Movie News

దిల్ రాజు పెళ్లి చేసింది ఎవరు?

అగ్ర నిర్మాత దిల్ రాజు సస్పెన్సుకు తెరదించారు. చాన్నాళ్లుగా తన రెండో పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. తన భార్య అనిత మరణించిన నేపథ్యంలో మూడేళ్లుగా ఒంటరిగా ఉంటున్న ఆయన ఆదివారం రాత్రి నిజామాబాద్‌ జిల్లాలోని తన స్వగ్రామంలో పెళ్లి చేుకున్నారు. తనే స్వయంగా కట్టించిన వేంకటేశ్వర స్వామి ఆలయంలో పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య నిరాడంబరంగా ఆయన పెళ్లి చేసుకున్నారు.

వధువు పేరు తేజస్విని అని వెల్లడైంది. ఐతే ఆమ పేరును వ్యాఘ రెడ్డిగా మార్చినట్లు చెబుతున్నారు. ఆస్ట్రాలజీ ప్రకారమే పేరు మార్చారంటున్నారు. వధువు ఒకప్పుడు ఎయిర్ హోస్టెస్‌గా పని చేసిందని.. ఆమె బ్రాహ్మణ అమ్మాయి అని కూడా అంటున్నారు. అంటే దిల్ రాజు చేసుకున్నది కులాంతర వివాహం అన్నమాట.

ఇదిలా ఉంటే దిల్ రాజుకు మళ్లీ పెళ్లి చేయించింది ఆయన తనయురాలే అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. 2017లో భార్య అనిత (46) హఠాత్తుగా మరణించడంతో దిల్ రాజు కుంగిపోయారు. ఆయన అమెరికాలో ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. భార్య మరణానంతరం రాజు ఒంటరిగానే ఉంటున్నారు.

రాజు పెద్ద నిర్మాత అయినా.. ఎప్పుడూ చుట్టూ ఎంతమంది ఉన్నా.. ఇంట్లో ఆయన్ని చూసుకునే దగ్గరి మనిషి లేకపోవడంపై కుమార్తె బాధపడి.. ఆయనకు రెండో పెళ్లి చేయాలని సంకల్పించిందని.. వధువును చూసింది ఆమే అని ఒక కథనం వినిపిస్తోంది.

గత రెండేళ్లలో రాజు రెండో పెళ్లి గురించి కొన్ని షాకింగ్ రూమర్లు వినిపించాయి. ఆదివారం నాటితో వాటన్నింటికీ తెరపడిపోయింది.

This post was last modified on May 11, 2020 2:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

26 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago