కొద్ది నెలల క్రితం కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖుడికి చెందిన హోటల్లో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. అక్కడి చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి ఏర్పాటు చేసిన ఈ పార్టీకి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఉదంతం కొద్దిరోజులుగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బెంగళూరు మహానగరంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీలో నిషేధిత డ్రగ్స్ ను వినియోగించటం.. అందుకు బాధ్యులైన కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు.. టాలీవుడ్ నటులు కూడా దీనికి హాజరైన సంచలన నిజాలు బయటకు వచ్చాయి.
తెలంగాణకు చెందిన ముగ్గురు.. నలుగురు ఎమ్మెల్యేలు ఈ పార్టీకి హాజరు కాగా.. ఒకరిద్దరు డ్రగ్స్ వినియోగించినట్లుగా వార్తలు వస్తున్నాయి కానీ వాటిని అధికారికంగా ఖరారు చేయటం లేదు. ఇదిలా ఉంటే.. ఈ పార్టీకి టాలీవుడ్ నటులు కూడా హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం ఒక నటుడ్ని అక్కడి పోలీసులు రెండు రోజులు విచారించారు. అతడితో పాటు మరికొందరిని కూడా విచారించారు. ఈ సందర్భంగా వారు కొన్ని సంచలన నిజాల్ని ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
సదరు పార్టీలో ఇరానీ అమ్మాయిలతో కలిసి మూడు రోజుల పాటు ఎంజాయ్ చేసిన మాట నిజమేనని టాలీవుడ్ కు చెందిన ఒక నటుడు విచారణలో వెల్లడించినట్లుగా చెబుతున్నారు. ఈ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో చిక్కుకున్న కొందరు అఫ్రూవర్స్ గా మారి కీలక సమాచారాన్ని బయటపెట్టటంతో సినీ.. రాజకీయ నేతల పేర్లు వెలుగులోకి వస్తున్నట్లుగా చెప్పాలి. అయితే.. ఈ పార్టీకి హాజరైన తెలంగాణ ప్రజాప్రతినిధులతో పాటు.. టాలీవుడ్ కు చెందిన ప్రముఖుల వివరాల్ని అధికారికంగా వెల్లడించేందుకు బెంగళూరు ఇష్టపడటం లేదు.
విచారణ సాగుతుందని.. వివరాల్ని పూర్తిగా సేకరించిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని.. ఇప్పుడు కానీ పేర్లు బయటపెడితే.. మరికొందరు తప్పించుకునే వీలుందని.. అందుకే విచారణ పూర్తి అయ్యే వరకు వివరాలు వెల్లడించలేమని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. చూస్తుంటే.. రానున్న కొద్ది రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లోనూ.. టాలీవుడ్ లోనూ ఈ డ్రగ్ పార్టీ కలకలం రేపటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on April 6, 2021 9:53 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…