కొద్ది నెలల క్రితం కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖుడికి చెందిన హోటల్లో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. అక్కడి చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి ఏర్పాటు చేసిన ఈ పార్టీకి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఉదంతం కొద్దిరోజులుగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బెంగళూరు మహానగరంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీలో నిషేధిత డ్రగ్స్ ను వినియోగించటం.. అందుకు బాధ్యులైన కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు.. టాలీవుడ్ నటులు కూడా దీనికి హాజరైన సంచలన నిజాలు బయటకు వచ్చాయి.
తెలంగాణకు చెందిన ముగ్గురు.. నలుగురు ఎమ్మెల్యేలు ఈ పార్టీకి హాజరు కాగా.. ఒకరిద్దరు డ్రగ్స్ వినియోగించినట్లుగా వార్తలు వస్తున్నాయి కానీ వాటిని అధికారికంగా ఖరారు చేయటం లేదు. ఇదిలా ఉంటే.. ఈ పార్టీకి టాలీవుడ్ నటులు కూడా హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం ఒక నటుడ్ని అక్కడి పోలీసులు రెండు రోజులు విచారించారు. అతడితో పాటు మరికొందరిని కూడా విచారించారు. ఈ సందర్భంగా వారు కొన్ని సంచలన నిజాల్ని ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
సదరు పార్టీలో ఇరానీ అమ్మాయిలతో కలిసి మూడు రోజుల పాటు ఎంజాయ్ చేసిన మాట నిజమేనని టాలీవుడ్ కు చెందిన ఒక నటుడు విచారణలో వెల్లడించినట్లుగా చెబుతున్నారు. ఈ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో చిక్కుకున్న కొందరు అఫ్రూవర్స్ గా మారి కీలక సమాచారాన్ని బయటపెట్టటంతో సినీ.. రాజకీయ నేతల పేర్లు వెలుగులోకి వస్తున్నట్లుగా చెప్పాలి. అయితే.. ఈ పార్టీకి హాజరైన తెలంగాణ ప్రజాప్రతినిధులతో పాటు.. టాలీవుడ్ కు చెందిన ప్రముఖుల వివరాల్ని అధికారికంగా వెల్లడించేందుకు బెంగళూరు ఇష్టపడటం లేదు.
విచారణ సాగుతుందని.. వివరాల్ని పూర్తిగా సేకరించిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని.. ఇప్పుడు కానీ పేర్లు బయటపెడితే.. మరికొందరు తప్పించుకునే వీలుందని.. అందుకే విచారణ పూర్తి అయ్యే వరకు వివరాలు వెల్లడించలేమని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. చూస్తుంటే.. రానున్న కొద్ది రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లోనూ.. టాలీవుడ్ లోనూ ఈ డ్రగ్ పార్టీ కలకలం రేపటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on April 6, 2021 9:53 am
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…