Movie News

పార్టీలో ఇరానీ అమ్మాయిలతో 3 రోజులు ఎంజాయ్ చేశామన్న నటుడు

కొద్ది నెలల క్రితం కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖుడికి చెందిన హోటల్లో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. అక్కడి చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి ఏర్పాటు చేసిన ఈ పార్టీకి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఉదంతం కొద్దిరోజులుగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బెంగళూరు మహానగరంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీలో నిషేధిత డ్రగ్స్ ను వినియోగించటం.. అందుకు బాధ్యులైన కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు.. టాలీవుడ్ నటులు కూడా దీనికి హాజరైన సంచలన నిజాలు బయటకు వచ్చాయి.

తెలంగాణకు చెందిన ముగ్గురు.. నలుగురు ఎమ్మెల్యేలు ఈ పార్టీకి హాజరు కాగా.. ఒకరిద్దరు డ్రగ్స్ వినియోగించినట్లుగా వార్తలు వస్తున్నాయి కానీ వాటిని అధికారికంగా ఖరారు చేయటం లేదు. ఇదిలా ఉంటే.. ఈ పార్టీకి టాలీవుడ్ నటులు కూడా హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం ఒక నటుడ్ని అక్కడి పోలీసులు రెండు రోజులు విచారించారు. అతడితో పాటు మరికొందరిని కూడా విచారించారు. ఈ సందర్భంగా వారు కొన్ని సంచలన నిజాల్ని ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

సదరు పార్టీలో ఇరానీ అమ్మాయిలతో కలిసి మూడు రోజుల పాటు ఎంజాయ్ చేసిన మాట నిజమేనని టాలీవుడ్ కు చెందిన ఒక నటుడు విచారణలో వెల్లడించినట్లుగా చెబుతున్నారు. ఈ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో చిక్కుకున్న కొందరు అఫ్రూవర్స్ గా మారి కీలక సమాచారాన్ని బయటపెట్టటంతో సినీ.. రాజకీయ నేతల పేర్లు వెలుగులోకి వస్తున్నట్లుగా చెప్పాలి. అయితే.. ఈ పార్టీకి హాజరైన తెలంగాణ ప్రజాప్రతినిధులతో పాటు.. టాలీవుడ్ కు చెందిన ప్రముఖుల వివరాల్ని అధికారికంగా వెల్లడించేందుకు బెంగళూరు ఇష్టపడటం లేదు.

విచారణ సాగుతుందని.. వివరాల్ని పూర్తిగా సేకరించిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని.. ఇప్పుడు కానీ పేర్లు బయటపెడితే.. మరికొందరు తప్పించుకునే వీలుందని.. అందుకే విచారణ పూర్తి అయ్యే వరకు వివరాలు వెల్లడించలేమని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. చూస్తుంటే.. రానున్న కొద్ది రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లోనూ.. టాలీవుడ్ లోనూ ఈ డ్రగ్ పార్టీ కలకలం రేపటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

Satya

Recent Posts

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

1 hour ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

1 hour ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

2 hours ago

జాన్వీ కపూర్ దురదృష్టం అలా ఉంది

పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…

3 hours ago

కృష్ణలంక వివాదాన్ని బాబు ఎలా హ్యాండిల్ చేశారు?

రాజ‌కీయ చతుర‌త‌లో మ‌రోసారి టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు చాణ‌క్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. స‌ర్కారును ఇరుకున పెట్టేసి.. కుల‌,…

3 hours ago

తినాలని ఉన్నా తినలేని సమంత..

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఫిజిక్, లుక్స్ మీద రకరకాల కామెంట్స్ రావడం చాలా కామన్. కొంచెం బరువు పెరిగినా లేదా…

3 hours ago