదు నెలల గర్భంతో ఆమె కనిపించడంతో పెళ్లికి ముందే గర్భవతి అయిందని అర్థమైంది.
ప్రెగ్నెన్సీ రావడం వల్లే ఆమె హడావుడిగా, మరీ సింపుల్గా పెళ్లి చేసుకుందనే అభిప్రాయం జనాల్లో కలిగింది. ఐతే ఒక నెటిజన్ తాజాగా దీని గురించి దియాను సోషల్ మీడియాిలో ప్రశ్నించారు. ఆధునిక మహిళ అయిన దియా.. పెళ్లికి ముందే తాను గర్భవతిని అని ఎందుకు ప్రకటించలేకపోయిందని.. పెళ్లైన తర్వాతే గర్భం దాల్చాలని, లేదా ఆ విషయం వెల్లడించాలనే సంప్రదాయ ధోరణిలో ఎందుకు ఆలోచించారు అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలపై దియా స్పందించింది. గర్భవతిని అయ్యాను కాబట్టి తాను హడావుడిగా పెళ్లి చేసుకున్నాననే అభిప్రాయం తప్పని ఆమె వ్యాఖ్యానించింది. ‘‘వివాహ బంధంతో ముడిపడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. అలాంటి సమయంలోనే మా జీవితంలోకి చిన్నారి రాబోతుందనే విషయం తెలిసింది. గర్భవతిని అయ్యాను కాబట్టి హడావుడిగా పెళ్లి చేసుకోలేదు. ప్రెగ్నెన్సీ గురించి పెళ్లికి ముందే ప్రకటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. ప్రెగ్నెన్సీ విషయంలో అంతా సవ్యంగా సాగుతుందా లేదా అన్నదానిపై కొంత సందిగ్ధత నెలకొంది. కాబట్టి ముందే ఈ విషయం బయటపడలేదు. అంతా బాగుందనుకున్నాక అందరికీ చెబుదాం అనుకున్నాం. నా జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం ఇది. ఇలాంటి ఒకరోజు కోసం నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు ఏ ఆందోళనా లేకుండా నేనెంతో సంతోషంగా ఉన్న సమయంలో ఈ విషయాన్ని వెల్లడించాను’’ దియా పేర్కొంది. తెలుగులో ఇటీవలే విడుదలైన ‘వైల్డ్ డాగ్’ సినిమాలో దియా నాగార్జున భార్యగా నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 6, 2021 6:09 pm
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…