సిినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు రామ్ చరణ్. ‘రంగస్థలం’లో నాన్ బాహుబలి హిట్ కొట్టాక ‘వినయ విధేయ రామ’ లాంటి పేలవమైన సినిమా చేయడం పెద్ద తప్పు అని అర్థం చేసుకున్న అతను.. దీని తర్వాత మాత్రం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ‘బాహుబలి’ దీటుగా పాన్ ఇండియా లెవెల్లో విజయం సాధించి తనకు తిరుగులేని ఇమేజ్ తెచ్చి పెడుతుందని.. ప్రభాస్ లాగా తాను కూడా పాన్ ఇండియా స్టార్ అవుతానని అతను ధీమాగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలో పెరిగే తన స్థాయికి తగ్గట్లుగానే కొత్త ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నాడు. సౌత్ ఇండియాలో రాజమౌళి కంటే ముందు తిరుగులేని స్థాయిని అందుకున్న శంకర్తో చరణ్ తన తర్వాతి సినిమాను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియా సినిమానే. ఇదే తరహాలో మరో ఆసక్తికర చిత్రాన్ని అతను ప్లాన్ చేసుకున్నాడు.
‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ సినిమా చేయడానికి రంగం సిద్ధమైంది. ఇది ఏడాది ముందు నుంచే చర్చల్లో ఉంది. ఎట్టకేలకు ఆ ప్రాజెక్టు అయినట్లు సమాచారం. అతి త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా రానుందట. ఉగాదికి ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు. ‘జెర్సీ’ హిందీ వెర్షన్ను కూడా గౌతమే డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజయ్యాక గౌతమ్ పేరు బాలీవుడ్లోనూ మార్మోగుతుందని భావిస్తున్నారు.
ఈలోపు ‘ఆర్ఆర్ఆర్’తో చరణ్ కూడా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపే సంపాదిస్తాడు. తర్వాత ఇద్దరూ కలిసి సినిమా చేస్తే ఆటోమేటిగ్గా దానికి పాన్ ఇండియా స్టేటస్ వస్తుందని అంచనా వేస్తున్నారు. గౌతమ్ శైలిలో కొత్తగా ఉంటూనే చరణ్ మాస్ ఇమేజ్కు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్మెంట్తో పాటు మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…