అగ్ర నిర్మాత దిల్ రాజు సస్పెన్సుకు తెరదించారు. చాన్నాళ్లుగా తన రెండో పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. తన భార్య అనిత మరణించిన నేపథ్యంలో మూడేళ్లుగా ఒంటరిగా ఉంటున్న ఆయన ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లాలోని తన స్వగ్రామంలో పెళ్లి చేుకున్నారు. తనే స్వయంగా కట్టించిన వేంకటేశ్వర స్వామి ఆలయంలో పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య నిరాడంబరంగా ఆయన పెళ్లి చేసుకున్నారు.
వధువు పేరు తేజస్విని అని వెల్లడైంది. ఐతే ఆమ పేరును వ్యాఘ రెడ్డిగా మార్చినట్లు చెబుతున్నారు. ఆస్ట్రాలజీ ప్రకారమే పేరు మార్చారంటున్నారు. వధువు ఒకప్పుడు ఎయిర్ హోస్టెస్గా పని చేసిందని.. ఆమె బ్రాహ్మణ అమ్మాయి అని కూడా అంటున్నారు. అంటే దిల్ రాజు చేసుకున్నది కులాంతర వివాహం అన్నమాట.
ఇదిలా ఉంటే దిల్ రాజుకు మళ్లీ పెళ్లి చేయించింది ఆయన తనయురాలే అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. 2017లో భార్య అనిత (46) హఠాత్తుగా మరణించడంతో దిల్ రాజు కుంగిపోయారు. ఆయన అమెరికాలో ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. భార్య మరణానంతరం రాజు ఒంటరిగానే ఉంటున్నారు.
రాజు పెద్ద నిర్మాత అయినా.. ఎప్పుడూ చుట్టూ ఎంతమంది ఉన్నా.. ఇంట్లో ఆయన్ని చూసుకునే దగ్గరి మనిషి లేకపోవడంపై కుమార్తె బాధపడి.. ఆయనకు రెండో పెళ్లి చేయాలని సంకల్పించిందని.. వధువును చూసింది ఆమే అని ఒక కథనం వినిపిస్తోంది.
గత రెండేళ్లలో రాజు రెండో పెళ్లి గురించి కొన్ని షాకింగ్ రూమర్లు వినిపించాయి. ఆదివారం నాటితో వాటన్నింటికీ తెరపడిపోయింది.
This post was last modified on May 11, 2020 2:02 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…