కరోనా విరామం తర్వాత టాలీవుడ్లోనే కాదు.. మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే రిలీజవుతున్న తొలి భారీ చిత్రం వకీల్ సాబ్. మామూలుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజవుతుంటే అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. అలాంటిది అతను మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని.. రీఎంట్రీ ఇస్తుండటంతో ఫ్యాన్స్ వెర్రెత్తిపోయి ఉన్నారు. ఈ సినిమా మొదలైనప్పటితో పోలిస్తే.. రిలీజ్ సమయానికి భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
పవన్ రీఎంట్రీ మూవీని ఎలా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారో మొన్న ట్రైలర్ రిలీజ్ సందర్భంగా శాంపిల్ చూపించారు. అప్పుడే అలా ఉంటే సినిమా రిలీజ్ టైంలో ఇంకెలా ఉంటుందో అని అంతా అనుకున్నారు. కానీ పవన్ అభిమానులు ఉత్సాహానికి బ్రేకులు వేసేలా ఉంది కరోనా మహమ్మారి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్లాన్ చేసిన బెనిఫిట్/అదనపు షోలు ఏవీ కూడా సాధ్యపడే పరిస్థితి కనిపించడం లేదు.
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లోనూ సెకండ్ వేవ్ గట్టి ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో సినిమాలకు వంద శాతం ఆక్యుపెన్సీని కొనసాగించే విషయంలోనూ పునరాలోచన చేసే పరిస్థితి నెలకొంది. అలాంటిది బెనిఫిట్ షోలు, అదనపు షోలు అంటే చాలా కష్టం. కాబట్టి అర్ధరాత్రి నుంచి ఏపీలో పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలు వేయడానికి ప్లాన్ చేసుకున్న అభిమాన సంఘాల వాళ్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఇది పెద్ద ఎదురు దెబ్బే.
తెలంగాణలో ఐదో షోకు అనుమతులు రావడం అసాధ్యం అనే అంటున్నారు. మరోవైపు కరోనా నేపథ్యంలో ఇంతకుముందు అనుకున్నట్లు భారీ స్థాయిలో ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా ఏమీ నిర్వహించేలా లేరు. మరీ ఈవెంటే లేదు అనిపించకుండా.. ఒక స్టార్ హోటల్లో అభిమానులెవరూ లేకుండా సింపుల్గా ఈవెంట్ చేయబోతున్నారట. ఈ పరిణామాలు అభిమానులకు నిరాశ కలిగించినప్పటికీ.. వేరే రాష్ట్రాల్లో అసలు ఆక్యుపెన్సీనే తగ్గించేస్తుండటం, సినిమాల ప్రదర్శనే ఆపేయాలని చూస్తున్న నేపథ్యంలో ఈమాత్రమైనా ఉన్నందుకు సంతోషించాల్సిందే.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…