కరోనా విరామం తర్వాత టాలీవుడ్లోనే కాదు.. మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే రిలీజవుతున్న తొలి భారీ చిత్రం వకీల్ సాబ్. మామూలుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజవుతుంటే అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. అలాంటిది అతను మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని.. రీఎంట్రీ ఇస్తుండటంతో ఫ్యాన్స్ వెర్రెత్తిపోయి ఉన్నారు. ఈ సినిమా మొదలైనప్పటితో పోలిస్తే.. రిలీజ్ సమయానికి భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
పవన్ రీఎంట్రీ మూవీని ఎలా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారో మొన్న ట్రైలర్ రిలీజ్ సందర్భంగా శాంపిల్ చూపించారు. అప్పుడే అలా ఉంటే సినిమా రిలీజ్ టైంలో ఇంకెలా ఉంటుందో అని అంతా అనుకున్నారు. కానీ పవన్ అభిమానులు ఉత్సాహానికి బ్రేకులు వేసేలా ఉంది కరోనా మహమ్మారి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్లాన్ చేసిన బెనిఫిట్/అదనపు షోలు ఏవీ కూడా సాధ్యపడే పరిస్థితి కనిపించడం లేదు.
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లోనూ సెకండ్ వేవ్ గట్టి ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో సినిమాలకు వంద శాతం ఆక్యుపెన్సీని కొనసాగించే విషయంలోనూ పునరాలోచన చేసే పరిస్థితి నెలకొంది. అలాంటిది బెనిఫిట్ షోలు, అదనపు షోలు అంటే చాలా కష్టం. కాబట్టి అర్ధరాత్రి నుంచి ఏపీలో పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలు వేయడానికి ప్లాన్ చేసుకున్న అభిమాన సంఘాల వాళ్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఇది పెద్ద ఎదురు దెబ్బే.
తెలంగాణలో ఐదో షోకు అనుమతులు రావడం అసాధ్యం అనే అంటున్నారు. మరోవైపు కరోనా నేపథ్యంలో ఇంతకుముందు అనుకున్నట్లు భారీ స్థాయిలో ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా ఏమీ నిర్వహించేలా లేరు. మరీ ఈవెంటే లేదు అనిపించకుండా.. ఒక స్టార్ హోటల్లో అభిమానులెవరూ లేకుండా సింపుల్గా ఈవెంట్ చేయబోతున్నారట. ఈ పరిణామాలు అభిమానులకు నిరాశ కలిగించినప్పటికీ.. వేరే రాష్ట్రాల్లో అసలు ఆక్యుపెన్సీనే తగ్గించేస్తుండటం, సినిమాల ప్రదర్శనే ఆపేయాలని చూస్తున్న నేపథ్యంలో ఈమాత్రమైనా ఉన్నందుకు సంతోషించాల్సిందే.
This post was last modified on April 3, 2021 7:05 am
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…